India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బిగ్బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం జరగనుంది. పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఈ మెగా ఈవెంట్కు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విన్నర్కు ఆయనే ట్రోఫీ అందజేస్తారని తెలుస్తోంది. ఇవాళో, రేపో దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు టాప్-5 ఫైనలిస్ట్స్లో అవినాశ్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్ ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారని మీరనుకుంటున్నారు?
క్రిప్టోమార్కెట్లు నిన్న జోరుప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడుల వర్షం కురిపించారు. గత 24 గంటల్లో బిట్కాయిన్ $4500 (Rs 3.82L) లాభపడింది. మళ్లీ $1,01,125 వద్ద ముగిసింది. నేడు మాత్రం $450 నష్టంతో $1,00,676 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ విలువ $2.02Tను టచ్ చేసింది. ఇక డామినెన్స్ 55%గా ఉంది. గత 24 గంటల్లో ETH 6, XRP 5, SOL 6, BNB 7, DOGE 8, ADA 10, TRON 7, AVAX 12, SHIB 9% మేర పెరగడం విశేషం.
పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో <<14796361>>రేవతి<<>> చనిపోగా ఆమె కొడుకు గాయపడిన విషయం తెలిసిందే. రేవతి మృతితో తమకు సంబంధం లేదని సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం అల్లు అర్జున్ కూడా ఇదే కారణం చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం తను వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందనడం సరికాదని, తనపై కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. మరి ఈ ఘటనకు బాధ్యులెవరు?
నటుడు మోహన్బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. TV9 రిపోర్టర్పై దాడి చేసినందుకు నిన్న ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేసిన పోలీసులు ఇవాళ దాన్ని మార్చారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. మరోవైపు ఘర్షణలో గాయపడ్డ మోహన్బాబు ప్రస్తుతం కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
TG: ఈ నెల 19 నుంచి 29 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే పుస్తక ప్రదర్శనలో 350 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుక్ ఫెయిర్లో తెలంగాణ వంటకాలతోపాటు ఇరానీ చాయ్, బిర్యానీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ ప్రదర్శనను సీఎం రేవంత్తోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు.
స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా మొదలై లాభాల బాటపట్టొచ్చని విశ్లేషకులు అంటున్నారు. EU, US సూచీలు నిన్న లాభపడ్డాయి. ఆసియా నుంచి నేడు సానుకూల సంకేతాలే అందుతున్నాయి. జపాన్, తైవాన్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 14 పాయింట్లే పెరిగింది. ఫియర్ఇండెక్స్ INDIA VIX కూల్ ఆఫ్ అవుతుండటం సానుకూలం. STOCKS TO WATCH: NUVAMA WEALTH, GLAND PHARMA, RELIANCE POWER, VARROC ENGINEERING, IOB, VEDL
TG: రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ వి.చాముండేశ్వరీనాథ్పై ఆయన 34 ఓట్ల తేడాతో నెగ్గారు. జితేందర్కు 43 ఓట్లు రాగా, చాముండికి 9 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కాగా టీఓఏ కార్యదర్శిగా మల్లారెడ్డి, కోశాధికారిగా డి.సతీశ్ గౌడ్ ఎంపికయ్యారు. మరో 23 పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. త్వరలోనే జితేందర్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.
AP: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించనున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి స్టూడెంట్స్కు కొత్త యూనిఫామ్ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న యూనిఫామ్, బెల్టులు, బ్యాగ్ల రంగులను మారుస్తోంది. కొత్త యూనిఫామ్ నమూనా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కేంద్రమంత్రి అమిత్ షాతో మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడణవీస్ బుధవారం అర్ధరాత్రి ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో వీరి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి? అనే విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. CM పదవి ఇవ్వలేదని అలకబూనిన శిండే Dy.CMగా ఉండేందుకు ఇంకా అంగీకరించలేదని సమాచారం. దీంతో ఆయనను ఒప్పించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
నిన్న రాత్రి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. మెసేజ్లు వెళ్లడంలేదని యూజర్లు ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే సాంకేతిక కారణాలతోనే సమస్య ఏర్పడిందని, త్వరలోనే పరిష్కరిస్తామని ‘మెటా’ ప్రకటించింది. మరి మీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా పనిచేస్తున్నాయా?
Sorry, no posts matched your criteria.