news

News April 9, 2025

IPL: ఈరోజు తలపడేది ఎవరంటే..

image

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్‌లో గుజరాత్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న GT ఈరోజు గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తోంది. గత రెండు మ్యాచులూ గెలిచిన రాజస్థాన్ విజయ పరంపరను కొనసాగించి హ్యాట్రిక్ విన్ నమోదు చేయాలని చూస్తోంది. రాత్రి 7.30గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? కామెంట్ చేయండి.

News April 9, 2025

పత్తి కొనుగోళ్లలో అగ్రస్థానంలో తెలంగాణ

image

TG: దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర జౌళి శాఖ ప్రకటించింది. ‘ఈ ఏడాది మార్చి 31లోపు జరిగిన కొనుగోళ్లలో తెలంగాణ అత్యధికంగా 40 లక్షల బేళ్లను సేకరించింది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(30 లక్షలు), గుజరాత్(14 లక్షలు) ఉన్నాయి’ అని వెల్లడించింది. ఈ ఏడాది రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఇక ఆంధ్రప్రదేశ్ 4లక్షల బేళ్ల పత్తిని సేకరించింది.

News April 9, 2025

ఈరోజు ఎన్టీఆర్-నీల్ మూవీపై అప్‌డేట్

image

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలు తీసిన నీల్ తమ హీరోను ఎలా చూపిస్తారా అని తారక్ ఫ్యాన్స్ ఇంట్రస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. వారికి మూవీ సర్ప్రైజ్ న్యూస్ చెప్పింది. ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ అప్‌డేట్ ఏంటా అన్న ఆసక్తి నెలకొంది.

News April 9, 2025

ధోనీ ఔటయ్యారని భోరున విలపించింది!

image

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ పోరాడినప్పటికీ చెన్నైని గెలిపించలేకపోయారు. అయితే ఉన్నంత సేపు తన అభిమానుల్ని ఉర్రూతలూగించారు. కాగా.. ధోనీ ఔటైనప్పుడు ఓ అభిమాని భోరున విలపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 12 బంతులాడిన MS 3 సిక్సులు, ఒక ఫోర్‌తో 27 రన్స్ చేశారు. 43 ఏళ్ల వయసులోనూ ఆయనలో ఇదివరకటి ఆట ఇంకా అలాగే ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News April 9, 2025

రేపటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

రేపటి నుంచి ఈ నెల 12 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేవిధంగా ప్రతి ఏడాదీ ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తున్నారు. స్వామివారికి వసంత ఋతువులో జరిగే ఉత్సవం కాబట్టి ‘వసంతోత్సవ’మని పేరు వచ్చింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో రేపటి తిరుప్పావడ సేవ, 10-12 తేదీల మధ్యలో కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను TTD రద్దు చేసింది.

News April 9, 2025

ఒకే జిల్లాల్లో 13,500మందిలో క్యాన్సర్ లక్షణాలు!

image

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో సర్కారు నిర్వహించిన ‘సంజీవని అభిమాన్’ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్లో 13,500కు పైగా మహిళలు క్యాన్సర్ ముప్పు ముంగిట ఉన్నట్లు తేలింది. జిల్లా కలెక్టర్ అభివన్ గోయెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘7వేలమందిలో గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు, 3500మందిలో రొమ్ము క్యాన్సర్, 2వేల మందిలో నోటి క్యాన్సర్, వెయ్యి మందిలో ఇతర క్యాన్సర్ల లక్షణాల్ని వైద్యులు గుర్తించారు’ అని తెలిపారు.

News April 9, 2025

బ్రిటన్ యువరాజు ప్రాణాలకు ముప్పు: లాయర్

image

బ్రిటన్ యువరాజు హ్యారీ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన తరఫు న్యాయవాది ఫాతిమా లండన్ కోర్టుకు తెలిపారు. హ్యారీ తన భార్యతో కలిసి 2020లో అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. ఆయన బ్రిటన్ వచ్చినప్పుడు కల్పించే భద్రతను ప్రభుత్వం భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలోనే హ్యారీ కోర్టును ఆశ్రయించారు. ‘హ్యారీని చంపాలంటూ ఆల్ ఖైదా ఈమధ్యే పిలుపునిచ్చింది. ఇక ఆయన్ను, ఆయన భార్యను మీడియా డేగలా వెంటాడుతోంది’ అని ఫాతిమా వివరించారు.

News April 9, 2025

‘ఓజీ’లో అకీరా నందన్.. రేణూ దేశాయ్ స్పందనిదే

image

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీలో అకీరా నందన్ నటిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై నటి రేణూ దేశాయ్ ఓ పాడ్ కాస్ట్‌లో స్పందించారు. ‘అకీరా ప్రస్తుతం ఏ మూవీలోనూ నటించడం లేదు. ఆయన తండ్రి పవన్ నటిస్తున్న ‘ఓజీ’లోనూ ఆయన లేరు. ఒకవేళ అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే నేనే సోషల్ మీడియాలో ప్రకటిస్తా. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తలన్నీ నిరాధారం’ అని ఆమె స్పష్టం చేశారు.

News April 9, 2025

చైనాకు ట్రంప్ భారీ షాక్.. చెప్పినట్లే భారీ సుంకాలు

image

చైనా తమపై విధించిన ప్రతీకార సుంకాల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఆ దేశంపై టారిఫ్స్‌ను 104శాతానికి పెంచుతానన్న ట్రంప్, అదే చేశారు. తన హెచ్చరికల్ని లైట్ తీసుకున్న చైనాపై అదనంగా 50శాతం సుంకాలు విధించారు. దీంతో ఆ దేశంపై అమెరికా మొత్తం టారిఫ్‌లు 104శాతానికి చేరాయి. దీనిపై చైనా స్పందించాల్సి ఉంది. ఈ వాణిజ్య యుద్ధం ఎక్కడకు దారి తీస్తుందోనని ఆర్థిక వేత్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

News April 9, 2025

TG మాజీ గవర్నర్ తమిళిసైకు పితృవియోగం

image

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ లీడరైన కుమారి అనంతన్(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈక్రమంలో ఈరోజు పరిస్థితి విషమించి మరణించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.