News February 12, 2025
తగ్గిన బంగారం ధర

కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.
Similar News
News March 20, 2025
ఈ నెల 29న సూర్య గ్రహణం

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.
News March 20, 2025
కేంద్ర మంత్రి కుటుంబంలో కాల్పుల కలకలం

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబ సభ్యుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. బిహార్లోని నవ్గచియాలో ఆయన మేనల్లుళ్లు అయిన విశ్వజిత్, జైజిత్ మధ్య నల్లా నీటి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. విశ్వజిత్ బుల్లెట్ గాయాలతో మరణించగా జైజిత్, తల్లి(నిత్యనందరాయ్ సోదరి) గాయపడ్డారు. జైజిత్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని భాగల్పూర్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 20, 2025
అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారు: కేటీఆర్

TG: ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాపై కాంగ్రెస్ ఉక్కుపాదం మోపిందని కేటీఆర్ విమర్శించారు. తాజా బడ్జెట్ను ఉద్దేశించి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని దుయ్యబట్టారు. అధికారం కోసం అశోక్ నగర్ వెళ్లి, తీరా అధికారం వచ్చాక నిరుద్యోగుల గొంతునొక్కారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు, దాడులు చేస్తున్నారని, కాంగ్రెస్ అరాచక పాలన రాహుల్ గాంధీకి కనిపించట్లేదా అని నిలదీశారు.