News February 6, 2025
విద్యార్థినిపై అత్యాచారం.. నటి తీవ్ర ఆవేదన

అత్యాచారాలకు పాల్పడే వారికి జీవించే అర్హత లేదని BJP నేత, నటి కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు <<15375607>>అఘాయిత్యానికి<<>> పాల్పడటంపై ఆమె ఆగ్రహించారు. ‘ఇళ్లలో, వీధుల్లో, విద్యా సంస్థల్లో, హాస్టళ్లలో ఎక్కడా పిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. పిల్లలు, మహిళలపై ఇలాంటివి జరగకుండా ఆపాలి. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించి సమాజానికి ఓ హెచ్చరిక ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 8, 2026
రూ.100 కోట్లతో BJPని ఓడించాలనుకుంటున్నారు: బండి

TG: MIMతో BRS, కాంగ్రెస్ లాలూచీ పడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘కరీంనగర్ రావడానికి రేవంత్ భయపడి ఒవైసీని పంపారు. ఇక్కడ ఎన్నికలు ఇండియా-పాక్ మ్యాచ్లా ఉంటాయి. MIM, కాంగ్రెస్ రహస్య మీటింగ్ పెట్టుకున్నాయి. రూ.100కోట్లు ఖర్చు పెట్టి BJPని ఓడించాలనుకుంటున్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే. ఇక్కడ MIM గెలిస్తే ప్రజలను ఎవరూ కాపాడలేరు’ అని కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.
News February 8, 2026
గోవా వెళ్తున్నారా? ఈ పని చేస్తే 24 గంటలు జైలులో ఉండాల్సిందే

గోవాలో ఇష్టానుసారం ఫొటోలు, వీడియోలు తీస్తే 24 గంటలు జైలులో గడపాల్సిందే. పర్మిషన్ లేకుండా విదేశీయులు/ఇండియన్స్ ఫొటోలు తీసినా, సెల్ఫీలకు వేధించినా జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసుల నిర్ణయంపై SMలో పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. నార్త్ గోవా బాగా బీచ్లో టూరిస్టులను వేధించిన తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.
News February 8, 2026
మరణించినవారి ఫొటోలు ఎక్కడ ఉంచాలంటే?

చనిపోయిన వారి ఫొటోలను పూజా మందిరంలో దేవుడి పటాలతో కలిపి పెట్టకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది వాస్తురీత్యా తప్పని వివరిస్తున్నారు. ‘మరణించిన వారు ఎంతటి వారైనా దేవుళ్లతో సమానం కాదు. వారి ఫొటోలను యమస్థానమైన దక్షిణ వైపు గోడలకు తగిలించడం మంచిది. వారి ఫొటోలు హాలులో కూడా ఉంచకూడదు. లేకపోతే ఇంట్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. శాస్త్రనియమాలను అనుసరించి సరైన దిశలో ఉంచాలి’ అన్నారు. <<-se>>#Vasthu<<>>


