news

News December 14, 2024

BGT: టాస్ గెలిచిన భారత్.. జట్టులో మార్పులు

image

బ్రిస్బేన్‌లో జరుగుతున్న 3వ టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో 2 మార్పులు జరిగాయి. అశ్విన్ స్థానంలో జడేజా, హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్ ఆడనున్నారు.
IND: రోహిత్‌, జైస్వాల్‌, రాహుల్‌, గిల్‌, కోహ్లీ, పంత్‌, నితీశ్‌, జడేజా, ఆకాశ్‌దీప్‌, సిరాజ్‌, బుమ్రా.
AUS: ఖవాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, కేరీ, కమిన్స్, స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్.

News December 14, 2024

అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697

image

బెయిల్ మంజూరైనా పలు కారణాలతో అల్లు‌అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కాలేదు. దీంతో జైలు అధికారులు ఆయన్ను అండర్‌ ట్రైల్‌ ఖైదీగా(ఖైదీ నంబర్‌ 7697) మంజీరా బ్యారక్‌లో ఉంచారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్‌లోనే ఉంచిన సిబ్బంది ఆపై బ్యారక్‌లోని క్లాస్‌–1 రూమ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్లు సమాచారం. ఈ ఉదయం అల్లుఅర్జున్ విడుదల కానున్నారు.

News December 14, 2024

కాసేపట్లో జైలు నుంచి బన్నీ విడుదల

image

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నిన్న అరెస్టైన అల్లు అర్జున్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కాసేపట్లో(ఉ.7 గంటలలోపు) ఆయన విడుదల కానున్నారు. బన్నీని రిసీవ్ చేసుకోవడానికి అల్లు అరవింద్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం.

News December 14, 2024

నేటి నుంచి భారత్-ఆసీస్ మూడో టెస్ట్

image

BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉ.5.50కి స్టార్ట్ అవుతుంది. తొలి మ్యాచ్ గెలిచిన IND రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. రోహిత్, కోహ్లీ, రాహుల్, గిల్, పంత్ భారీ స్కోర్లు చేయలేకపోవడం మైనస్‌గా మారింది. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
* స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్.

News December 14, 2024

కంచె ఐలయ్యపై ఉన్న కేసులు కొట్టివేత

image

TG: ఫ్రొఫెసర్, రచయిత కంచె ఐలయ్యకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన రాసిన ఓ పుస్తకం తమ మనోభావాలు దెబ్బతీశాయని ఓ సామాజికవర్గానికి చెందిన పలువురి ఫిర్యాదులతో కోరుట్ల, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టేయాలంటూ ఐలయ్య హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసులను కొట్టేశారు. ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసిందని జడ్జి ప్రస్తావించారు.

News December 14, 2024

అమెరికా నుంచి వారంతా వెనక్కి?

image

అక్రమ వలసదారులను వెనక్కు పంపుతామని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ ఇటీవల ప్రకటించారు. తమ దేశం నుంచి పంపించాల్సిన 15లక్షల మంది జాబితాను US సిద్ధం చేసింది. నవంబరు లెక్కల ప్రకారం అందులో 17,940 మంది భారతీయులు ఉన్నారు. వారంతా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. గత 3 సంవత్సరాల్లో 90వేల మంది ఇండియన్స్ అక్రమంగా అమెరికా సరిహద్దును దాటేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు.

News December 14, 2024

ANM పోస్టుల సంఖ్య పెంపు: మంత్రి

image

TG: ANM రెగ్యులర్‌‌ పోస్టుల భర్తీకి ఈ నెల 29న పరీక్ష యథావిధిగా నిర్వహిస్తామని మంత్రి రాజనర్సింహ స్పష్టం చేశారు. 1931 పోస్టులకు అదనంగా మరో 323 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. HYDలో ఏఎన్ఎంలతో ఆయన చర్చించారు. కాంట్రాక్ట్ ANMలకు 30 మార్కులు వెయిటేజీ ఇస్తామని, ఎగ్జామ్‌కు ప్రిపేర్ కావాలని సూచించారు. రెగ్యులర్ ఉద్యోగం రాని వారిని కాంట్రాక్ట్ ఉద్యోగంలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

News December 14, 2024

BWF వరల్డ్‌ టూర్‌‌లో ముగిసిన భారత్ పోరు

image

ప్రతిష్ఠాత్మక BWF వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత పోరు ముగిసింది. యువ ద్వయం గాయత్రి గోపీచంద్‌, త్రిసా జాలీ జోడీ శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ గ్రూపు-ఏలో ఓడిపోయారు. 17- 21, 13-21తో జపాన్‌కు చెందిన మత్సుయమ, చిహారు షిదా మన ద్వయాన్ని ఓడించారు. ఇటీవలే సయ్యద్‌ మోడీ టోర్నీ గెలిచి ఫామ్‌లో ఉన్న గాయత్రి, త్రిసా.. జపాన్ ద్వయం నుంచి గట్టి పోటీ ఎదురై ఓడిపోయారు.

News December 14, 2024

సిబిల్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి?

image

మీ ఆర్థిక పరిస్థితిపై క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(సిబిల్‌) ఇచ్చే రేటింగ్‌నే సిబిల్‌ స్కోర్‌ అంటారు. ఆ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే రుణాలకు ఈజీ అవుతుంది. సిబిల్ స్కోర్ పెరగాలంటే..
* సమయానికి రుణాలు, EMI చెల్లించండి.
* సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల మధ్య బ్యాలెన్స్ పాటించాలి.
* క్రెడిట్ కార్డు లిమిట్‌ను 30% మాత్రమే ఉపయోగించాలి.
* ఇతరుల రుణాలకు గ్యారెంటీ ఉండకపోవడం బెటర్.

News December 14, 2024

చలికాలంలో గొంతునొప్పికి చెక్ పెట్టండిలా!

image

చలికాలం వేధించే గొంతునొప్పికి వంటింట్లోని పసుపు, మిరియాలు, లవంగాలు, ఉప్పుతో చెక్‌ పెట్టొచ్చు. పాలలో పసుపు కలుపుకొని తాగితే గొంతు ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అలాగే, లవంగాన్ని కొద్దికొద్దిగా నములుతూ మింగితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే, టేబుల్‌ స్పూన్‌ తేనెలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకొని పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.