news

News November 11, 2024

విమాన వేంకటేశ్వరుడి గురించి తెలుసా?

image

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేవారు ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆనంద నిలయం విమాన గోపురంపై వాయవ్య మూలన గూడు లాంటి చిన్న మందిరం ఉంటుంది. వెండి మకరతోరణంతో ఉన్న ఆ మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహ దర్శనం మూలమూర్తి దర్శనంతో సమానమని ప్రతీతి. క్యూలో, రద్దీ కారణంగా ఆనంద నిలయంలోని స్వామి వారి దర్శనం కాకపోతే ఈ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా యాత్రా ఫలం దక్కుతుందని నమ్మకం.

News November 11, 2024

కాలుష్యాన్ని ఏ మతమూ పోత్సహించదు: SC

image

కాలుష్యానికి కారణమయ్యే చర్యలను ఏ మతమూ ప్రోత్సహించదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టపాసులు కాల్చడంపై దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం ఎందుకు లేదని ప్రశ్నించింది. కాలుష్యం అనేది ఏడాదంతా సమస్యగా మారినప్పుడు కేవలం పండుగ సమయాల్లో నిషేధం విధిస్తున్నారని ఢిల్లీలో కాలుష్యంపై కేసు విచారణ సందర్భంగా కోర్టు తప్పుబట్టింది. ఫ్యాషన్‌గా టపాసులు కాలిస్తే అది ప్రాథమిక ఆరోగ్య హక్కును ప్రభావితం చేస్తుందని పేర్కొంది.

News November 11, 2024

మ్యాన్‌హోల్స్ మూతలు రౌండ్‌గానే ఎందుకు?

image

దీనికి పలు కారణాలున్నాయి. వేరే ఆకారంలో ఉంటే మూత తీసేటప్పుడు పొరపాటున లోపలికి పడవచ్చు. రౌండ్‌గా ఉంటేనే ఎటువైపు నుంచీ లోపల పడిపోదు, పైకి సైతం సులువుగా ఎత్తవచ్చు. వృత్తాకారంలో ఉంటేనే ఈజీగా పక్కకు తరలించవచ్చు. అంతే సులువుగా మూత బిగించవచ్చు. ఒక సైజులోని చతురస్రం సహా ఏ ఇతర ఆకారాల్లోని మూత ఎంత స్థలాన్ని మూయగలదో అదే స్పేస్‌ను రౌండ్ షేప్ తక్కువ సైజులో మూస్తుంది. దీంతో నిర్మాణ ఖర్చు కూడా తక్కువ అవుతుంది.

News November 11, 2024

ప్రజ్వల్ రేవణ్ణ బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

లైంగిక వేధింపుల కేసులో కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. పలువురు మహిళలపై ప్రజ్వల్ అత్యాచారానికి పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో వీడియోలు బయటికొచ్చాయి. దీంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి మేలో అరెస్ట్ చేశారు.

News November 11, 2024

ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపా: CM

image

TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 కూడా నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 2011లో చివరిసారిగా గ్రూప్-1 నిర్వహించారని, దాదాపు 13 ఏళ్ల పాటు పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపానని, ఎంపికైన వారికి త్వరలో నియామకపత్రాలు అందిస్తానని పేర్కొన్నారు.

News November 11, 2024

KL రాహుల్‌ లాంటి ప్లేయర్ ఎన్ని జట్లకు ఉన్నారు: గంభీర్

image

ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న KL రాహుల్‌కు కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచారు. అతడిలాంటి ప్లేయర్ అసలు ఎన్ని జట్లకు ఉన్నారని ప్రశ్నించారు. ‘KL ఓపెనింగ్ నుంచి 6డౌన్ వరకు బ్యాటింగ్ చేస్తారు. అలా ఆడాలంటే స్పెషల్ టాలెంట్ కావాలి. పైగా వన్డేల్లో కీపింగ్ చేయగలరు. రోహిత్ లేకుంటే ఓపెనర్‌గా అతడూ ఓ ఆప్షన్’ అని BGT సిరీసుకు ముందు గౌతీ అన్నారు. చాన్నాళ్లుగా KL రన్స్ చేయలేక జట్టులోకి వస్తూ పోతూ ఉన్నారు.

News November 11, 2024

బడి దొంగలను చూశాం కానీ.. KCRపై సీఎం సెటైర్

image

TG: ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని తాము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి దొంగలను చూశాం కానీ అసెంబ్లీకి రాని వారిని ఇప్పుడే చూస్తున్నాం అని సెటైర్ వేశారు. శాసనసభకు వచ్చి సమస్యలపై చర్చించడం ప్రతిపక్ష నేత బాధ్యత అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కూడా కట్టలేదు కానీ ఆయన మాత్రం 10 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారని రేవంత్ విమర్శించారు.

News November 11, 2024

ఢిల్లీకి కేటీఆర్.. ‘అమృత్’ స్కామ్‌పై కేంద్రానికి ఫిర్యాదు

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అమృత్ పథకంలో కుంభకోణం జరిగిందనే అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి లాభం చేకూరేలా అధికార దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

News November 11, 2024

బీఏసీ సమావేశానికి YCP గైర్హాజరు

image

AP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ గైర్హాజరైంది. ఈ ఉదయం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. రూ.2.94లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం సమావేశాలను ఎల్లుండికి వాయిదా వేశారు.

News November 11, 2024

KCRకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

image

TG: 10 నెలల్లో తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ప్రజలకు తెలిసొచ్చిందన్న KCR వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. రూ.18వేల కోట్ల రుణమాఫీ జరిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం. ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. డీఎస్సీతో ఉద్యోగాలు భర్తీ చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం. మిమ్మల్ని ప్రజలు మర్చిపోయారు’ అని తెలిపారు.