India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హలో ఫుడ్ లవర్స్. నోరూరించే ఓ లిస్ట్ చెప్తా నోట్ చేసుకోండి. ఇండియాలోని బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ను టేస్ట్ అట్లాస్ రిలీజ్ చేసింది. HYDలో బిర్యానీ, పెసర దోశ, చికెన్ 65, కరాచీ బిస్కెట్స్, ఇడ్లీ. ఢిల్లీలో దాల్ మఖానీ, ముర్ఘ్ ముఖానీ, గులాబ్ జామూన్. ముంబైలో భేల్ పూరీ, వడాపావ్. అమృత్సర్లో కుల్చా, పాలక్ పన్నీర్, దాల్ ముఖానీ. కోల్కతాలో రసగుల్లా, రోష్ మలాయ్. చెన్నైలో దోశ, ఇడ్లీ, చికెన్ 65. రుచిచూస్తారా మరి?
TG: రానున్న 2 రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ రేసు కేసులో KTR చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి <<14899057>>పొంగులేటి<<>> చెప్పారు. విచారణకు గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడంతో రేపు లేదా ఎల్లుండి KTRకు ACB నోటీసులు పంపే అవకాశం ఉంది. అనంతరం విచారణ నిమిత్తం ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరింత ఎనర్జీతో ఆడాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ సూచించారు. దూకుడును చూపించాలని కోరారు. ‘రోహిత్ అంటే చాలా స్వేచ్ఛగా ఆడే ఆటగాడు. కానీ ఈ సిరీస్లో ఆయన బ్యాటింగ్ చాలా నీరసంగా ఉంటోంది. అలాంటి ప్లేయర్ బాల్ను డిఫెన్స్ ఆడాలని చూడకూడదు. తన సహజమైన ఆటను ఆడాలి. సోదరా.. మరింత దూకుడును చూపించండి’ అని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
*డిసెంబర్ 28న భూమిలేని వారికి రూ.6వేల సాయం
*సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ
2025 మార్చి నెలకు సంబంధించి శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు TTD ప్రకటించింది. మరిన్ని వివరాలు..
* 21న ఉ.10 గంటలకు ఆర్జితసేవ, మ.3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు
* 23న ఉ.10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉ.11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు
* 23న మ.3 గం.కు వయోవృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లు.
వెబ్సైట్: <
TG: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనుమతి లెటర్ను ఇవాళ రాత్రి లేదా రేపు ఏసీబీకి సీఎస్ పంపిస్తారని వెల్లడించారు. కేటీఆర్ అరెస్టుపై తానేమీ చెప్పలేనని, చట్టప్రకారం ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తుందని వ్యాఖ్యానించారు. తమ బాంబు తుస్సుమనేదైతే ఆయన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు.
LSలో మంగళవారం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనుండడంతో పార్టీ MPలకు BJP విప్ జారీ చేసింది. రేపు ఓటింగ్ జరిగే అవకాశం లేకున్నా తదుపరి సార్వత్రిక ఎన్నికల అజెండాను సెట్ చేసే అంశం కావడంతో BJP ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అర్జున్ మేఘ్వాల్ దీన్ని ప్రవేశపెట్టాక చర్చను ప్రారంభిస్తారా? లేక వెనువెంటనే అధికార, విపక్ష సభ్యులతో JPCని ప్రకటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల రైతులు ఉదయం 10 నుంచి సాయంత్రం 4లోపు పొలం పనులు చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. సోమవారం మండలిలో ఆమె మాట్లాడుతూ శీతాకాలంలో వన్యప్రాణుల సంచారం అధికంగా ఉండడంతో, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారు ప్రమాదాల బారినపడుతున్నారని వివరించారు. Man-Animal Conflict బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. DEC 4న హీరో, హీరోయిన్ రావొద్దని ‘సంధ్య’ యాజమాన్యానికి పోలీసులు చెప్పినట్లు ఓ రిపోర్ట్ వైరల్ అవుతోంది. ‘అనుమతి లేకుండా ర్యాలీగా వచ్చారు. అభిమానులు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లేటప్పుడూ ర్యాలీగా అభివాదాలు తెలుపుతూ వెళ్లారు’ అని పోలీసులు చెప్పినట్లు అందులో ఉంది. దీన్ని పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది.
జవనరి 13 నుంచి UPలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ప్రారంభంకానుంది. పవిత్ర సాన్నమాచరించడానికి ప్రత్యేక ఘడియలను సూచిస్తున్నారు. Jan 13న(పుష్య పూర్ణిమ), 14న (మకర సంక్రాంతి), 29న (మౌని అమావాస్య), ఫిబ్రవరి 4న(వసంత పంచమి), 12న మాఘ పూర్ణిమ, 26న మహా శివరాత్రి రోజున పవిత్ర స్నానాలకు శుభదినాలని చెబుతున్నారు. 2019లో 25 కోట్ల మంది భక్తులు రాగా, ఈసారి 40 Cr మంది వస్తారని అంచనా.
Sorry, no posts matched your criteria.