News February 8, 2025
వరకట్నం కేసుల్లో కుటుంబం మొత్తాన్ని చేర్చడం తప్పు: సుప్రీం కోర్టు

వరకట్నం కేసుల్లో భర్త కుటుంబాన్ని నిందితులుగా చేర్చడం సరికాదని సుప్రీం కోర్టు తాజాగా అభిప్రాయపడింది. స్పష్టమైన ఆరోపణలుంటేనే వారిపై కేసు పెట్టాలని పేర్కొంది. ‘వైవాహిక వివాదాలు సాధారణంగా భార్యాభర్తల మధ్య భావోద్వేగాల కారణంగానే తలెత్తుతాయి. భర్త మీద కోపాన్ని అతడి కుటుంబీకులపై చూపించి కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. అలా అందర్నీ ఇరికించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే’ అని ఓ కేసు విచారణలో తేల్చిచెప్పింది.
Similar News
News March 26, 2025
కోహ్లీ గొప్ప రోల్ మోడల్: నవజ్యోత్

విరాట్ కోహ్లీ ఒక ఇన్స్టిట్యూషన్ లాంటివారని, ఆయన పేరు కొన్ని తరాలు నిలిచి ఉంటుందని మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కొనియాడారు. ‘స్టార్ స్పోర్ట్స్’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనొక గొప్ప రోల్ మోడల్ అని, వీధుల్లోని పిల్లలు అతనిలా ఉండాలని కోరుకుంటారని పేర్కొన్నారు. యువతపై అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. తన చరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
News March 26, 2025
Stock Markets: ₹4లక్షల కోట్లు ఆవిరి

స్టాక్మార్కెట్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ 23,486 (-181), సెన్సెక్స్ 77,288 (-728) వద్ద ముగిశాయి. ₹4L CR మదుపరుల సంపద ఆవిరైంది. మీడియా, రియాల్టి, హెల్త్కేర్, చమురు, PSE, PSU బ్యాంకు, IT, ఫైనాన్స్, ఫార్మా, కమోడిటీస్, PVT బ్యాంకు, ఎనర్జీ షేర్లు విలవిల్లాడాయి. ఇండస్ఇండ్, ట్రెంట్, హీరోమోటో, గ్రాసిమ్, పవర్ గ్రిడ్ టాప్ గెయినర్స్. NTPC, TECH M, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ లూజర్స్.
News March 26, 2025
చిరంజీవితో సినిమాపై అనిల్ రావిపూడి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై దర్శకుడు అనిల్ రావిపూడి అప్డేట్ ఇచ్చారు. ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిందని ట్వీట్ చేశారు. ‘చిరంజీవి గారికి నా కథలో పాత్ర “శంకర్ వరప్రసాద్” ని పరిచయం చేశాను. ఆయనకు కథ నచ్చింది. త్వరలో ముహూర్తంతో చిరునవ్వుల పండగబొమ్మకి శ్రీకారం’ అని పేర్కొన్నారు. ఉగాదికి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం.