news

News December 12, 2024

అదానీకి రూ.27వేల కోట్ల లాభం.. షేర్ల జోరు

image

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు జోరుమీదున్నాయి. ఇవాళ ఒక్కరోజే గ్రూప్ విలువ రూ.27వేల కోట్ల మేర పెరిగింది. రాజస్థాన్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ 250MW సోలార్ పవర్ ప్రాజెక్టును ఆరంభించింది. కంపెనీ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 11,434MWకు పెరగడంతో ఈ షేర్లు 7.1% లాభపడి రూ.1229 వద్ద చలిస్తున్నాయి. అదానీ పవర్ 5.6, ఎనర్జీ సొల్యూషన్స్ 3, టోటల్ గ్యాస్ 2.3, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.7, NDTV 1.7% మేర ఎగిశాయి.

News December 12, 2024

BREAKING: భీకర ఎన్‌కౌంటర్.. 12 మంది మృతి

image

మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ ఏడుగురు మావోలు ప్రాణాలు కోల్పోయారు.

News December 12, 2024

టూరిస్టులు లేక దీనస్థితిలో గోవా!

image

ఇండియన్ టూరిజం ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే గోవాలో ప్రస్తుతం సందడి తగ్గింది. ఈ ఏడాది గోవాలో తక్కువ మంది పర్యటించినట్లు తెలుస్తోంది. భారత టూరిస్టులంతా థాయ్‌లాండ్, మలేషియాకు వెళ్తున్నారు. గోవాలో సరైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు లేకపోవడం, టాక్సీల దోపిడీ వల్ల టూరిస్టులు వచ్చేందుకు మొగ్గు చూపట్లేదని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 12, 2024

సినీ నటుడు మోహన్ బాబుపై మరో ఫిర్యాదు

image

మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మంచు విష్ణు నటిస్తున్న ఓ మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారు. మోహన్ బాబుతోపాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News December 12, 2024

‘సరస్వతి’ భూములు వెనక్కి తీసుకున్న సర్కార్

image

AP: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు పల్నాడు జిల్లా మాచవరం తహశీల్దార్ ఎం.క్షమారాణి తెలిపారు. మొత్తం 17.69 ఎకరాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకుంది. వేమవరం, చెన్నాయపాలెం, పిన్నెల్లి గ్రామాల పరిధిలో సరస్వతి కంపెనీకి దాదాపు 2 వేల ఎకరాల భూములు ఉన్నట్లు తెలుస్తోంది.

News December 12, 2024

నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సురేఖ తరఫున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరుకావడానికి మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి కోర్టు వాయిదా వేసింది.

News December 12, 2024

తెలుగు సినిమా రేంజ్ ఇదే!

image

‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తమైందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిన్న ‘పుష్ప-2’ కలెక్షన్లలో రికార్డు సృష్టించడంతో తెలుగు సినిమా రేంజ్ ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 8 రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలుంటే అందులో నాలుగు మనవేనంటున్నారు. త్వరలో రిలీజయ్యే ప్రభాస్, మహేశ్ సినిమాలు కూడా ఈ జాబితాలో చేరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మీ ఫేవరెట్ ఏంటి?

News December 12, 2024

₹3L కోట్లు: 2024లో INCOME TAX రికార్డులివే..

image

FY25లో ట్యాక్స్ రీఫండ్‌ చెల్లింపుల్లో రికార్డు సృష్టించామని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. 2024 APR 1 నుంచి NOV 27 వరకు ఏకంగా Rs 3.08 లక్షల కోట్లు చెల్లించినట్టు చెప్పింది. గతేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఇది 46.31% ఎక్కువని వివరించింది. ఈ ఏడాది గరిష్ఠంగా ఒక సెకనుకు 900, ఒక రోజు 70 లక్షల ITRలు దాఖలైనట్టు పేర్కొంది. AY 2024-25కు సంబంధించి ఒకేరోజు 1.62 కోట్ల ITRలు ప్రాసెస్ చేసినట్టు వెల్లడించింది.

News December 12, 2024

BGT థర్డ్ టెస్టు ప్రాక్టీస్ సెషన్‌లో టీమ్‌కు కోహ్లీ సూచనలు!

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది. తాజాగా గబ్బా స్టేడియంలో టీమ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ జట్టు సభ్యులకు సూచనలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఎల్లుండి నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో టీమిండియా గెలవగా, రెండో టెస్టులో ఆసీస్ విజయం సాధించింది.

News December 12, 2024

ప్రభుత్వ దుబారా ఖర్చుల వల్లే ద్రవ్యోల్బణం: మస్క్

image

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ ద్రవ్యోల్బణంపై చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రభుత్వాలు చేసే అధిక వ్యయమే ద్రవ్యోల్బణానికి కారణమవుతున్నాయి. ప్రభుత్వ దుబారా ఖర్చులను అరికడితే ద్రవ్యోల్బణం ఉండదు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. మస్క్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలనే చూస్తున్నామని, ధరల పెరుగుదలను పట్టించుకోవట్లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.