news

News December 12, 2024

‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న సర్కార్

image

AP: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. మొత్తం 17.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకుంది. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో సరస్వతి కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది.

News December 12, 2024

నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సురేఖ తరఫున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరుకావడానికి మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి కోర్టు వాయిదా వేసింది.

News December 12, 2024

తెలుగు సినిమా రేంజ్ ఇదే!

image

‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తమైందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిన్న ‘పుష్ప-2’ కలెక్షన్లలో రికార్డు సృష్టించడంతో తెలుగు సినిమా రేంజ్ ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 8 రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలుంటే అందులో నాలుగు మనవేనంటున్నారు. త్వరలో రిలీజయ్యే ప్రభాస్, మహేశ్ సినిమాలు కూడా ఈ జాబితాలో చేరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మీ ఫేవరెట్ ఏంటి?

News December 12, 2024

₹3L కోట్లు: 2024లో INCOME TAX రికార్డులివే..

image

FY25లో ట్యాక్స్ రీఫండ్‌ చెల్లింపుల్లో రికార్డు సృష్టించామని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. 2024 APR 1 నుంచి NOV 27 వరకు ఏకంగా Rs 3.08 లక్షల కోట్లు చెల్లించినట్టు చెప్పింది. గతేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఇది 46.31% ఎక్కువని వివరించింది. ఈ ఏడాది గరిష్ఠంగా ఒక సెకనుకు 900, ఒక రోజు 70 లక్షల ITRలు దాఖలైనట్టు పేర్కొంది. AY 2024-25కు సంబంధించి ఒకేరోజు 1.62 కోట్ల ITRలు ప్రాసెస్ చేసినట్టు వెల్లడించింది.

News December 12, 2024

BGT థర్డ్ టెస్టు ప్రాక్టీస్ సెషన్‌లో టీమ్‌కు కోహ్లీ సూచనలు!

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది. తాజాగా గబ్బా స్టేడియంలో టీమ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ జట్టు సభ్యులకు సూచనలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఎల్లుండి నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో టీమిండియా గెలవగా, రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది.

News December 12, 2024

ప్రభుత్వ దుబారా ఖర్చుల వల్లే ద్రవ్యోల్బణం: మస్క్

image

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ద్రవ్యోల్బణంపై చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రభుత్వాలు చేసే అధిక వ్యయమే ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ దుబారా ఖర్చులను అరికడితే ద్రవ్యోల్బణం ఉండదు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. మస్క్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలనే చూస్తున్నామని, ధరల పెరుగుదలను పట్టించుకోవట్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News December 12, 2024

నన్ను గొడ్డులా చావబాదేవాడు: అతుల్ భార్య

image

రూ.10 లక్షల వరకట్నం కోసం తనను తీవ్రంగా వేధించారని అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా ఆరోపించారు. తనకు వచ్చిన జీతం మొత్తం సుభాష్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేవారని 2022లో పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్‌లో తెలిపారు ‘సుభాష్, ఆయన తల్లిదండ్రులు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించారు. తాగొచ్చి గొడ్డును బాదినట్లు చావగొట్టేవారు. ఇదంతా చూసి తట్టుకోలేక మా నాన్న గుండెపోటుతో మరణించారు’ అని ఆమె పేర్కొన్నారు.

News December 12, 2024

T20 ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాలని బ్రాడ్‌కాస్టర్లు ఐసీసీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని వారు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే ఫార్మాట్‌లో కాకుండా టీ20 ఫార్మాట్‌లో అయితే నష్టం వాటిల్లకుండా ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీనిపై ఐసీసీ కూడా పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News December 12, 2024

బ్రిస్బేన్‌ హోటల్‌లో కోహ్లీ-అనుష్క!

image

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట తమ ఏడో వివాహ వార్షికోత్సవాన్ని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ హోటల్‌లో జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటో వైరలవుతోంది. ప్రస్తుతం కోహ్లీ BGT కోసం జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు చేరుకోగా మూడో టెస్టు కోసం సన్నద్ధం అవుతున్నారు. వెడ్డింగ్ డే కావడంతో టీమ్‌కు దూరంగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశారు. 2017 డిసెంబర్ 11న వీరిద్దరి ప్రేమ వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

News December 12, 2024

భార్యాబాధితుడి సూసైడ్: చచ్చిపోవాలని భార్య తిడితే నవ్విన జడ్జి!

image

మనోవర్తి చెల్లించలేక, భార్య క్రూరత్వాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్న అతుల్ సుభాష్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ‘పిల్లాడి బాగోగుల కోసం మొదట నెలకు రూ.40వేలు అడిగారు. తర్వాత రూ.80వేలు, లక్షకు పెంచారు. చిన్న పిల్లాడికి ఎంత ఖర్చవుతుందని అతుల్ ప్రశ్నించారు. డబ్బు చెల్లించకుంటే సూసైడ్ చేసుకోవాలని భార్య అతడి మొహంపైనే అనేయడంతో జడ్జి నవ్వారు. ఇదెంతో బాధించింది’ అని అతుల్ అంకుల్ పవన్ ఆరోపించారు.