news

News December 10, 2024

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?: బొత్స

image

AP: రైతులకు రైతు భరోసా పథకం కింద రూ.20 వేలు ఎప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రైతులను దళారులు దోచుకు తింటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News December 10, 2024

పాక్‌లో తొలి హిందూ పోలీస్‌గా రాజేందర్

image

పాకిస్థాన్‌లో తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్ మేఘ్వార్ నిలిచారు. సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్‌కు చెందిన రాజేందర్ అక్కడి CSS(సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్)ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ట్రైనింగ్ అనంతరం ఆయన ఫైసలాబాద్‌లో ASPగా బాధ్యతలు చేపట్టారు. రాజేందర్‌తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే యువతి CSS ఎగ్జామ్ క్లియర్ చేశారు. పాక్‌లోని మైనార్టీల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

News December 10, 2024

నార్త్‌లో దుమ్మురేపుతున్న ‘పుష్ప-2’

image

‘పుష్ప-2’ హిందీ కలెక్షన్స్ రూ.400కోట్లకు చేరువలో ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన 5 రోజుల్లోనే రూ.339 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.48 కోట్లు రాబట్టగా, అంతకుముందు తొలి 4 రోజుల్లో వరుసగా రూ.72 కోట్లు, రూ.59 కోట్లు, రూ.74కోట్లు, రూ.86 కోట్లు సాధించింది. నార్త్ అమెరికాలో $10M+ వసూళ్లతో దూసుకుపోతోంది.

News December 10, 2024

నాకు ప్రాణహాని ఉంది: మోహన్ బాబు

image

తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణ హాని ఉందని నటుడు మోహన్ బాబు పోలీసులకు తెలిపారు. HYDలోని నివాసంలో పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. మనోజ్‌పై దాడి గురించి ప్రశ్నిస్తున్నారు. ఆదివారం జరిగిన దాడి ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మోహన్ బాబును పోలీసులు కోరారు.

News December 10, 2024

ఎవరైనా చనిపోతే వేళ్లు నరికేసుకునేవారు!

image

పసిఫిక్ ద్వీప దేశమైన పాపువా న్యూగినియా ప్రజలు గతంలో ఓ విచిత్రమైన ఆచారాన్ని పాటించారు. అక్కడి కొన్ని జాతుల వారు కుటుంబసభ్యులెవరైనా చనిపోతే సంతాపంగా తమ వేళ్లను నరికేసుకునేవారు. ఇది తీవ్ర దుఃఖాన్ని, నష్టాన్ని వ్యక్తీకరిస్తుందని వారి భావన. సంప్రదాయ పరికరాలతోనే వేలి పైభాగాన్ని కట్ చేసి, సహజ పద్ధతులతో గాయాలకు చికిత్స చేసేవారు. కాలక్రమేణా ఆధునికీకరణ, చట్టపరమైన పరిమితుల కారణంగా ఈ ఆచారం కనుమరుగైపోయింది.

News December 10, 2024

ప్రవర్తన బాగాలేదు: ప్రతిపక్షాలకు LS స్పీకర్ వార్నింగ్

image

పార్లమెంటు నడుస్తున్న తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అసహనం చెందారు. చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కొందరి ప్రవర్తన నిరాశపరుస్తోందని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇది ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చాలి. మనమంతా సభా మర్యాదను పాటించాలి. కానీ కొన్ని రోజులుగా అంత మంచివి కాని ఘటనలు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News December 10, 2024

హ్యారీ బ్రూక్ సెన్సేషనల్ రికార్డ్

image

ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ అరుదైన ఘనత సాధించారు. 2022 నుంచి ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ఈ రెండేళ్లలో ఆయన 9 శతకాలు సాధించారు. అగ్రస్థానంలో శుభ్‌మన్ గిల్ (12), రెండో స్థానంలో విరాట్ కోహ్లీ (11) ఉన్నారు. నాలుగో స్థానంలో విలియమ్సన్ (8), ట్రావిస్ హెడ్ (8) కొనసాగుతున్నారు. కాగా ఇటీవల NZతో జరిగిన రెండో టెస్టులో బ్రూక్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.

News December 10, 2024

రాజధాని పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

AP: గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి పనుల పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం పలికింది. రాజధానిలో అసంపూర్తిగా ఉన్న మొత్తం 20 పనులకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.11,467 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం పిలవనుంది. ఈ మేరకు జీవో 968ను ప్రభుత్వం జారీ చేసింది.

News December 10, 2024

రాజ్యసభ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన ఇండియా కూటమి

image

రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్ష ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. దీనిపై 71 మంది ఎంపీలు సంతకాలు చేసినట్టు తెలిసింది. అదానీ అంశంపై కాంగ్రెస్‌తో దూరం పాటిస్తున్న తృణమూల్, సమాజ్‌వాదీ ఎంపీలూ సంతకాలు చేశారని సమాచారం. ప్రతిపక్ష సభ్యుల పట్ల ఆయన వ్యవహార శైలి బాగాలేదన్నది ప్రధాన ఆరోపణ. సభను తటస్థ వైఖరితో నిర్వహించడం లేదని, అధికార పక్షానికే అనుకూలంగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

News December 10, 2024

రెండు పార్టులుగా SSMB29.. రూ.వెయ్యి కోట్ల బడ్జెట్!

image

సూపర్ స్టార్ మహేశ్‌బాబు- రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న SSMB29 రెండు పార్టులుగా ఉంటుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే నెలలోనే సినిమా ప్రారంభమవుతుందని PINKVILLA పేర్కొంది. అయితే, మహేశ్ పాత్ర హిందూ పురాణాలు, హనుమంతుడి నుంచి ప్రేరణ పొందిన క్యారెక్టర్‌గా ఉండొచ్చని తెలిపింది. ఈ చిత్రాన్ని రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం.