News February 8, 2025

1956-93 మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎందుకు లేదు?

image

1952లో ఢిల్లీకి తొలి ఎన్నికలు జరిగాయి. 1956 నుంచి 93 వరకు అసెంబ్లీ మనుగడలో లేదు. 1956 NOV 1న అమల్లోకి వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర హోదా కోల్పోయి UTగా మారింది. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం వచ్చింది. 56 ఎలెక్టెడ్, LG నామినేటెడ్ మెంబర్స్ ఐదుగురు ఉండేవారు. అయితే వీరికి శాసనాధికారాలు లేవు. 1991లో 69వ సవరణ ద్వారా అసెంబ్లీ మళ్లీ మనుగడలోకి వచ్చింది.

Similar News

News March 19, 2025

ఇండియాలో 6 అడుగుల ఎత్తున్న వారు ఎందరంటే?

image

‘ఆరడుగుల అందగాడు’ అని చెప్తూ ఎత్తును ఎందుకు కన్సిడర్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మన దేశంలో 6 ఫీట్ కటౌట్ కలిగిన వ్యక్తులు చాలా తక్కువ. ఇండియాలో 1శాతం మంది మాత్రమే 6 లేదా అంతకంటే ఎక్కువ ఎత్తును కలిగి ఉన్నారు. భారతీయ మగవారి సగటు ఎత్తు 5.5 అడుగులు (164.94 సెం.మీ) కాగా ఆడవారి సగటు ఎత్తు 5 అడుగులు. అలాగే USAలో 14.5% మంది పురుషులు ఆరు అడుగుల కంటే ఎత్తు ఉన్నారు. మీ హైట్ ఎంత? COMMENT

News March 19, 2025

దేశంలోనే అత్యంత ధనిక MLA ఇతనే

image

దేశంలోని 4,092 MLAల ఆస్తులపై ఏడీఆర్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా(BJP) దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. రూ.3,400 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.1,413 కోట్లతో కర్ణాటక Dy.CM DK శివకుమార్(INC) రెండో స్థానంలో నిలిచారు. రూ.1,700తో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధారా(BJP) నిలిచారు.

News March 19, 2025

ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 25, 26 తేదీల్లో సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, పీ4 విధానంపై చర్చించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్, అర్హులకు పథకాల అందజేత, ఇతర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

error: Content is protected !!