India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డెమొక్రటిక్ మాజీ నేత తులసి గబ్బర్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్కు అమెరికా సాయం చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. డెమొక్రటిక్ విధానాలతో విభేదించిన గబ్బర్డ్ 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఆమె గొప్ప స్ఫూర్తిని తీసుకురాగలరని ట్రంప్ కొనియాడారు.
TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు విద్యార్థులతో విద్యా దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది. నేడు HYDలోని LB స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 14,000 మంది విద్యార్థులు పాల్గొంటారు. కాగా SCERT కార్యాలయంలో నిర్వహించే ‘మాక్ అసెంబ్లీ’కి CM రేవంత్ హాజరవుతారు.
AP: తమ నివాసానికి దూరంగా ఉన్న GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ రూ.13.53 కోట్లు విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని 22,558 మందికి లబ్ధి చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రూ.6వేల చొప్పున అందించనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం KM దూరంలో ప్రాథమిక, 3KM లోపల ప్రాథమికోన్నత, 5KM దూరంలో ఉన్నత పాఠశాలలు ఉండాలి. లేదంటే ట్రావెల్ అలవెన్స్ చెల్లించాలి.
AP: విశాఖలో 76.90KM మేర మెట్రో రైలు ప్రాజెక్టుపై పంపిన డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. తొలి దశలో 3 కారిడార్లలో 46KMల మేర నిర్మించడానికి రూ.11,498 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. దీనికి 100 శాతం నిధులూ కేంద్రమే భరించేలా ప్రతిపాదనలు పంపామని, అక్కడి నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
TG: జీవోలు, ఆర్డినెన్సులను తెలుగులో వెలువరించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లిష్లో ఇవ్వడం వల్ల అవి సామాన్యులకు అర్థం కావడం లేదని శేరిలింగంపల్లికి చెందిన జి.ఉమామహేశ్వర్రావు పిటిషన్ వేశారు. తెలుగులో ఇవ్వకపోవడం అధికార భాషల చట్టం 1956తో పాటు పలు జీవోలకు విరుద్ధమని ఆయన తరఫు లాయర్ అన్నారు. ఈ అంశాన్ని విచారణకు స్వీకరించే విషయంలో కోర్టు నోటీసులచ్చింది.
AP: డయేరియా మరణాలపై మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. విజయనగరం(D) గుర్ల, వివిధ ప్రాంతాల్లో ఎంతమంది చనిపోయారో చెప్పాలని YCP MLCలు ప్రశ్నించారు. గుర్లలో ఒక్కరే మరణించారని మంత్రి సత్యకుమార్ చెప్పారు. Dy.cm పవన్ గుర్లలో 10 మంది చనిపోయారని ₹2 లక్షల పరిహారం ప్రకటించారని, జగన్ కూడా అదేమేర సాయం చేశారని సభ్యులు గుర్తుచేశారు. మంత్రి నేరుగా ఆన్సరివ్వకుండా YCP పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
సూర్య మూవీ ‘కంగువా’కు మిక్సుడ్ టాక్ వస్తోంది. పీరియాడిక్ ఇంట్రడక్షన్ సీక్వెన్సులు బాగున్నాయంటున్నారు. అయితే ఒకానొక సమయం తర్వాత హీరో-విలన్ల మధ్య బిల్డప్ చిరాకు తెప్పిస్తుందట. సూర్య ఇంటెన్స్ పర్ఫామెన్స్తో అదరగొట్టారంటున్నారు. ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ డిసప్పాయింట్ చేసిందని కొందరంటున్నారు.
ఈ నెల 20న ప్రసార భారతి OTT ప్రారంభిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి సంజయ్జాజు వెల్లడించారు. లైవ్ ఛానల్స్తో పాటు పలు రకాల మీడియా మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో పాటు 236 చిన్నపట్టణాల్లో ప్రైవేటు FM రేడియోలు వస్తాయని, అందుకోసం వచ్చే నెలలో వేలం నిర్వహిస్తామని వివరించారు. HYDలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ రీజినల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.
AP: లా కాలేజీల్లో ప్రవేశాల కోసం రెండో విడత <
క్రికెట్ మ్యాచ్లు ప్రధానంగా వర్షం, వెలుతురు సరిగా లేకపోవడం వల్ల ఆలస్యం లేదా నిలిచిపోతుంటాయి. సౌతాఫ్రికాలో ఇండియా తాజాగా ఆడిన టీ20 పురుగుల వల్ల కాసేపు నిలిచిపోయింది. SAలోనే 2017లో తేనెటీగల దాడి వల్ల శ్రీలంకతో మ్యాచ్, 2017లో హలాల్ ఫుడ్ అందుబాటులో లేదని బంగ్లాదేశ్తో మ్యాచ్ నిలిచిపోయాయి. వీటన్నింటికంటే వింతగా పాకిస్థాన్లో 1996లో PCB బంతులు సప్లై చేయకపోవడంతో NZతో టెస్టు 20ని.లు ఆలస్యమైంది.
Sorry, no posts matched your criteria.