news

News December 11, 2024

మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట

image

ఢిల్లీ మాజీ Dy.CM మ‌నీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊర‌ట ద‌క్కింది. లిక్క‌ర్ పాల‌సీ కేసులో Aug 9న ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ సోమ‌, గురువారాల్లో విచార‌ణాధికారి ముందు హాజ‌రుకావాల‌ని SC గతంలో ఆదేశించింది. అయితే ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇవ్వాల‌ని సిసోడియా కోర‌గా సుప్రీంకోర్టు అంగీక‌రించింది. వారంలో 2 రోజులు హాజ‌ర‌వ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని, ట్ర‌య‌ల్ సంద‌ర్భంగా క‌చ్చితంగా కోర్టుకు హాజ‌ర‌వ్వాల‌ంది.

News December 11, 2024

ICC ర్యాంకింగ్స్‌లో మరింత దిగిపోయిన హిట్‌మ్యాన్

image

ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరింత దిగిపోయారు. టాప్30లో కూడా ఆయన నిలవలేకపోయారు. 5 స్థానాలు కోల్పోయి 31లో నిలిచారు. మరోవైపు కోహ్లీ కూడా 6 స్థానాలు దిగి 20వ ప్లేస్‌లో ఉన్నారు. ఇక హారీ బ్రూక్ అగ్ర స్థానానికి దూసుకొచ్చారు. జో రూట్ రెండో స్థానానికి పడిపోయారు. జైస్వాల్ మూడు, రిషభ్ పంత్ తొమ్మిది, శుభ్‌మన్ గిల్ పదిహేడో స్థానంలో కొనసాగుతున్నారు.

News December 11, 2024

రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ తనయుడు!

image

కోహ్లీ-అనుష్క దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో అకాయ్ కోహ్లీ జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పేరుకు అర్థమేంటంటూ నెటిజన్లు గూగుల్‌ని శోధించారు. ఈక్రమంలో 2024లో అత్యధికంగా అర్థం వెతికిన పదాల జాబితాలో అకాయ్ పేరు 2వ స్థానంలో నిలిచిందని గూగుల్ తెలిపింది. తొలిస్థానంలో ‘అన్ని కళ్లూ రఫా పైనే’ అన్న వాక్యం నిలిచింది. పుట్టిన తొలి ఏడాదే అకాయ్ రికార్డులు సృష్టిస్తున్నాడంటూ కోహ్లీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 11, 2024

శ్రేయా ఘోషల్ భర్త గురించి తెలుసా?

image

మెలోడియస్ సింగర్ శ్రేయా ఘోషల్ భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ్ గురించి చాలా మందికి తెలియదు. ఆయన రూ.వేల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్ యాప్ ‘ట్రూకాలర్’ కంపెనీకి గ్లోబల్ హెడ్‌. ముంబై యూనివర్సిటీలో బీఈ(ఎలక్ట్రానిక్స్) పూర్తి చేసిన ఆయన పలు కంపెనీల్లో పనిచేసి 2022 నుంచి ట్రూకాలర్‌లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నారు. కాగా, 12సార్లు నేషనల్ అవార్డు పొందిన శ్రేయా నికర ఆదాయం రూ.240 కోట్లు అని సినీ వర్గాలు తెలిపాయి.

News December 11, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 298/6 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆల్‌రౌండర్ సదర్లాండ్ (110) సెంచరీతో దుమ్మురేపారు. ఆ జట్టు 78/4తో కష్టాల్లో ఉన్నప్పుడు సదర్లాండ్ క్రీజులో అడుగుపెట్టారు. ఆ తర్వాత భారత బౌలర్లను ఎడా పెడా బాదేస్తూ శతకం పూర్తి చేసుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.

News December 11, 2024

సియారామ్ బాబా.. ఇక లేరు

image

సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సియారామ్ బాబా ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన కడసారి చూపు కోసం మధ్యప్రదేశ్‌లోని భట్యాన్‌లో ఉన్న ఆశ్రమానికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. రామచరిత మానస్ పఠిస్తూ చిన్న లంగోటీతో మాత్రమే జీవించిన బాబా.. భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయిని సమాజానికి ఇచ్చేశారు. నర్మదా నది ఘాట్లను ఆయన ఇచ్చిన రూ.2.57 కోట్లతోనే అధికారులు అభివృద్ధి చేశారు.

News December 11, 2024

ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తీసుకొస్తాం: పవన్ కళ్యాణ్

image

AP: ప్రజలకు అవసరమైన పాలసీలు మాత్రమే తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. అందుకే ఐఏఎస్, ఐపీఎస్‌లు బాధ్యతగా పనిచేయాలి. మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు భారీ విజయం కట్టబెట్టారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News December 11, 2024

బాధ్యతలు స్వీకరించిన RBI కొత్త గవర్నర్

image

IAS అధికారి సంజయ్ మల్హోత్ర RBI 26వ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేళ్ల వరకు ఆయన సేవలందిస్తారు. ‘పీస్‌టైమ్ జనరల్‌’గా పేరున్న ఆయన భారత ఎకానమీని పరుగులు పెట్టించాల్సి ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. జనవరిలో రెపోరేటును తగ్గిస్తారని తెలుస్తోంది. రెవెన్యూ సెక్రటరీగా ఆయనకు మంచి అనుభవం ఉంది. ట్యాక్సేషన్, ఎకానమీ అంశాలపై పట్టుంది.

News December 11, 2024

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుదల.. అగ్రస్థానంలో ఎవరంటే..

image

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. వరస సెంచరీలతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 898 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా జో రూట్(897), కేన్ విలియమ్‌సన్ (812), యశస్వీ జైస్వాల్(811), ట్రావిస్ హెడ్(781) నిలిచారు. ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచుల్లో రాణిస్తే జైస్వాల్ అగ్రస్థానానికి చేరుకునేందుకు ఛాన్స్ ఉంది.

News December 11, 2024

కేజీ గార్బేజ్ తీసుకొస్తే చాలు.. కడుపు నిండా ఫుడ్

image

ఆకలిగా ఉన్నా డబ్బులు లేవని బాధపడుతున్న వారికి అంబికాపూర్‌లోని(ఛత్తీస్‌గఢ్‌) ‘గార్బేజ్ కేఫ్’ కడుపు నిండా ఆహారం పెడుతోంది. ఈ ప్రత్యేకమైన కేఫ్‌లో 1 కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చిన వారికి భోజనాన్ని అందిస్తున్నారు. ఇందులో రోటీలతో పాటు అన్నం, సలాడ్, ఊరగాయలు, పాపడ్ ఉంటాయి. ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను తీసుకురావాలి. అన్నార్థుల ఆకలి తీర్చడం, కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.