India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

లోక్సభ స్పీకర్ ఛైర్లో కూర్చున్న ఏపీకి చెందిన దళిత ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ను కాంగ్రెస్ సభ్యులు అవమానించారని PM మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు కృష్ణప్రసాద్పై కాగితాలు విసిరేశారని మండిపడ్డారు. అలాగే అస్సాంకు చెందిన BJP MP దిలీప్ సైకియా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడూ ఇలాగే ప్రవర్తించారని దుయ్యబట్టారు. వారికి దళితులపై చిన్నచూపు ఉందన్నారు.

గత ఐదేళ్లలో జాతీయ రహదారుల విస్తరణ, నిర్వహణ కోసం తెలంగాణకు రూ.23,668 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ.40,345 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. TGకు 1,854 కిలోమీటర్ల మేర 84 హైవే ప్రాజెక్టులు మంజూరు కాగా, వాటిలో 39 నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఏపీలో 3,633 కిలోమీటర్ల మేర 145 ప్రాజెక్టులు చేపట్టగా, 69 పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

AP: రాష్ట్రంలోని అసంఘటిత రంగంలోని 20L మంది కార్మికులకు నైపుణ్యాలు పెంచడంపై దృష్టిపెట్టాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ, ఇతర కార్మికులకు సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని సూచించారు. ప్రసూతికి ₹20వేలు, వివాహానికి ₹40వేలు, సహజ మరణానికి ₹60వేలు, అంత్యక్రియలకు ₹20వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. తీవ్ర అనారోగ్యం ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలు కల్పించాలని పేర్కొన్నారు.

శుక్రుడు సౌందర్యం, సంపద, దాంపత్య సుఖానికి కారకుడు. కానీ మన జాతకంలో ఆ గ్రహం బలహీనంగా ఉంటే దాన్ని శుక్ర దోషంగా పరిగణిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఈ దోషం ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడతాయి. చర్మ, కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. వాటి నివారణ మార్గాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

C-TET అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. సీటెట్కు అప్లై చేసుకున్నవారు అప్లికేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET తప్పనిసరి. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. వెబ్సైట్: https://ctet.nic.in/

ముఖానికి చల్లదనాన్నిచ్చి అందంగా మెరిపించేందుకు గంధం ఫేస్ప్యాక్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. గంధం, తేనె, కాఫీపొడి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి ముఖానికి అప్లై చెయ్యాలి. దీన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చర్మం కూల్గా మారడంతో పాటు ముఖానికి సహజ మెరుపు వస్తుంది. చందనం పొడిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నల్ల మచ్చల్ని తగ్గించి మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సాయపడతాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల లబ్ధిని సులభంగా పొందవచ్చు. PM KISANకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి. రైతుల వివరాలు కచ్చితంగా నమోదై ఉండటం వల్ల అర్హులకే సర్కారు పథకాల ఫలాలు అందుతాయి. నిధుల జమలో పారదర్శకత పెరుగుతుంది. బీమా, సబ్సిడీ, రుణాలు త్వరగా రైతులకు చేరతాయి. ఒకే ఐడీతో ప్రభుత్వ సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని పథకాల అమలును ఈ ఐడీ సులభతరం చేస్తుంది.

TG: Hyd చుట్టూ 162KM మేర నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన DPR సిద్ధమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. LSలో MP ఈటల రాజేందర్ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. భూసేకరణ వ్యయంలో 50% భారం పంచుకునేందుకు TG అంగీకరించిందన్నారు. రాయల్టీ మినహాయింపు, GSTలోని రాష్ట్ర వాటా చెల్లింపునకూ ఓకే చెప్పిందన్నారు. ఈ ఏడాది CRIF నుంచి రూ.367.17 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ఇందుకు చాలా కారణాలున్నాయి. జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు. దీనివల్ల దోషం ఏర్పడి శుభ ఫలితాలు తగ్గుతాయి. సౌఖ్యాలు దూరమవుతాయి. శుక్రుడు రాహువు, కేతువు, శని గ్రహాలతో కలిసినా దోషం ఏర్పడుతుంది. ఇది వ్యక్తి నైతికతను, బంధాలను ప్రభావితం చేస్తుంది. జాతక చక్రంలో 6, 8, 12వ ఇళ్లలో శుక్రుడు ఉండటం మంచిది కాదు. ఉంటే అనారోగ్యం, అప్పులు కలుగుతాయి. పూర్వజన్మ కర్మల వల్ల కూడా శుక్ర దోషం ఏర్పడవచ్చు.

AP: ఈఏపీసెట్కు మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 23న ప్రాథమిక కీ, జూన్ 1న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ‘ఈసెట్కు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష, మే 7న రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం. ఐసెట్కు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న పరీక్ష, 16 ఫలితాలు ప్రకటిస్తాం’ అని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.