news

News February 6, 2025

డిన్నర్ కోసమే భేటీ అయ్యాం: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

image

TG: తాము డిన్నర్ కోసమే రహస్యంగా భేటీ అయ్యామని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌కు స్పష్టం చేశారు. దీంతో అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ పెద్దలకు తెలపాలని సీఎం వారికి సూచించారు. మరోవైపు ఎమ్మెల్సీ <<15361441>>తీన్మార్ మల్లన్నపై చర్యలు<<>> తీసుకోవాలని నేతలు సీఎంను కోరారు. కాగా ఈ సమావేశానికి మల్లన్న గైర్హాజరు కావడం గమనార్హం.

News February 6, 2025

ప్రైవేటు కంపెనీలకూ ఆధార్ అథెంటికేషన్ సేవలు

image

కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రైవేటు సంస్థలకూ విస్తరించింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం డిజిటల్ KYCని ఉపయోగించుకొనేందుకు అనుమతించింది. 2025, JAN 31 నుంచే ప్రభుత్వేతర సంస్థలు ఈ సేవలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇది BFSI సెక్టార్లో ఓ గేమ్‌ఛేంజర్ అని UIDAI DyDG మనీశ్ భరద్వాజ్ తెలిపారు. 2010 నుంచి తాము 14000 కోట్ల అథెంటికేషన్ లావాదేవీలను ప్రాసెస్ చేసినట్టు తెలిపారు.

News February 6, 2025

చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా

image

రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారత స్పిన్నర్‌గా (కపిల్ దేవ్ తర్వాత రెండో క్రికెటర్) నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆయన ఈ ఘనత సాధించారు. మరోవైపు ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఫీట్ సాధించారు. ఇప్పటివరకు ఆయన 41 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో జేమ్స్ అండర్సన్(40)ను ఆయన అధిగమించారు.

News February 6, 2025

రాహుల్, ఖర్గేలతో భారీ సభలు: TPCC చీఫ్

image

TG: ఈ నెలాఖరులోగా రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సూర్యాపేటలో కులగణనపై రాహుల్ గాంధీతో, ఎస్సీ వర్గీకరణపై మెదక్‌లో ఖర్గేతో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించాం. సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని, కులగణనపై దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నేతలకు సూచించాం’ అని పేర్కొన్నారు.

News February 6, 2025

మంత్రులకు CM చంద్రబాబు ర్యాంకులు.. పవన్ కళ్యాణ్‌కు ఎంతంటే?

image

గతేడాది DEC వరకు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం ర్యాంకులు కేటాయించారు. చంద్రబాబు 6, లోకేశ్ 8, పవన్ 10వ స్థానంలో ఉన్నారు.
ర్యాంకులు: ఫరూక్, దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్, నాదెండ్ల, DBV స్వామి, సత్యకుమార్, జనార్దన్ రెడ్డి, పవన్, సవిత, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి, నారాయణ, భరత్, ఆనం, అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సంధ్యారాణి, అనిత, సత్యప్రసాద్, నిమ్మల, పార్థసారథి, పయ్యావుల, వాసంశెట్టి

News February 6, 2025

జొమాటో పేరు మారింది..

image

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పేరు మార్చుకుంది. ఇక నుంచి ‘జొమాటో లిమిటెడ్’కు బదులు ‘Eternal Limited’ పేరు కొనసాగుతుందని ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని, షేర్ హోల్డర్లు ఈ పేరును ఆమోదించాల్సి ఉందని పేర్కొంది.

News February 6, 2025

INDvsENG మ్యాచులో ‘పుష్ప’

image

నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియం వేదికగా జరుగుతోన్న INDvsENG తొలి వన్డే మ్యాచ్‌కు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇందులో ఓ వ్యక్తి ‘పుష్ప-2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ గంగమ్మ జాతర సాంగ్‌లో వేసిన గెటప్‌తో దర్శనమిచ్చాడు. పుష్ప ఫీవర్ నాగ్‌పూర్‌ను తాకిందంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. అయితే, అతనికి ఈ గెటప్ సూట్ కాలేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అతడెలా ఉన్నాడో కామెంట్ చేయండి.

News February 6, 2025

మా అభ్యర్థులకు బీజేపీ రూ.15 కోట్లు ఆఫర్ చేసింది: ఆప్ నేత

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏడుగురు ఆప్ అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేసిందని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. పోలింగ్ ముగియగానే బీజేపీ నుంచి సదరు అభ్యర్థులకు కాల్స్ వచ్చాయని, ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఆఫర్ చేశారని పేర్కొన్నారు. కానీ ఆప్ అభ్యర్థులు ఆ ఆఫర్‌ను తిరస్కరించారని చెప్పారు. ఓడిపోతామని తెలిసే బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని సింగ్ మండిపడ్డారు.

News February 6, 2025

మోసాల గురించి జగనే చెప్పాలి: మంత్రి అనగాని

image

AP: మోసాల గురించి జగన్ చెబుతుంటే ప్రజలు ఫక్కున నవ్వుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని విమర్శించారు. అధికారంలో ఉండగా MLAలను కలవని జగన్, ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానంటే నమ్మే పరిస్థితులు లేవని ట్వీట్ చేశారు. మరోవైపు జగన్ అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కి బటర్ మిల్క్ మాత్రమే ఇచ్చారని BJP MLA ఆదినారాయణరెడ్డి విమర్శించారు.

News February 6, 2025

జైభీమ్ అనడం కాదు అంబేడ్కర్‌ను అవమానించిందే కాంగ్రెస్: మోదీ

image

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదని PM మోదీ అన్నారు. ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు అనేక కుట్రలు పన్నారని ఆరోపించారు. అందుకు ఏం చేయకూడదో అన్నీ చేశారని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వకుండా అవమానించారని అన్నారు. ఇప్పుడు బలవంతంగా జైభీమ్ అంటున్నారని, బాబా సాహెబ్ ఐడియాలజీని మాత్రం ఎప్పుడూ పాటించలేదని పేర్కొన్నారు. చరిత్రలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ తప్పులే కనిపిస్తాయన్నారు.