India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఐపీఎల్లో మ్యాక్స్వెల్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు(19) సున్నాకే వెనుదిరిగిన ప్లేయర్గా ఆయన నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(18), దినేశ్ కార్తీక్(18), పియూశ్ చావ్లా(16), సునీల్ నరైన్(16) ఉన్నారు.

పీఎఫ్ డబ్బులను నేరుగా ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని కేంద్రం తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్ని మే నెలాఖరు లేదా జూన్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కార్మికశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చని తెలిపారు. అయితే విత్డ్రా లిమిట్పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విధానంతో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

GTతో మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ మ్యాక్స్వెల్ తొలి బంతికే ఔటై పెవిలియన్కు చేరారు. సాయికిశోర్ వేసిన బంతి నేరుగా వికెట్లను తగులుతున్నట్లు కనిపించడంతో అంపైర్ LBW ఇవ్వగా మ్యాక్సీ రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత రీప్లే చూస్తే బాల్ స్టంప్స్ను మిస్ అయినట్లు కనిపించింది. దీంతో మ్యాక్స్వెల్ రివ్యూ తీసుకొని ఉండాల్సిందని.. మరో ఎండ్లో ఉన్న శ్రేయస్ అయినా చెబితే బాగుండేదని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు లోక్సభ సచివాలయం ప్రకటించింది. గత వారం హోలీకి ముందు రోజు సెలవు ఇవ్వడంతో ఈ నెల 29న కార్యకలాపాలు నిర్వహించాలని తొలుత నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ పేర్కొంది. ఆ రోజు యథాతథంగా సెలవు ఉంటుందని తెలిపింది.

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన ‘మజాకా’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఉగాది కానుకగా ఈ నెల 28 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ మూవీలో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా గత నెల 26న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా(48) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. కాగా, ఆయన తాజ్మహల్, అల్లీ అర్జున, అన్నక్కోడి, పల్లవన్, తదితర తమిళ చిత్రాల్లో నటించారు.

ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టీల్ కంపెనీగా JSW స్టీల్ రికార్డు సృష్టించింది. $30.31B మార్కెట్ విలువను సాధించింది. $90Mతో ఆర్సెలార్ మిత్తల్, $3Bతో న్యూకోర్ కార్ప్ను వెనక్కి నెట్టేసింది. ఈ భారతీయ కంపెనీ విజయనగర, డోల్వి, సేలమ్లో ప్లాంట్లు, అమెరికా, ఇటలీలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుత 35.7MT ఉత్పత్తి సామర్థ్యాన్ని FY28లో 43.5 MT, FY31లో 51.5 MTకి పెంచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.

AP: దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సామాజిక పింఛన్ల తనిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరమ్ స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పున:ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆస్పత్రులు/GGHలలో ప్రతి మంగళవారం స్లాట్లు అందుబాటులో ఉంటాయని సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఎ.సిరి తెలిపారు. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.

TG: అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులవుతున్నారని ఆయన అన్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రమ, మేధ దోపిడీ ఇక్కడే జరుగుతోందని పేర్కొన్నారు. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా, పగలు, రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు.

AP: రేపు రాష్ట్రంలోని <
Sorry, no posts matched your criteria.