India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ‘ఫ్యామిలీ మ్యాన్’ రైటర్ సుపర్న్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఫొటోను రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మతో వర్మ అండ్ వర్మ అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే, తమకు క్యాస్ట్ ఫీలింగ్ లేదనే విషయంపై తాను ప్రమాణం చేయలేనని చమత్కరించారు. ఈ ముగ్గురూ నిన్న రాత్రి ఓ పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది.
AP: బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5,200 మందికి కోచింగ్ ఇస్తామని, BCలకు 66%, SCలకు 20%, STలకు 14% చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు EWS అభ్యర్థులకు 520 సీట్లు అదనంగా కేటాయించామని చెప్పారు. 2 నెలల పాటు ఇవ్వనున్న ఈ కోచింగ్ టైంలో నెలకు రూ.1500 స్టైఫండ్, మెటీరియల్ కోసం రూ.1000 ఇస్తామని తెలిపారు.
TG: వికారాబాద్ జిల్లా లగచర్ల వివాదంలో పలువురిని పోలీసులు <<14588376>>అరెస్టు చేయడాన్ని<<>> కేటీఆర్ ఖండించారు. ‘అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా? వాళ్లేమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఫార్మా కంపెనీల ఏర్పాటుతో పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా? ఇదేనా వెలుగులను తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం?’ అని Xలో ఫైరయ్యారు.
ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ పేర్కొంది. 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిపింది. ఇటీవల నారా లోకేశ్ ముంబై పర్యటనలో అనంత్ అంబానీతో ఈ డీల్ ఫైనల్ అయిందని పేర్కొంది. దీనివల్ల రాబోయే ఐదేళ్లలో 2.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు వివరించింది.
ఇండియా గ్రోత్ స్టోరీ, స్టాక్ మార్కెట్లపై దేశీయ ఇన్వెస్టర్ల నమ్మకం మరింత బలపడింది. మార్కెట్ సెంటిమెంటును పట్టించుకోకుండా దీర్ఘకాల దృక్పథంతో మెచ్యూరిటీతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడే ఇందుకో ఉదాహరణ. ప్రస్తుతం MF AUM ఆల్టైమ్ హై రూ.67.26 లక్షల కోట్లకు చేరడం విశేషం. రిటైల్ ఫోలియోస్ 17.23 కోట్లు, SIP అకౌంట్లు 10 కోట్లు దాటేశాయి. మంత్లీ సిప్ ఇన్ఫ్లో రూ.25వేల కోట్లంటే మాటలు కాదు.
సబ్బు, బాడీ వాష్లకు అదనంగా చర్మం మృదువుగా మారడానికి, డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడానికి స్క్రబ్స్(సింథటిక్/ప్లాంట్ ఫైబర్)ను వాడటం పెరిగింది. అయితే వీటిని ఉపయోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండ తగలకపోవడం వల్ల స్క్రబ్స్పై బాక్టీరియా, సూక్ష్మక్రిములు, బూజు పేరుకుపోతాయంటున్నారు. దీంతో చర్మ వ్యాధులు, అలర్జీలు పెరుగుతాయని చెబుతున్నారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఇది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా ఢిల్లీ పెద్దల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సీఎం చర్చిస్తారని సమాచారం.
భారత్ అనుకూల వ్యక్తులకు డొనాల్డ్ ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇండియా కాకస్ కోఛైర్మన్ మైక్ వాల్జ్ను NSAగా ఎంపిక చేశారని తెలిసింది. ఈ రిటైర్డ్ ఆర్మీ కల్నల్కు చైనా పొడ అస్సలు గిట్టదు. రిపబ్లికన్ చైనా టాస్క్ఫోర్స్లోనూ ఆయన సభ్యుడు. ఒకవేళ ఇండో పసిఫిక్ ప్రాంతంలో వివాదం ఏర్పడితే US మిలిటరీ సన్నద్ధంగా లేదని బాహాటంగానే చెప్పారు. ఉక్రెయిన్కు నాటో దేశాలు ఎక్కువ, అమెరికా తక్కువ సాయం చేయాలని సూచించారు.
TG: ఓ వానరం శివలింగం వద్ద చేసిన సందడి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కార్తీకమాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శివలింగం వద్ద భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉంచిన ప్రసాదాలు, అరటిపండ్లను వానరాలు ఆరగించాయి. వాటిల్లో ఓ కోతి శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఆహారం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పినట్లు ఆ దృశ్యం ఉందని అక్కడున్న వారు చర్చించుకున్నారు.
TG: పస లేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఏలుబడిలో రైతన్నలు రోడ్డెక్కారు. హైడ్రాపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. గ్రూప్స్ పరీక్షల కోసం విద్యార్థిలోకం భగ్గుమంది. ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతలు కన్నెర్రజేశారు. కులగణన ప్రశ్నలపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంది’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.