India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వాట్సాప్ గవర్నెన్స్కు ప్రాధాన్యం కల్పిస్తూ మరిన్ని కొత్తసేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. కాకినాడలోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో వ్రతాలు, దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9552300009 నంబర్కు Hi అని మెసేజ్ చేస్తే ఆన్లైన్ చెల్లింపుల ద్వారా టికెట్లు ఇవ్వనుంది. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం వంటి క్షేత్రాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ నుంచి ఈరోజు టీజర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో దీనిపై మరింత హైప్ పెంచేలా నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘గౌతమ్ నుంచి ఇలాంటిది ఊహించలేదు. VD12 టీజర్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. గత రెండేళ్లుగా మేము సృష్టించిన ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాయి. వాయిస్, మ్యూజిక్ అదిరిపోతాయి’ అని పేర్కొన్నారు.

‘ఇండియా గాట్ లాటెంట్’ షో జడ్జి, ఇన్ఫ్లూయెన్సర్ అపూర్వా మఖీజాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్ సహా కొన్ని షోల్లో యథేచ్ఛగా బూతులు మాట్లాడటంపై FIR ఫైల్ చేశారు. మొన్న పేరెంట్స్ సెక్స్పై వల్గర్గా మాట్లాడిన యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా, సమయ్ రైనాపై కేసు బుక్కైంది. ఇందులో పాల్గొన్న యువతి అపూర్వను పట్టించుకోలేదు. దీంతో మగాళ్లు మాత్రమే శిక్షకు అర్హులా, అమ్మాయిలు కాదా అని విమర్శలు వచ్చాయి.

దేశంలో ప్రత్యక్ష పన్నులు YoY 19.06% వృద్ధిరేటుతో FY2024-25లో ₹21.88L CRకు చేరుకున్నాయని ITశాఖ తెలిపింది. FY23-24లో ఇవి ₹18.38L CR కావడం గమనార్హం. IT రీఫండ్స్ చెల్లించాక మిగిలింది ₹18.38L CR. కార్పొరేట్ పన్నులు ₹8.74L CR నుంచి ₹10.08L CR, నాన్ కార్పొరేట్ పన్నులు ₹9.30L CR నుంచి ₹11.28L CR, STT రాబడి ₹29,808CR నుంచి ₹49,201CRకు పెరిగాయి. వెల్త్ ట్యాక్స్ మాత్రం ₹3,461CR నుంచి ₹3,059CRకు తగ్గాయి.

ఢిల్లీలోని ఓక్లా MLA అమనతుల్లా ఖాన్ (ఆప్) కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన నిన్నటి నుంచి పరారీలో ఉన్నారు. దీంతో టీములుగా విడిపోయిన అధికారులు ఢిల్లీ, రాజస్థాన్, యూపీలో సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన్ను పట్టుకుంటామని అంటున్నారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన షాబాజ్ ఖాన్ తప్పించుకొనేందుకు మద్దతుదారులతో కలిసి ఆయన సాయం చేశారని నిన్న FIR నమోదైంది. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు.

కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.

బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.

AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు ఈ నెల 19 నుంచి 23 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏపీలో బర్డ్ ఫ్లూతో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ప్రారంభమైంది. ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో సాధారణంగా రోజుకు 6 లక్షల కేజీల చికెన్ అమ్ముడవుతుంది. కానీ ఇప్పుడు 50 శాతం అమ్మకాలు పడిపోయాయి. దీంతో కేజీ చికెన్ రేటు రూ.150కి పడిపోయింది. ఏపీలోని తూ.గో., ప.గో., కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో భారీగా కోళ్లు చనిపోతున్నాయి.

స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,862 (-209), సెన్సెక్స్ 75,570 (-730) వద్ద ట్రేడవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ప్రభావంతో గ్లోబల్ సప్లయి చైన్ దెబ్బతింటుందన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్ముతున్నారు. ఇండియా విక్స్ 2.75% పెరిగి 15.28కి చేరుకుంది. IT షేర్లు రాణిస్తున్నాయి. మీడియా, రియాల్టి, బ్యాంకు, హెల్త్కేర్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి.
Sorry, no posts matched your criteria.