news

News February 6, 2025

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు: కేటీఆర్

image

TG: యూజీసీ నిబంధనలు మార్చడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఢిల్లీలో కలిశామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మార్పుపై అభ్యంతరం తెలియజేస్తూ ఆయనకు లేఖ ఇచ్చామని వెల్లడించారు. NSC క్లాజ్‌తో రిజర్వ్‌డ్ వర్గాలకు అన్యాయం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని KTR తేల్చి చెప్పారు. ఉపఎన్నికలు జరగాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు.

News February 6, 2025

అజిత్ ‘పట్టుదల’ రివ్యూ

image

కిడ్నాప్ అయిన భార్యను రక్షించేందుకు హీరో చేసే పోరాటమే ‘పట్టుదల’ కథ. అజిత్ నటన అదిరిపోగా, యాక్షన్ సన్నివేశాలు, మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. త్రిష, అర్జున్, రెజీనా తమ పాత్రల మేరకు నటించారు. సినిమాకు అనిరుధ్ బీజీఎం, బలమైన విలనిజం లేకపోవడం, ఊహించే స్టోరీ మైనస్. దర్శకుడు యాక్షన్‌పై పెట్టిన ఫోకస్ కథనంపై పెట్టలేకపోయారు.
WAY2NEWS రివ్యూ 2.25/5

News February 6, 2025

2009 నుంచి అక్రమ వలసదారులు ఎందరు వచ్చారంటే: జైశంకర్

image

అమెరికాతో ఎవరికీ లేని విధంగా మనకు పౌరులను వెనక్కి తీసుకొచ్చే ఒప్పందం ఉందని EAM జైశంకర్ అన్నారు. అక్కడ అక్రమంగా ఉంటున్నవారిని ఇక్కడికి పంపించడం ఇదే తొలిసారి కాదన్నారు. 2009 నుంచి 2025 వరకు వరుసగా 734, 799, 597, 530, 550, 591, 708, 1303, 1024, 1180, 2042, 1889, 805, 862, 670, 1368, 104 మందిని పంపినట్టు వెల్లడించారు. మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొస్తామని రాజ్యసభలో వివరించారు.

News February 6, 2025

బీసీ, ఎస్సీ వర్గీకరణలపై 2 సభలకు సీఎల్పీ నిర్ణయం

image

TG: CLP భేటీలో CM రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. BC కులగణన, SC వర్గీకరణలపై 2 సభలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. SC వర్గీకరణపై నల్గొండలో, BC వర్గీకరణపై ఉత్తర తెలంగాణలో సభలకు ప్లాన్ చేశారు. వీటికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. అటు వీటిపై గ్రామ, మండల, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.

News February 6, 2025

స్టార్ సింగర్ విడాకులు.. భార్యకు $300Mల భరణం?

image

కెనడియన్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్, హేలీ బీబర్ జంట విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018లో వీరికి వివాహమవగా ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బీబర్ అన్‌మెచ్యూర్డ్ బిహేవియర్, డ్రగ్స్ వినియోగంపై ఇరువురికీ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈక్రమంలో తన బిడ్డ జాక్ బ్లూస్ భవిష్యత్తు కోసం ఆమె విడాకులకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. దీని ద్వారా హేలీకి $300 మిలియన్ల భరణం వస్తుందని సమాచారం.

News February 6, 2025

ఇతను నిజమైన మృత్యుంజయుడు!

image

ఏడుసార్లు మరణం నుంచి బయటపడిన ‘వరల్డ్ లక్కీయెస్ట్ పర్సన్’ ఫ్రాన్ సెలాక్ జీవితం థ్రిల్లర్ మూవీ కంటే ఇంట్రెస్టిం‌గ్‌గా ఉంటుంది. తొలుత రైలు నదిలో పడిపోతే ఈయన తప్ప అందరూ చనిపోయారు. ఫ్లైట్‌లో వెళ్తుంటే డోర్స్ ఓపెన్ అవడంతో సెలాక్ గడ్డివాముపై పడి బతికారు. పలు మార్లు భారీ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. కానీ, అతను చనిపోలేదు. 2003లో రూ.7 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. 2016లో 87 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో చనిపోయారు.

News February 6, 2025

మళ్లీ మొరాయించిన చాట్ జీపీటీ

image

ఏఐ చాట్ బోట్ జీపీటీ మరోసారి మొరాయించింది. తమకు ఆ యాప్ యాక్సెస్ కావడం లేదంటూ సోషల్ మీడియాలో యూజర్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా చాట్ జీపీటీ ఇదే తరహాలో ఆగిపోవడం గమనార్హం. సమస్యపై సంస్థ స్పందించింది. ఏఐ మోడల్‌లో స్వల్ప ఇబ్బందులు తలెత్తడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, చక్కదిద్దేందుకు ట్రై చేస్తున్నామని వివరణ ఇచ్చింది.

News February 6, 2025

జమిలి ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

AP: రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని YS జగన్ దుయ్యబట్టారు. ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పా. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News February 6, 2025

2027లో చంద్రయాన్-4 లాంచ్

image

చంద్రుడిపై రాతి నమూనాలను తీసుకొచ్చే చంద్రయాన్-4ను భారత్ 2027లో లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మిషన్లో LVM-3 రాకెట్‌ను 2సార్లు అంతరిక్షంలోకి పంపిస్తారని తెలిపారు. అవి తీసుకెళ్లే వేర్వేరు పరికరాలను చంద్రుడి కక్ష్యలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. ఆస్ట్రోనాట్‌ను రోదసిలోకి పంపే గగన్‌యాన్, సముద్ర గర్భంలో 6000KM లోతుకు వెళ్లే సముద్రయాన్‌ను 2026లో లాంచ్ చేస్తామన్నారు.

News February 6, 2025

విజయసాయి రెడ్డి రాజీనామాపై తొలిసారి స్పందించిన జగన్

image

AP: విజయ‌సాయి రెడ్డి రాజీనామాపై YS జగన్ తొలిసారి స్పందించారు. ‘మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా YCPకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్‌ను బట్టే ఉంటుంది. YCP కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది’ అని స్పష్టం చేశారు.