news

News November 15, 2024

నెలకు రూ.5వేలు.. నేడే లాస్ట్ డేట్

image

కేంద్రం అమలు చేస్తున్న ‘పీఎం ఇంటర్న్ షిప్’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో (నవంబర్ 15) ముగియనుంది. దీని ద్వారా ప్రభుత్వం టాప్-500 కంపెనీల్లో యువతకు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తుంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివి, 21-24 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులు. ఎంపికైన వారికి ప్రభుత్వం నెలకు రూ.5వేలు స్టైఫండ్ ఇస్తుంది. https://pminternship.mca.gov.in సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

News November 15, 2024

కానిస్టేబుల్ రాతపరీక్ష ‘కీ’పై హైకోర్టు కీలక ఆదేశాలు

image

AP: గత ఏడాది జనవరి 22న నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ‘కీ’కి సంబంధించిన వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు APSLPRBని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఏడు ప్రశ్నలకు ‘కీ’లో ఇచ్చిన సమాధానాలు సరైనవి కావని, దీనివల్ల తాము అనర్హులయ్యామంటూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. కాగా 6,100 కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు.

News November 15, 2024

టాలీవుడ్‌లోకి స్టార్ డైరెక్టర్ కూతురు.. ఫస్ట్ లుక్ చూశారా?

image

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. <<14591707>>’భైరవం’ సినిమాలో<<>> వెన్నెల అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకుడు. ఇందులో సాయి శ్రీనివాస్‌కు ఆమె జంటగా నటిస్తున్నట్లు సమాచారం.

News November 15, 2024

బ్రష్ చేసిన వెంటనే టీ/కాఫీ తాగుతున్నారా?

image

ఉదయం బ్రష్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగడం ప్రమాదకరమని డెంటిస్టులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల దంతాల ఎనామెల్‌ను దెబ్బతింటుందట. బ్రష్ చేయడం వల్ల దంతాలపై బ్యాక్టీరియా తొలగిపోయి సెన్సిటివ్‌గా మారతాయి. దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుందట. అందుకే బ్రష్ చేసిన 30ని.షాల తర్వాత టీ లేదా కాఫీ తీసుకోవడం ఉత్తమం అంటున్నారు.

News November 15, 2024

ఈ ప్రాంతాల్లో వర్షాలు

image

AP: ఈరోజు కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, YSR, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్సుందని HYD IMD పేర్కొంది.

News November 15, 2024

ఉదయం పాటించాల్సిన మంచి అలవాట్లు!

image

* ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవాలి. రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది.
* రోజూ సూర్యరశ్మిలో కాసేపు ఉండాలి. D విటమిన్ లభిస్తుంది.
* నిద్రలేవగానే హఠాత్తుగా బెడ్‌పై నుంచి లేవకూడదు. కళ్లు తిరిగే ప్రమాదం ఉంటుంది.
* మార్నింగ్ 30ని.లు ఎక్సర్‌సైజ్ చేస్తే మంచిది.
* ఆ రోజు ఏం చేయాలో పొద్దున్నే ప్లాన్ చేసుకోవాలి.

News November 15, 2024

నేటి నుంచి ఈ-పంట నమోదు

image

AP: రబీ సీజన్‌కు సంబంధించి సాగుచేసిన ప్రతి పైరునూ నమోదు చేసే ఈ-పంట కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. జియో ఫెన్సింగ్ ద్వారా గరిష్ఠ నిడివి 50 మీటర్లలోపు పంట వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 15 నాటికి జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు. ఏవైనా ప్రభుత్వ పరిహారాలు అందాలంటే ఇందులో నమోదుచేసుకోవడం తప్పనిసరి.

News November 15, 2024

టీ20 సిరీస్ ఇంగ్లండ్ కైవసం

image

మూడో టీ20లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 145/8 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 3 వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.

News November 15, 2024

కులగణనతో ఏ పథకం రద్దు కాదు: సీఎం రేవంత్

image

TG: కులగణన వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకం తొలగిపోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆయన, ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాంటిదని చెప్పారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన జరగాలని అన్నారు. కొంత మంది దీనిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

News November 15, 2024

RTC బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ

image

బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు APSRTC ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ RTC బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్ సిటిజన్లకు 60ఏళ్ల వయసు పైబడి ఉండాలి. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని APSRTC తెలిపింది.