India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చైనా హెబీ ప్రావిన్స్లోని ఓ నర్సింగ్ హోమ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది చనిపోగా పలువురు గాయపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఫైర్ యాక్సిడెంట్కు గల కారణాలను వెల్లడించలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించింది.

సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన Dy.CM పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. రాత్రి ఆస్పత్రికి చేరుకున్న పవన్ పిల్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం వల్ల తలెత్తే సమస్యలపై పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి తీసుకొచ్చామన్నారు. మరో 3 రోజులపాటు టెస్టులు చేయాల్సి ఉందని వెల్లడించారు.

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదన్న చందాన బ్యాంకుల తీరు తయారైంది. వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించినా చాలా బ్యాంకులు తగ్గించడం లేదు. దీంతో లోన్లు, EMIలు కట్టేవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపై ఆధారపడి ఉండటమే వడ్డీ తగ్గకపోవడానికి కారణం. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా బ్యాంకులు ఇలా చేస్తుంటాయి. మీకూ ఇలా ఎప్పుడైనా జరిగిందా?

టారిఫ్ల విషయంలో కొన్ని దేశాలు తనను బతిమాలుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘ప్లీజ్.. ప్లీజ్ సార్. మీతో ఎలాంటి డీల్కైనా సిద్ధం. ఇందుకోసం ఏమైనా చేస్తాం అని కొన్ని దేశాలు వెంపర్లాడుతున్నాయి. అయినా నేను అన్నీ తెలిసే టారిఫ్లను విధించా. వీటిని మళ్లీ పున:సమీక్షించే ఛాన్సే లేదు. సుంకాల దెబ్బకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. KISSING MY A**’ అంటూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు.

గత ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ₹710 పెరిగి ₹90,440కు, 22 క్యారెట్ల గోల్డ్ ₹650 పెరిగి ₹82,900కు చేరాయి. అటు వెండి ధర మాత్రం రూ.1000 తగ్గి కేజీ రూ.1,02,000 పలుకుతోంది.

ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తారు. కెమెరాతో కూడిన పరికరాన్ని ముక్కు/నోటి ద్వారా పంపుతారు. కణితులు, శ్వాసనాళ క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, బ్లాక్స్, ఇన్ఫెక్షన్ వంటివి నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం చేయడానికి 30-45 నిమిషాలు పడుతుంది. సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడ్డ AP Dy.CM కుమారుడు మార్క్ శంకర్కు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో నిన్న ఈ <<16034506>>టెస్ట్ <<>>చేశారు.

భారత ఎగుమతులపై యూఎస్ టారిఫ్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికాకు ఎగుమతి చేస్తున్న అన్ని వస్తువులపై ఆ దేశం 26% సుంకాలు వసూలు చేయనుంది. దీంతో ఎగుమతిదారులపై ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండనుంది. ఇవాళ భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం సుంకాలపై చర్చించే అవకాశం ఉంది. కాగా టారిఫ్స్తో ఇప్పటికే రోజుకు $2 బిలియన్ల కలెక్షన్లు వస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.

AP: మాజీ సీఎం జగన్ కావాలనే హెలికాప్టర్లో ప్రయాణించలేదని, సాంకేతిక సమస్య ఉంటే పైలట్ ఎలా వెళ్లారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. జగన్వేనా ప్రాణాలు.. పైలట్వి కావా అని ఆమె నిలదీశారు. ‘వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు పెట్టుకున్నారు. జగన్ స్థాయికి తగ్గట్లు భద్రత ఏర్పాటు చేశాం’ అని ఆమె పేర్కొన్నారు.

గత రెండు రోజుల్లో జరిగిన 3 ఐపీఎల్ థ్రిల్లర్ మ్యాచ్లు అభిమానులకు మజానిచ్చాయి. 200కు పైగా పరుగులు చేసి ఆరు జట్లు విజయం కోసం చివరి బంతి వరకు పోరాడాయి. సీనియర్లతో పాటు యంగ్ ప్లేయర్లు తగ్గేదేలే అంటూ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొన్న RCB 221/5 స్కోర్ చేస్తే MI 209/9 పరుగులు చేసింది. నిన్న LSG విసిరిన 239 పరుగుల సవాల్కు KKR(234) దీటుగా బదులిచ్చింది. PBKS 219/6 స్కోర్ చేస్తే CSK 201/5 రన్స్ చేసింది.

తెలంగాణలో టెన్త్ ఫలితాల విడుదలకు కసరత్తు జరుగుతోంది. ఈ నెల 7 నుంచి మొదలైన వ్యాల్యుయేషన్, ఈ నెల 15 లేదా 17వ తేదీతో ముగియనుంది. ఎలాంటి తప్పిదాలు లేకుండా మరోసారి పరిశీలన చేసి, ఆన్లైన్లో మార్కులు నమోదు చేయనున్నారు. అన్ని పనులు పూర్తి చేసి ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
Sorry, no posts matched your criteria.