India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరుణ్ ధవన్, సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ రికార్డ్ సృష్టించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా 200 దేశాల్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. 150 దేశాల్లో టాప్ 10లో దూసుకుపోతూ ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సిరీస్గా రికార్డ్ నెలకొల్పింది. డైరెక్టర్లు రాజ్, డీకే స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా సిటాడెల్కు వస్తున్న రెస్పాన్స్ థ్రిల్కు గురిచేస్తోందన్నారు. నవంబర్ 6న ఈ సిరీస్ రిలీజైన విషయం తెలిసిందే.
AP: 22A పేరుతో గత ప్రభుత్వం భారీగా భూదోపిడీకి పాల్పడిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో వెల్లడించారు. కావాల్సిన విధంగా చట్టాలు మార్చుకుని 6 లక్షల ఎకరాలను అమ్ముకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎంతో చర్చించి హౌస్ కమిటీ వేసే ఆలోచనలో ఉన్నామన్నారు. అటు భూ దోపిడీ జరిగిన మాట వాస్తవమేనని, హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించి వాస్తవాలు బయటకు తీయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.
TG: లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో KTR హస్తం ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. గతంలో తనపై జరిగిన దాడిలో కూడా KTR పాత్ర ఉందన్నారు. ‘BRSను నామరూపాలు లేకుండా చేయాలి. KTRను జైలుకు పంపాలి. మళ్లీ బయటకు రాకూడదు. ఇంకా అహంకారంగానే, కొవ్వు పట్టినట్లే ఆయన మాట్లాడుతున్నారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
ఎక్కువ మందిని కనమంటున్న AP CM చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. జపాన్ తరహాలో మానవ వనరుల సంక్షోభం రావొద్దన్న ఆయన ఉద్దేశంలో అర్థం ఉందంటున్నారు. ఎక్కువ మందిని కనడం OKగానీ వాళ్లను పెంచి పెద్దచేయడం, చదువు చెప్పించడం ఎలాగని ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో స్కూలు ఫీజులు, ఆస్పత్రి ఖర్చులు, తక్కువ జీతాలతో ఎలా సాకగలమని అంటున్నారు. ప్రత్యేకంగా స్కీములు ప్రకటిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు.
TG: తమ ప్రభుత్వం ఏ విషయంలో విఫలమైందో KTR చెప్పాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ చేశారు. ‘నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే తప్పా? ప్రజలకు మంచి చేయడమే తప్పా? కులగణన, ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా? అధికారం కోసం బీఆర్ఎస్ ప్రజలను రెచ్చగొడుతోంది. ఫార్మా క్లస్టర్స్ విస్తరణను వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని. మా ప్రభుత్వాన్ని కూల్చడంపైనే BRS దృష్టి పెట్టింది’ అని భట్టి ఆరోపించారు.
మహీంద్రాకు చెందిన XUV 3X0, థార్ రాక్స్, XUV 400 కార్లకు BNCAP టెస్టులో 5 స్టార్ రేటింగ్ లభించింది. ప్రయాణికులకు కారు ఎంత భద్రత కల్పిస్తుందో చూసేందుకు చేసే పరీక్షలే NCAP టెస్టులు. ప్రపంచవ్యాప్తంగా చేసే పరీక్షల్ని Global NCAPగా, ఇండియాలో చేసే టెస్టుల్ని Bharat NCAPగా పిలుస్తారు. రేటింగ్ ఎంత బాగుంటే అంత సురక్షితమైనవిగా పరిగణిస్తారు. మారుతి డిజైర్కు ఇటీవల 5 స్టార్ రేటింగ్ దక్కిన సంగతి తెలిసిందే.
లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్(58) దాదాపు 19 ఏళ్ల తర్వాత రింగులోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ యూట్యూబర్ జేక్ పాల్(27)తో రేపు తలపడనున్నారు. డల్లాస్లో జరిగే ఈ మ్యాచ్ను నెట్ప్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. బాక్సింగ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన టైసన్ 2005లో చివరి మ్యాచ్ ఆడారు. 1985లో కెరీర్ ఆరంభించిన ఆయన వరుసగా 37 మ్యాచ్లను గెలిచారు. మొత్తంగా 50-6తో కెరీర్ ముగించారు.
కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన అల్లర్లతో మణిపుర్ అట్టుడికిపోతోంది. ఇటీవల జిరిబామ్ జిల్లాలో కుకీ తెగకు చెందిన మహిళా టీచర్(31)పై అనుమానిత మెయితీ దుండగులు అత్యాచారం చేసి దహనం చేసిన కేసులో దారుణ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఆమె శరీరం 99% కాలిపోవడంతో అత్యాచార నమూనాలు తీయడం సాధ్యం కాలేదు. 8 చోట్ల గాయాలున్నాయి. ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. పుర్రె వేరుపడింది’ అని అటాప్సీ రిపోర్టు వెల్లడించింది.
తల్లిదండ్రులు ఆస్తులు కూడబెట్టేది పిల్లల కోసమే! అందుకే వాళ్ల రిటైర్మెంటు కార్పస్నూ పేరెంట్సే క్రియేట్ చేసేందుకు తీసుకొచ్చిన స్కీమే <<14158275>>NPS వాత్సల్య<<>>. పిల్లల్లో ఆర్థిక క్రమశిక్షణ పెంచేందుకూ ఇది ఉపయోగపడుతుంది. PFRDA వద్ద ఖాతా ఆరంభించి నెలకు కనీసం రూ.1000 జమ చేయాలి. పిల్లలకు 18ఏళ్లు నిండాక రెగ్యులర్ NPSగా మారుతుంది. అప్పట్నుంచి 60 ఏళ్ల వరకు వాళ్లే జమచేయాలి. RoR 12.86% ఉంటే రూ.12 కోట్లు అందుతాయి.
ప్రపంచాన్ని మధుమేహం వేగంగా కబళిస్తోంది. డయాబెటిస్తో బాధపడేవారి సంఖ్య గడచిన 30 ఏళ్లలో రెండింతలైంది. ది లాన్సెట్ జర్నల్ ఈ విషయాన్ని తెలిపింది. దాని ప్రకారం.. 1990లో ప్రపంచవ్యాప్తంగా 7శాతం పెద్దల్లో షుగర్ ఉండగా 2022 నాటికి అది 14శాతానికి పెరిగింది. అంకెల్లో చూస్తే వరల్డ్వైడ్గా 80 కోట్లమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు. భారత్లోనూ మధుమేహుల సంఖ్య వేగంగా పెరుగుతోందని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేసింది.
Sorry, no posts matched your criteria.