India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా GOOGLE అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు. 2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా ఉండటం విశేషం.
క్రూరత్వం, గృహహింస నుంచి రక్షణగా స్త్రీల కోసం తెచ్చిన చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భార్య పెట్టిన తప్పుడు కేసులతో పడలేక, చట్టంతో పోరాడలేక నిన్న బెంగళూరు <<14841616>>టెకీ<<>> ప్రాణాలు విడిచిన తీరు కలతపెడుతోంది. చట్టాల్లోని కొన్ని లొసుగులను కొందరు స్త్రీలు ఆస్తి, విడాకుల కోసం వాడుకుంటున్న తీరు విస్మయపరుస్తోంది. ఇలాంటి ట్రెండు ఆందోళన కలిగిస్తోందని సుప్రీంకోర్టూ చెప్పడం గమనార్హం.
AP: దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. సంక్రాంతి నాటికి ఆర్అండ్బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు’ అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.
తమను అమితంగా ప్రేమించడమే మోహన్ బాబు చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ‘ప్రతి ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. మా సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మా ఇంటి గొడవను మీడియా సెన్సేషన్ చేస్తోంది. అలా చేయొద్దని వేడుకుంటున్నా. మా నాన్న ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టును కొట్టలేదు. ఆ జర్నలిస్టు కుటుంబంతో మేం టచ్లో ఉన్నాం. వారికి చెప్పాల్సింది చెప్పేశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్కు ఎలాన్ మస్క్ గట్టి పంచ్ ఇచ్చారు. ‘ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా టెస్లా ఎదిగితే, షార్ట్ పొజిషన్ తీసుకుంటే బిల్గేట్స్ సైతం దివాలా తీయాల్సిందే’ అని అన్నారు. కొవిడ్ టైమ్లో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు టెస్లా షేర్లను గేట్స్ షార్ట్ చేశారు. ఈ పొజిషన్ ఆయనకు రూ.12500 కోట్ల నష్టం తెచ్చిపెట్టినట్టు సమాచారం. మళ్లీ ఈ విషయం వైరలవ్వడంతో మస్క్ పైవిధంగా స్పందించారు.
AP: రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడుకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) 30 మంది సైనికులను కాపాడి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్ఓసీ వెంట 30 మంది జవాన్లతో కలిసి సుబ్బయ్య పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాండ్ మైన్పై కాలు పెట్టారు. ఇది గమనించి తన తోటి సైనికులను గో బ్యాక్ అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మోహన్ బాబు నిన్న రాత్రి అస్వస్థతతో తమ ఆసుపత్రిలో చేరారని కాంటినెంటల్ వైద్యులు తెలిపారు. ‘ఆయన వచ్చిన సమయంలో హైబీపీ ఉంది. వివిధ పరీక్షలు చేశాం. ఎడమవైపు కంటి కింద వాపు ఉంది. ఇంటర్నల్ గాయాలయ్యాయి. సిటీ స్కాన్ తీయాల్సి ఉంది. చికిత్సకు అవసరమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆయన మరో రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సిన అవసరం ఉంది’ అని డాక్టర్లు వెల్లడించారు.
TG: ‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు. అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం’ అని పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా రూ.వెయ్యి కోట్ల క్లబ్లో చేరినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అత్యంత వేగంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించినట్లు వెల్లడించాయి. ఈనెల 5న ఈ చిత్రం విడుదలవగా కేవలం ఆరు రోజుల్లోనే ఈ రికార్డు నెలకొల్పింది. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2’లో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు.
భారత వ్యతిరేకి జార్జ్ సొరోస్తో నెహ్రూ-గాంధీ కుటుంబ బంధం ఇప్పటిది కాదని BJP తెలిపింది. ఆయనలాగే హంగేరియనైన ఫోరీ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ కజిన్ BK నెహ్రూను పెళ్లాడారని పేర్కొంది. రాహుల్కు ఆమె ఆంటీ అవుతారంది. USలో BK నెహ్రూ దౌత్యవేత్తగా ఉన్నప్పటి నుంచి ఫోరీతో సొరోస్కు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ భారత వ్యూహాత్మక ప్రయోజనాలపై గాంధీ-నెహ్రూ కుటుంబం రాజీపడటంపై సందేహాలు లేవనెత్తుతున్నాయంది.
Sorry, no posts matched your criteria.