India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 70 స్థానాలున్న దేశ రాజధానిలో అధికారం చేపట్టాలంటే 36 స్థానాలు గెలుచుకోవాలి. తాము 50 సీట్లతో విజయఢంకా మోగించబోతున్నామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా మూడోసారి అధికారం తమదేనని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత తేలిపోయింది. ఈ సారి కనీసం పరువు కాపాడుకోవాలని ఆరాటపడుతోంది.

TG: టెన్త్ క్వశ్చన్ పేపర్లపై క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్లను విద్యాశాఖ ముద్రించనుందని సమాచారం. ఎక్కడైనా లీకైతే అవి ఏ సెంటర్ నుంచి బయటికి వచ్చాయో సులభంగా తెలుసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. APలో గత ఏడాదే ఈ విధానం అమలు చేశారు. కాగా ఇంటర్ హాల్టికెట్లు విడుదల కాగానే విద్యార్థుల మొబైల్కు మెసేజ్ పంపేలా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే హాల్టికెట్ రానుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో అక్కడి ఫలితంపై ఆసక్తి నెలకొంది. రాజధానిలో గడచిన 2సార్లూ ఆప్దే అధికారం. ముచ్చటగా మూడోసారీ గెలిచి అధికారంలోకి వస్తామని ఆప్ భావిస్తుంటే.. 27 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీని ఈసారి చేజిక్కించుకుంటామని బీజేపీ నమ్మకంగా చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీవైపే మొగ్గు చూపుతున్నాయి. మరి ఢిల్లీ ఓటరు మనోగతం ఎలా ఉందో నేటి సాయంత్రం లోపు తేలనుంది.

సెలబ్రిటి క్రికెట్ లీగ్(CCL) 11వ సీజన్ ఇవాళ ప్రారంభం కానుంది. మ.2 గంటలకు బెంగళూరు వేదికగా చెన్నై రైనోస్VSబెంగాల్ టైగర్స్, సా.6 గంటలకు తెలుగు వారియర్స్VSకర్ణాటక బుల్డోజర్స్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 2 వరకు ఈ టోర్నీ కొనసాగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్లు బ్యాట్, బంతితో సత్తా చాటనున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో HYDలో నాలుగు మ్యాచులున్నాయి.

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తనకు అగాథమేర్పడిందన్న వార్తల్ని సీఎం రేవంత్ కొట్టిపారేశారు. ఆయన తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ‘మధ్యప్రదేశ్ సభలో తెలంగాణ CM బాగా చేస్తున్నాడంటూ కొనియాడారు. కులగణనపై ఆయనతో చర్చిస్తూనే ఉన్నాం. ఆయన ఆమోదం లేకుండా చేస్తామా..? రాహుల్తో నా సాన్నిహిత్యం ఎలాంటిదో ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు’ అని పేర్కొన్నారు.

AP: వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల్లోని ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. అగ్రికల్చర్, పశువైద్య విద్యార్థుల స్కాలర్షిప్ను ₹7K నుంచి ₹10Kకు, PG స్టూడెంట్లకు ₹12Kకు పెంచింది. అలాగే సన్న రకం వరి సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యాదవ, కురబలకు BC కార్పొరేషన్ ద్వారా గొర్రెలు, మేకల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు.

వరకట్నం కేసుల్లో భర్త కుటుంబాన్ని నిందితులుగా చేర్చడం సరికాదని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. స్పష్టమైన ఆరోపణలుంటేనే వారిపై కేసు పెట్టాలని పేర్కొంది. ‘వైవాహిక వివాదాలు సాధారణంగా భార్యాభర్తల మధ్య భావోద్వేగాల కారణంగానే తలెత్తుతాయి. భర్త మీద కోపాన్ని అతడి కుటుంబీకులపై చూపించి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అలా అందర్నీ ఇరికించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే’ అని ఓ కేసు విచారణలో తేల్చిచెప్పింది.

ఫైలిరియాసిస్(బోదకాలు) నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది. ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో 2 వారాలపాటు కొనసాగనుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇంటికే వచ్చి ఉచితంగా ఔషధాలు అందిస్తారని, తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది. క్యూలెక్స్ దోమల కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. దీనివల్ల కాళ్లతోపాటు ఇతర శరీర భాగాలు విపరీతంగా వాపునకు గురవుతాయి.

AP: మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. 2019లో సోషల్ మీడియాలో రజినీపై పోస్టు పెట్టినందుకు తనను సీఐ సూర్యనారాయణ ద్వారా హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో రజినీ, ఆమె పీఏలతోపాటు అప్పటి సీఐపై కేసు నమోదైంది.

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో SSMB29 మూవీ షూటింగ్ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.