news

News December 16, 2024

శ్రీవారి భక్తులకు అలర్ట్

image

AP: నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు చేయనున్నట్లు పేర్కొన్నారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చాన, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను స్వామివారికి అలంకరించనున్నారు. నైవేద్యంగా బెల్లం దోశ, సిరా, పొంగల్ నివేదించనున్నారు.

News December 16, 2024

ఆ స్టార్లతో మూవీ చేయాలని ఉంది: అల్లరి నరేశ్

image

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ వంటి స్టార్లతో మూవీ చేయాలని ఉందని అల్లరి నరేశ్ చెప్పారు. ‘బచ్చలమల్లి’లో తనది సీరియస్ క్యారెక్టర్ అని తెలిపారు. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయన్నారు. వచ్చే ఏడాది తన నుంచి రెండు కామెడీ చిత్రాలు వస్తాయని తెలిపారు. తన పాత్ర బాగుంటే మల్టీ‌స్టారర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని పేర్కొన్నారు. గమ్యం, మహర్షి వంటి చిత్రాల్లో నరేశ్ కీలక పాత్రలో నటించారు.

News December 16, 2024

బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి: సీతక్క

image

TG: గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చర్చ జరిగింది. ప్రభుత్వం బకాయిలు రూ.691 కోట్లు విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వమే ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంటే బాగుండేదని మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. BRS అంటే బకాయిల రాష్ట్ర సమితిగా మారిందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెలా రూ.274 కోట్లు గ్రామ పంచాయతీలకు ఇచ్చామని హరీశ్ సమాధానమిచ్చారు.

News December 16, 2024

457 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

457 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి UPSC <>నోటిఫికేషన్ <<>>విడుదల చేసింది. అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 1 నుంచి 7 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చు. 20-24 ఏళ్లలోపు పెళ్లి కాని వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఫీజు రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితం. మరిన్ని వివరాలకు https://upsconline.gov.inను చూడండి.

News December 16, 2024

త్వరలో రష్యా వీసా ఫ్రీ

image

వీసా లేకుండానే భారతీయులు రష్యాలో పర్యటించే అవకాశం త్వరలోనే రానుంది. అక్కడ పర్యటించే ఇండియన్స్ సంఖ్య పెరుగుతుండటంతో వీసా ఫ్రీ సౌకర్యాన్ని కల్పించనుంది. ఏ పనిపై వచ్చారన్న సమాచారం ఆధారంగా వీసాలు మంజూరు చేస్తారు. భారతీయుల విషయంలో వీసా రూల్స్ సడలించాలని జూన్‌లో భారత్-రష్యా అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం టూరిస్ట్, బిజినెస్, ఉద్యోగం, స్టూడెంట్ సహా పలు రకాల వీసాలున్నా, వీటి మంజూరుకు సమయం పడుతుంది.

News December 16, 2024

4 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

image

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ మరోసారి వర్షం కారణంగా నిలిచిపోయింది. వర్షం మొదలయ్యే సమయానికి టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. పంత్ 9 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. క్రీజులో రాహుల్(30*), రోహిత్(1) ఉన్నారు. భారత్ ఇంకా 397 పరుగులు వెనుకబడి ఉంది.

News December 16, 2024

STOCK MARKETS: నష్టాల్లోనే మొదలు..

image

స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో మొదలయ్యాయి. ఫెడ్ మీటింగ్, గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. నిఫ్టీ 24,699 (-70), సెన్సెక్స్ 81,874 (-252) వద్ద ట్రేడవుతున్నాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు లాభాల్లో ఉన్నాయి. బ్యాంకు, IT, ఆటో, మెటల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. INDUSIND, SRIRAM FIN, CIPLA, RIL, BAJAJ FIN టాప్ గెయినర్స్. JSW స్టీల్, TITAN, APOLLOHOSP, TCS టాప్ లూజర్స్.

News December 16, 2024

GOOD NEWS.. ఇక ఆన్‌లైన్‌‌లోనే అన్ని సర్టిఫికెట్లు!

image

TG: జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికెట్ల కోసం ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునేలా కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ పరిధిలో బర్త్, డెత్, మ్యారేజ్, హౌజ్ పర్మిషన్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, లే ఔట్ పర్మిషన్ వంటి 20 రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే అందించేలా ‘మై-పంచాయతీ’ యాప్‌ను రూపొందిస్తోంది. గ్రామ సమస్యలపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సమాచారం.

News December 16, 2024

మీరంతా సున్నాలు వేసే సన్నాసి బ్యాచే: KTR

image

TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిర్మించిన ఇళ్లకు సున్నాలు వేసి ఇందిరమ్మ ఇళ్లని కాంగ్రెస్ నేతలు ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయడం రేవంత్ తరం కాదన్నారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందివ్వడం కేసీఆర్ కల అని పేర్కొన్నారు. ఎన్నాళ్లైనా ఆ నిర్మాణాలకు మీరంతా సున్నాలు వేసే సన్నాసి బ్యాచ్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు.

News December 16, 2024

కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ!

image

‘INDIA’లో ఐక్యతకు బీటలు వారుతున్నాయి. కాంగ్రెస్, రాహుల్‌పై మిత్రపక్షాలు విశ్వాసం కోల్పోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొన్నటి వరకు నాయకత్వం మమతకు విడిచిపెట్టాలని డిమాండ్ చేశాయని, ఇప్పుడు EVMలపై ఆ పార్టీ వైఖరిని ఖండిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఓటింగ్ యంత్రాలపై ఇకనైనా నసుగుడు ఆపాలని JK CM <<14888698>>ఒమర్<<>> అబ్దుల్లా అనడాన్ని ఉదహరిస్తున్నాయి. కాంగ్రెస్‌పై మిత్రపక్షాల విమర్శలు చేటు చేస్తాయనడంపై మీ కామెంట్.