news

News November 12, 2024

కేసులు కాదు వీటిపై దృష్టి పెట్టండి: అంబటి రాంబాబు

image

AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఏడాది బాలుడిని <<14585855>>కుక్కలు<<>> చంపడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ‘వాడి మీద కేసు పెడదాం. వీళ్లను బొక్కలో వేద్దాం. మొత్తాన్ని చితక్కొడదాం అని కాకుండా ఇలాంటి ఘోరాల మీద దృష్టి పెట్టండి. ఈ వార్త చూస్తేనే హృదయం ద్రవిస్తోంది’ అని ట్వీట్ చేశారు.

News November 12, 2024

ఇజ్రాయెల్ దాడులు జాతి విధ్వంసమే: సౌదీ

image

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖండించారు. అవి పాలస్తీనీయుల నిర్మూలనకు జరుగుతున్న దాడులని, అంతర్జాతీయ సమాజం వాటిని అడ్డుకోవాలని కోరారు. ముస్లిం, అరబ్ నేతల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరాన్‌ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ గౌరవించాలని సూచించారు. పాలస్తీనా దేశం ఏర్పాటైతేనే తాము ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తామని యువరాజు తేల్చిచెప్పారు.

News November 12, 2024

వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్‌బై?

image

AP: ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వైసీపీకి, పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం తనను విస్మరించిందని ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జనసేనలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చించారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడిన విషయం తెలిసిందే. మాజీ ఐఆర్ఎస్ అధికారి అయిన ఈయన 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచారు. తర్వాత వైసీపీలో చేరారు.

News November 12, 2024

ఛాంపియన్స్ ట్రోఫీకి ఒలింపిక్స్‌కు పాక్ లింక్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ దేశానికి భారత్ రాదని దాదాపు తేలిపోవడంతో పాకిస్థాన్ ఆగ్రహంతో ఉంది. ఇకపై ఏ ఇంటర్నేషనల్ పోటీలోనైనా INDతో ఆడకుండా వైదొలగడానికి దాయాది దేశం సిద్ధమైనట్లు Geo న్యూస్ వెల్లడించింది. అలాగే 2036లో ఒలింపిక్స్ ఆతిథ్యానికి ఆసక్తిగా ఉన్న భారత్‌కు వ్యతిరేకంగా పాక్ లాబీయింగ్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అంతర్జాతీయంగా ఎంతో ప్రభావం చూపే ఇండియాను పాక్ అడ్డుకోగలదా అనేది పెద్ద ప్రశ్న.

News November 12, 2024

మంత్లీ SIP: ఫస్ట్ టైమ్ రూ.25000 కోట్లతో రికార్డ్

image

భారత మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొలిసారి మంత్లీ సిప్ ఇన్‌ఫ్లో OCTలో రూ.25,000Cr చేరుకుంది. SEPలోని రూ.24,509Cr మార్కును దాటేసింది. 2023 OCTలో ఈ విలువ రూ.16,928 కోట్లే. మొత్తంగా ఈక్విటీ స్కీముల్లోకి రూ.41,886 కోట్ల ఇన్‌ఫ్లో వచ్చింది. ఇక రిటైల్ AUM OCTలో రూ.39,18,611 కోట్లుగా ఉంది. ప్రస్తుతం MF ఫోలియోస్‌ 21,65,02,804 ఉండగా రిటైల్ MF ఫోలియోస్ 17,23,52,296గా ఉన్నాయి.

News November 12, 2024

రైతుభరోసా డబ్బులు ఎప్పుడంటే?

image

TG: రైతుభరోసాపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

News November 12, 2024

అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘంలో సీఎం చంద్రబాబు

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా ఏడు రాష్ట్రాల సీఎంలు, ఐదుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు అంతర్రాష్ట్ర మండలి ఉండాలని ఆర్టికల్ 263 పేర్కొంది. రాష్ట్రాల మధ్య వివాదాలను, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమస్యలను పరిశీలించి సలహా ఇవ్వడం దీని బాధ్యత.

News November 12, 2024

‘అసెంబ్లీ భోజనం’పై స్పీకర్ ఆగ్రహం

image

AP: అసెంబ్లీలో అందించే భోజనం సరిగా లేదని పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఫిర్యాదుచేశారు. దీంతో ఆయన అధికారులు, ఫుడ్ కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా చెప్పారా? ఎమ్మెల్యేలంటే తమాషాగా ఉందా? మీ ఇష్టానుసారం చేస్తారా? అని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.

News November 12, 2024

3 in 1 ట్రేడింగ్ అకౌంట్స్ అంటే ఏంటి?

image

క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు 3 ఇన్ 1 ట్రేడింగ్ అకౌంట్లు జారీచేయాలని సెబీ ఆదేశించింది. ఆ అవకాశం లేకుంటే UPI ఆధారిత బ్లాక్ మెకానిజంతో ABSA తరహాలో ట్రేడింగ్ ఫెసిలిటీ కల్పించాలని సూచించింది. 3 ఇన్ 1 అకౌంట్లో సేవింగ్స్, డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు కలిపే ఉంటాయి. దీంతో షేర్లు కొనుగోలు చేయకుండా మిగిలున్న డబ్బుకు వడ్డీ వస్తుంది. ప్రస్తుతం డీమ్యాట్, ట్రేడింగ్ సేవలే ఒక చోట దొరుకుతున్నాయి.

News November 12, 2024

BRS ఎమ్మెల్యే మాగంటికి ఊరట

image

TG: జూబ్లీహిల్స్ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆధారాలు లేని పిటిషన్ కొట్టేయాలని మాగంటి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేయగా, ఆయన సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణపై స్టే విధించింది. దీంతో పాటు ప్రతివాది అజహరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది.