news

News March 27, 2025

రేవంత్ ‘తెలంగాణ బూతుపిత’ అవుతారు: KTR

image

TG: ఎవ్వరు ఏమనుకున్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని BRS ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ తెలంగాణ బూతుపిత అవుతారని ఎద్దేవా చేశారు. తుపాకుల గురించి రేవంత్‌కు తెలిసినంత తమకు తెలియదన్నారు. ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టిన చరిత్ర ఆయనదని దుయ్యబట్టారు. ప్రజాపాలన విఫల పాలన అని ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. అప్పులు, అబద్దాలు, బూతులు, అన్నదాతల ఆత్మహత్యలలో తెలంగాణ రైజింగ్ అని విమర్శలు చేశారు.

News March 27, 2025

KCRను బండకేసి కొట్టారు: సీఎం రేవంత్

image

BRS నేతలు తెలంగాణ గాంధీగా పిలుచుకునే KCRను కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టారని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ‘నాకు ఓడిపోవడం కొత్త కాదు. కామారెడ్డిలో నేను పోతూ పోతూ.. నిన్ను కూడా తీసుకెళ్తానని చెప్పా. అనుకున్నట్టుగానే అక్కడి ప్రజలు సామాన్యుడిని గెలిపించారు. ప్రజలు తిరస్కరించినా BRS నేతలు ఎందుకు బుకాయిస్తున్నారు? KCR వందేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రతిపక్ష నేత బాధ్యత నిర్వర్తించాలి’ అని ఆకాంక్షించారు.

News March 27, 2025

కన్నడిగులకు మరో షాక్!

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాల ధరలను లీటరుకు రూ.4 పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ ధరలను లీటరుకు రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కోరగా సీఎం సిద్దరామయ్య రూ.4 పెంచేందుకు అంగీకరించారు. ఇటీవలే అక్కడ కరెంట్ ఛార్జీలను పెంచారు. 6 గ్యారంటీలే ధరల పెరుగుదలకు కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.

News March 27, 2025

కిలో రూ.3.. కష్టాల్లో టమాటా రైతులు

image

TG: గిట్టుబాటు ధరలు లేక, కిలో టమాటా రూ.3కే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. రంగారెడ్డి (D) కొందుర్గ్ (M) రైతు నర్సింహులు 56 టమాటా పెట్టెలు(ఒక్కోదాంట్లో 30kg) మహబూబ్‌నగర్ రైతు‌బజారుకు తీసుకెళ్లారు. 39పెట్టెలకు దళారులు రూ.3,500 చెల్లించారు. మిగతావి కొనకపోవడంతో టమాటాలను రోడ్డుపక్కన పారబోస్తూ ఆవేదన చెందారు. మరోవైపు, బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ.10- రూ.20 వరకు ఉంది.

News March 27, 2025

‘తెలుగు నేర్చుకో..’ అక్బరుద్దీన్ ఒవైసీపై మాజీ ఐఏఎస్ ఫైర్

image

TG: ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే <<15896404>>అక్బరుద్దీన్‌పై<<>> మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీ ఫైరయ్యారు. ‘మంత్రి సీతక్కకు హిందీ రాదు సరే.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన నీకు తెలుగు ఎందుకు రాదు?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే తొలి అధికార భాష తెలుగును నేర్చుకోవాలనే బాధ్యత ఉండాలని హితవు పలికారు. తెలుగు రానప్పుడు సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎలా అర్థమవుతాయని దుయ్యబట్టారు.

News March 27, 2025

విక్రమ్ ‘వీర ధీర శూర’కు లైన్ క్లియర్

image

అనివార్య కారణాలతో ఇవాళ మార్నింగ్ షోలు రద్దయిన ‘వీర ధీర శూర’ చిత్రానికి ఊరట లభించింది. ఈవినింగ్ షో నుంచి సినిమా ప్రదర్శన ఉంటుందని తెలుగు డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే రద్దైన షోలకు డబ్బులు తిరిగిస్తామని సినీ ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, దుషారా విజయన్ , ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు.

News March 27, 2025

ఈ ఏడాది చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి: సీఎం

image

AP: గత ప్రభుత్వం రాజకీయ కక్షతో పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘గత ప్రభుత్వం కాఫర్ డ్యాంలను సకాలంలో నిర్మించకపోవడంతో రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దీంతో మళ్లీ కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వచ్చింది. దాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తాం. 2026 ఫిబ్రవరి నాటికి ECRF గ్యాప్-1, 2027 జూన్ నాటికి ECRF గ్యాప్-2 పూర్తి చేస్తాం’ అని మీడియాతో చెప్పారు.

News March 27, 2025

సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

image

TG: రాష్ట్రంలో ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా అని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని KTR నిలదీశారు. సిరిసిల్ల లేదా కొడంగల్‌లో ఎక్కడైనా నిరూపిస్తారా అని ప్రశ్నించారు. నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని CM రేవంత్‌కు సవాల్ విసిరారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఒకరిని జైలుకు పంపే అధికారం CMకు ఉండదని, నేరాలు నిర్ధారించి జైలుకు పంపేది కోర్టులని స్పష్టం చేశారు.

News March 27, 2025

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌‌గా రోహిత్..?

image

జూన్‌లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌-భారత్ టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో భారత్ ఓడిపోవడంతో పాటు హిట్ మ్యాన్‌ విఫలమవడంతో టెస్ట్‌లకు కెప్టెన్‌గా తప్పిస్తారని ప్రచారం జరిగింది. కాగా ఈ సిరీస్‌కు రోహితే కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే హిట్ మ్యాన్ అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.

News March 27, 2025

వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్

image

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ71గా ఉన్న ఆయన ప్రస్తుతం అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని వంశీ విజయవాడ కోర్టును ఆశ్రయించగా ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఈ క్రమంలోనే ధర్మాసనం ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.