news

News December 12, 2024

జమిలితో GDP పెరుగుతుంది: కోవింద్

image

దేశంలో జమిలి ఎన్నికలతో GDP 1%-1.5% పెరుగుతుందని ఈ ఎన్నికల కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని తెలిపారు. జమిలి ఎన్నికలు అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ అభిప్రాయమో కాదని దేశ ప్రజల కోరిక అని చెప్పారు. ఈ ఎన్నికల బిల్లు చట్టరూపం దాల్చితే దేశంలోని అన్ని అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలి. ఆపై 100రోజుల్లోనే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలుంటాయి.

News December 12, 2024

షుగర్ పేషెంట్లలో తమిళనాడు టాప్

image

దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు తమిళనాడులో ఉన్నారని కేంద్రం తెలిపింది. అక్కడ 80.90 లక్షల మంది వ్యాధిబారిన పడినట్లు పేర్కొంది. ఈ జాబితాలో TG 4వ ప్లేస్‌లో ఉంది. రాష్ట్రంలో 24.52 లక్షల మంది డయాబెటిక్ బాధితులున్నారు. రెండో స్థానంలో MH(39.81 లక్షలు), మూడో ప్లేస్‌లో KA(28.74 లక్షలు) నిలిచాయి. ఇక APలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అత్యల్పంగా ఢిల్లీలో 1,108 మంది బాధితులే ఉండటం గమనార్హం.

News December 12, 2024

రాష్ట్రానికి తప్పిన ముప్పు

image

AP: రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పింది. ‘ఫెంగల్’తో ఇబ్బందులు పడిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల వైపు వచ్చిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడి శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళ్లి తీరం దాటుతుందని చెప్పింది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయంది.

News December 12, 2024

నేటి నుంచి రాజమండ్రి- ఢిల్లీ విమాన సర్వీసులు

image

AP: రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి నేడు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 6E 364 ఇండిగో విమాన సర్వీసు నేటి నుంచి రోజూ రాకపోకలు సాగించనుంది. ఈ విమానం ఉదయం 6.30కు ఢిల్లీ నుంచి మధురపూడి వచ్చి, ఇక్కడి నుంచి ఉదయం 9.30కు బయలుదేరి వెళ్తుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా, తాజా సర్వీసుతో ఉభయ గోదావరి ప్రజలు సంతోష పడుతున్నారు.

News December 12, 2024

దారుణం.. బాలికను ముక్కలుగా నరికేశాడు!

image

ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని ధరౌథి పీఎస్ పరిధిలో బాలికను రేప్ చేసిన కను కిస్సాన్ అనే వ్యక్తి గతేడాది AUG జైలుకెళ్లాడు. DECలో బెయిల్‌పై వచ్చిన అతను బాలికను చంపేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికేసి పలు ప్రాంతాల్లో ఆ భాగాలు విసిరేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. రేప్ కేసులో బాధితురాలైన బాలిక కోర్టులో స్టేట్‌మెంట్ ఇస్తుందనే భయంతో హత్య చేసినట్లు అతను వివరించారు.

News December 12, 2024

4 పంచాయతీలకు నేషనల్ అవార్డులు

image

AP: రాష్ట్రంలోని 4 పంచాయతీలకు నేషనల్ అవార్డులొచ్చాయి. పలు కేటగిరీల్లో బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు ప్రదానం చేశారు. ఆరోగ్యకర కేటగిరీలో చిత్తూరు(D) బొమ్మసముద్రం, పచ్చదనం-పరిశుభ్రత కేటగిరీలో అనకాపల్లి(D) తగరంపూడికి, సంతృప్తికర తాగునీరు కేటగిరీలో అనకాపల్లి(D) న్యాయంపూడికి, సామాజిక భద్రతలో ఎన్టీఆర్(D) ముప్పాళ్ల పంచాయతీలకు అవార్డులు వరించాయి.

News December 12, 2024

వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌.. 13వ గేమ్ డ్రా

image

వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల భారత్ ఆటగాడు గుకేశ్, డింగ్ లిరెన్ మధ్య 13వ గేమ్ సైతం డ్రాగా ముగిసింది. దీంతో వీరిద్దరూ 6.5 పాయింట్లతో సమానంగా ఉన్నారు. సింగపూర్‌లో బుధవారం జరిగిన తాజా గేమ్‌లో 69 ఎత్తుల తర్వాత ఇద్దరూ డ్రాకు అంగీకరించారు. విన్నర్‌ను నిర్ణయించే ఫైనల్ గేమ్ నేడు జరగనుంది. ఆ రౌండ్ కూడా డ్రా అయితే, శుక్రవారం టై బ్రేక్‌ నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు.

News December 12, 2024

సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు ఉంచుకోవచ్చు?

image

RBI నిబంధనల ప్రకారం సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బైనా ఉంచుకోవచ్చు. అయితే ఖాతాలో జమ చేసే నగదు ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే, ఆదాయ మూలాన్ని IT శాఖకు చెప్పాల్సి ఉంటుంది. అటు, బ్యాంకులో మనీ డిపాజిట్, విత్‌డ్రాకు లిమిట్ ఉంటుంది. కానీ చెక్ లేదా ఆన్‌లైన్‌లో సేవింగ్స్ ఖాతాలో రూ. కోట్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. డబ్బును సేవింగ్స్ ఖాతాలో ఉంచడం కంటే FD చేయడం మంచిదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.

News December 12, 2024

అప్పుడు ₹100 కోట్లు.. ఇప్పుడు ₹1000 కోట్లు

image

ఏదైనా సినిమా ₹100 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిందంటే దాన్నో విశేషంగా చెప్పుకొనే వాళ్లం. ఇప్పుడు ప‌రిస్థితి మారింది. సినిమా ₹వెయ్యి కోట్ల‌దా? కాదా? అని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా ఆ మార్క్ చేరుకున్న 8వ చిత్రంగా <<14851893>>పుష్ప‌-2<<>> నిలిచింది. అంత‌కుముందు దంగ‌ల్, బాహుబ‌లి-2, RRR, KGF-2, జవాన్‌, పఠాన్‌, క‌ల్కీ సినిమాలు ఈ ఘనత సాధించాయి. ఈ 8లో 4 మన తెలుగు చిత్రాలే ఉండడం విశేషం.

News December 12, 2024

విజయ్‌ పాల్ పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

image

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విజయ్‌ పాల్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 13, 14 తేదీల్లో ఆయన్ను విచారించనున్నారు. విజయపాల్ ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామను గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో CID మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.