India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత మహిళల జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్లన్నీ ఆడి 298/6 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆల్రౌండర్ సదర్లాండ్ (110) సెంచరీతో దుమ్మురేపారు. ఆ జట్టు 78/4తో కష్టాల్లో ఉన్నప్పుడు సదర్లాండ్ క్రీజులో అడుగుపెట్టారు. ఆ తర్వాత భారత బౌలర్లను ఎడా పెడా బాదేస్తూ శతకం పూర్తి చేసుకున్నారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4, దీప్తి శర్మ ఒక వికెట్ పడగొట్టారు.
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సియారామ్ బాబా ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన కడసారి చూపు కోసం మధ్యప్రదేశ్లోని భట్యాన్లో ఉన్న ఆశ్రమానికి భక్తులు పోటెత్తుతున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. రామచరిత మానస్ పఠిస్తూ చిన్న లంగోటీతో మాత్రమే జీవించిన బాబా.. భక్తులు ఇచ్చిన ప్రతి రూపాయిని సమాజానికి ఇచ్చేశారు. నర్మదా నది ఘాట్లను ఆయన ఇచ్చిన రూ.2.57 కోట్లతోనే అధికారులు అభివృద్ధి చేశారు.
AP: ప్రజలకు అవసరమైన పాలసీలు మాత్రమే తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నుంచి చాలా ఆశిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే. అందుకే ఐఏఎస్, ఐపీఎస్లు బాధ్యతగా పనిచేయాలి. మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు భారీ విజయం కట్టబెట్టారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
IAS అధికారి సంజయ్ మల్హోత్ర RBI 26వ గవర్నర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నేటి నుంచి మూడేళ్ల వరకు ఆయన సేవలందిస్తారు. ‘పీస్టైమ్ జనరల్’గా పేరున్న ఆయన భారత ఎకానమీని పరుగులు పెట్టించాల్సి ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. జనవరిలో రెపోరేటును తగ్గిస్తారని తెలుస్తోంది. రెవెన్యూ సెక్రటరీగా ఆయనకు మంచి అనుభవం ఉంది. ట్యాక్సేషన్, ఎకానమీ అంశాలపై పట్టుంది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. వరస సెంచరీలతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ 898 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా జో రూట్(897), కేన్ విలియమ్సన్ (812), యశస్వీ జైస్వాల్(811), ట్రావిస్ హెడ్(781) నిలిచారు. ఆస్ట్రేలియాతో మిగిలిన మూడు మ్యాచుల్లో రాణిస్తే జైస్వాల్ అగ్రస్థానానికి చేరుకునేందుకు ఛాన్స్ ఉంది.
ఆకలిగా ఉన్నా డబ్బులు లేవని బాధపడుతున్న వారికి అంబికాపూర్లోని(ఛత్తీస్గఢ్) ‘గార్బేజ్ కేఫ్’ కడుపు నిండా ఆహారం పెడుతోంది. ఈ ప్రత్యేకమైన కేఫ్లో 1 కేజీ ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చిన వారికి భోజనాన్ని అందిస్తున్నారు. ఇందులో రోటీలతో పాటు అన్నం, సలాడ్, ఊరగాయలు, పాపడ్ ఉంటాయి. ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను తీసుకురావాలి. అన్నార్థుల ఆకలి తీర్చడం, కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
AP: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట నాని ఓ గిడ్డంగి నిర్మించారు. దీనిని పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఈ గోడౌన్ను పోలీసులు తనిఖీలు చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.
AP: రాష్ట్రంలో రేషన్ మాఫియా మళ్లీ వచ్చిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజలకు నాణ్యమైన స్వర్ణరకం బియ్యం ఇవ్వడం లేదు. సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడే బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నారు. కానీ నిందలు మాపై వేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదలై మూడు నెలలు దాటినా జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ వేదికపై అత్యధికంగా వీక్షించిన రెండో దక్షిణాది చిత్రంగా నిలిచింది. వరుసగా 5వారాల పాటు టాప్ 10లో ట్రెండ్ అవుతోందని దేవర మూవీ టీమ్ తెలిపింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్వైడ్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే కోడలికి కీలక పదవి కట్టబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫియాన్సీ కింబర్లీ గిల్ఫోయిల్ను గ్రీస్కు US రాయబారిగా నియమించారు. కింబర్లీ గతంలో ఫాక్స్ న్యూస్ హోస్ట్గా పనిచేశారు. 2020లో ట్రంప్ జూనియర్తో నిశ్చితార్థం జరిగింది. కాగా జూనియర్ ట్రంప్ ఇప్పటికే వానెసాతో పెళ్లై విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.