India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెస్టు క్రికెట్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అరంగేట్ర మ్యాచులోనే కెప్టెన్సీ చేసిన ప్లేయర్గా జింబాబ్వేకు చెందిన జోనథన్ క్యాంప్బెల్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు మరే ప్లేయర్ తన తొలి మ్యాచులోనే జట్టుకు నాయకత్వం వహించలేదు. ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచులో రెగ్యులర్ కెప్టెన్ క్రెగ్ ఇర్విన్ వ్యక్తిగత కారణాలతో అనూహ్యంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. దీంతో క్యాంప్బెల్ జట్టు పగ్గాలు అందుకున్నారు.

అవినీతి, కుటుంబమే కాంగ్రెస్ ప్రభుత్వ మోడల్ అని PM మోదీ విమర్శించారు. మైనారిటీలను బుజ్జగించడమే వారికి తెలుసన్నారు. ప్రస్తుతం వారు సమాజంలో విభజన, ఆందోళన, కుల విషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. కొందర్ని బుజ్జగించేందుకే కాంగ్రెస్ OBC ప్యానెల్ను అడ్డుకుందన్నారు. తమది ప్రత్యామ్నాయ ప్రభుత్వ మోడలని, తాము అందరి వికాసాన్ని కోరుకుంటామని తెలిపారు. ప్రజలు తమను మూడోసారి ఎన్నుకున్నారని గుర్తుచేశారు.

పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తమలో స్ఫూర్తి నింపిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వారికి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎందుకు అర్థమవ్వడం లేదో తెలియదన్నారు. వాళ్ల నుంచి సబ్కా వికాస్ ఆశించడం కష్టమేనన్నారు. వారికి కుటుంబమే ప్రధానమని, వారికి తెలిసిందల్లా బుజ్జగింపు రాజకీయాలని ఎద్దేవా చేశారు.

ఆన్లైన్ షాపింగ్ సైట్ ‘ఫ్లిప్కార్ట్’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. కంపెనీ తాజాగా ‘ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ’ పేరుతో రూ.9 వసూలు చేయడంపై వినియోగదారులు ఫైరవుతున్నారు. ఈ యాప్లో ఇప్పటికే ప్లాట్ ఫామ్ ఫీ, హ్యాండ్లింగ్ ఫీ, సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీ వసూలు చేస్తుండగా తాజాగా ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ తీసుకొచ్చారని చెబుతున్నారు. కొన్నిరోజులైతే యాప్ ఓపెన్ చేసినందుకు కూడా ఫీజు అడుగుతారేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు.

TG: పార్టీ విధానాలను సొంత పార్టీ నేతలే తప్పుపడుతుండటంపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) మీటింగ్లో నేతలు చర్చలు జరిపారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని, ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు సమాచారం.

AP: పీఎం కిసాన్ పేరిట కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.14 వేలు కలిపి ‘అన్నదాత సుఖీభవ’ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందాల్సిన పథకాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

అత్యాచారాలకు పాల్పడే వారికి జీవించే అర్హత లేదని BJP నేత, నటి కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు <<15375607>>అఘాయిత్యానికి<<>> పాల్పడటంపై ఆమె ఆగ్రహించారు. ‘ఇళ్లలో, వీధుల్లో, విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఎక్కడా పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పిల్లలు, మహిళలపై ఇలాంటివి జరగకుండా ఆపాలి. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించి సమాజానికి ఓ హెచ్చరిక ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.

దేశీయ స్టాక్మార్కెట్లు నేడు నష్టపోయాయి. నిఫ్టీ 23,603 (-92), సెన్సెక్స్ 78,058 (-213) వద్ద క్లోజయ్యాయి. ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు సూచీలు ఎక్కువ లాభపడ్డాయి. రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, మీడియా, మెటల్, ఎఫ్ఎంసీజీ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, ఐటీసీ హోటల్స్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ గెయినర్స్. ట్రెంట్, బీఈఎల్, ఎయిర్టెల్, టైటాన్, ఓఎన్జీసీ టాప్ లూజర్స్.

TG: రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ కంటే CM రేవంత్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారని బీసీ నేత ఆర్.కృష్ణయ్య విమర్శించారు. BCలకు చట్టప్రకారం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో జరిగిన కులగణనలో చాలా బీసీ కుటుంబాలు పాల్గొనలేదు. లేదంటే బీసీల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండేది. కులగణనపై చట్టం చేస్తే మేం సుప్రీంకోర్టులో పోరాడుతాం. రాజకీయాలు చేయడం మాకూ వచ్చు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు వీల్లేదని మంత్రివర్గ సమావేశంలో తేల్చి చెప్పారు. అవకాశం ఉంటే తగ్గించాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వేగంగా అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. నూతన విద్యాసంవత్సరం మొదలయ్యేలోపే డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.