India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మనిషి ఒంట్లోని సూక్ష్మ క్రిముల ఆధారంగా అతడి చివరి లొకేషన్ను గుర్తించే మైక్రోబయోమ్ జియోగ్రఫిక్ పాపులేషన్ స్ట్రక్చర్(mGPS) అనే AI సాంకేతికతను స్వీడన్ పరిశోధకులు రూపొందించారు. ఓ వ్యక్తి ప్రయాణించిన ప్రాంతంలో అతడి శరీరం తాలూకు సూక్ష్మక్రిములు ఉంటాయని, తమ సాంకేతికత ఆ క్రిముల ద్వారా అతడి లోకేషన్ని గుర్తిస్తుందని వారు వివరించారు. దీని ద్వారా రోగాల వ్యాప్తిని గుర్తించడం సులువవుతుందని తెలిపారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ నానా పటోలే సరికొత్త వివాదానికి తెరలేపారు. OBC కమ్యూనిటీతో BJP తీరును విమర్శిస్తూ ఆ పార్టీ నేతలను కుక్కలుగా మార్చాలన్నారు. ‘అకోలా జిల్లా ఓబీసీలను నేనొకటే అడుగుతున్నా. మిమ్మల్ని కుక్కలని పిలుస్తున్న బీజేపీకి ఓటేస్తారా? ఇప్పుడు బీజేపీని కుక్కలా మార్చే టైమొచ్చింది. వాళ్లకు అహంకారం తలకెక్కింది’ అని అకోలా సభలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలపై అధికార మహాయుతి కూటమి భగ్గుమంది.
ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్(OCT)గా పాక్ స్పిన్నర్ నోమన్ అలీ, ఉమెన్స్ విభాగంలో అమేలియా కెర్(కివీస్) ఎంపికయ్యారు. ENGతో టెస్టు సిరీస్లో నోమన్ 13.85 యావరేజ్తో 20 వికెట్లు పడగొట్టారు. దీంతో రబడ, శాంట్నర్ను అధిగమించి అవార్డు పొందారు. అమేలియా ఉమెన్స్ T20 వరల్డ్ కప్తో సహా అక్టోబర్లో 19 వికెట్లు కూల్చి, 160 రన్స్ చేశారు. డియాండ్రా డాటిన్, లారా వోల్వార్డ్తో పోటీ పడి అవార్డు గెలుచుకున్నారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా సాగుతోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా వీరిపై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అరెస్టైన రైతులను పరామర్శించేందుకు BRS నేతలు కొడంగల్ నియోజకవర్గానికి బయల్దేరారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలోని ఆ పార్టీ నేతలు అరెస్టైన వారికి సంఘీభావం తెలపనున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు వంద మంది దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
చిన్నప్పటి నుంచి కోహ్లీ ఆటతీరు చూస్తూ పెరిగానని యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్రికెట్లో తనకు కోహ్లీ ఆరాధ్య దైవమని చెప్పారు. విరాట్ స్టైల్ చూసి బ్యాటింగ్ నేర్చుకున్నానని.. అతడి గేమ్ ప్లే, ఆటిట్యూడ్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ఇండియన్ క్రికెట్ స్టైల్ను కింగ్ మార్చేశారని, అతడిలో ప్రతి క్వాలిటీని అభిమానిస్తానని నితీశ్ వివరించారు.
శంకర్దాదా MBBSలో హీరో చిరంజీవి చెప్పినట్లు కౌగిలింతతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రేమికులు, స్నేహితులు, పిల్లలు-పేరెంట్స్ ఇలా రిలేషన్ ఏదైనా హగ్ మంచిదే అంటున్నారు మానసిక నిపుణులు. కౌగిలింత వల్ల ఒత్తిడి తగ్గడం, మానసిక స్థితిని మెరుగుపరచడం, ఆక్సిటోసిన్ను పెంచడం, సంబంధాలను మెరుగుపరచడం, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం సాధ్యమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కౌగిలింత 5-10సెకన్ల వ్యవధి ఉండాలంటున్నాయి.
TG: కేంద్ర ప్రభుత్వ స్కీంలో అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని KTR ప్రశ్నించారు. రూ.8,888కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని కోరారు. అడ్రస్, అర్హత లేని కంపెనీలకు టెండర్లు ఇచ్చారని, వాటి వివరాలను ఆన్లైన్లో కూడా పెట్టలేదన్నారు. కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంలా మారిందని బీజేపీ అంటోందని, దీనిపై ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. రేవంత్, పొంగులేటిల భరతం పట్టడం ఖాయమని KTR హెచ్చరించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. అక్కడి నుంచి ఆయన రేపు ఉదయం మహారాష్ట్రకు వెళ్లి, పార్టీ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ తరహాలో ఆ రాష్ట్రంలోనూ ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని అఘాడీ రేవంత్ను కోరింది. దానిపై ఆయన అక్కడి నేతలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
YS జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్కు బదిలీ చేసింది. జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు తమకు మరింత సమయం కావాలని సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అక్రమాస్తుల కేసు విచారణను HYD నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
Sorry, no posts matched your criteria.