India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఫార్మా కంపెనీలో <<13909576>>ప్రమాదస్థలిలో<<>> పరిస్థితిని కలెక్టర్, ఎస్పీ సమీక్షిస్తున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు. మృతుల వివరాలు తెలిపేందుకు సమయం పడుతుందని పేర్కొన్నారు. పేలుడు ధాటికి భారీగా పొగ రావడంతో సహాయకచర్యలకు ఆటంకం కలిగినట్లు తెలిపారు. YCP పాలనలో థర్డ్ పార్టీ ఏజెన్సీలను పరిశ్రమల్లోకి రప్పించారని విమర్శించారు. వారు భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
AP: అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ <<13908795>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రియాక్టర్ పేలిన భవన శిథిలాల కింద పలు మృతదేహాలున్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు. శిథిలాలు తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 12 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్కు వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. 2017లో ఎయిర్టెల్ కంపెనీ సరైన ధ్రువ పత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే డూప్లికేట్ సిమ్ను జారీ చేసింది. దీంతో ఆర్మీ జవాన్ తన SBI అకౌంట్ నుంచి రూ.2.87 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించి, ఏడేళ్లుగా పోరాడి విజయం సాధించారు. బాధితుడికి 4% వడ్డీతో ₹2.87లక్షలు, రూ.1.15లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
TG: ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కలెక్షన్ల కోసమేనని కేంద్ర సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేవలం గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లనే అధికారులు కూల్చేస్తున్నారని, భారీ భవనాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల కోసం డబ్బులు పంపాలని సీఎం రేవంత్రెడ్డికి హైకమాండ్ టార్గెట్ విధించిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కారణాలతోనే హైడ్రా ఆవిర్భవించిందన్నారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా ఈరోజు అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 27న రిలీజైన ఈ సినిమా 50రోజులు సక్సెస్ఫుల్గా థియేటర్లలో ప్రదర్శితమవగా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. OTTలోనూ రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో, నెట్ఫ్లిక్స్లో హిందీలో స్ట్రీమింగ్ కానుంది.
విరాట్ కోహ్లీ అస్సలు మారలేదని మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా అన్నారు. అండర్-19 క్రికెట్ నుంచీ తామిద్దరం మిత్రులమని చెప్పారు. ‘విరాట్ 10-15 ఏళ్ల క్రితంలాగే ఉన్నారు. మా స్నేహం ఎప్పటిలాగే బాగుంది. ఆసియా కప్ సమయంలో నేను కామెంటరీ చేస్తున్నప్పుడు అతడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నారు. మధ్యలో నా వద్దకొచ్చి పీసీ, తినడానికి ఏమైనా ఆర్డర్ ఇద్దాం అనేశారు. అప్పట్లో మేమిలాగే ఉండేవాళ్లం’ అని పేర్కొన్నారు.
TG: ఐదేళ్లుగా రూ.లక్ష రుణమాఫీ చేయలేని BRS నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఒకేసారి రూ.2లక్షల రుణం మాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు. దీనిపై చాలామంది అవగాహన లేకుండా విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
TG: ఇంట్లో ఉన్న పాత ఫోన్లను ప్లాస్టిక్ వస్తువులు, డబ్బులకు సైబర్ నేరస్థులు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేస్తున్న కొందరిని గోదావరిఖనిలో పోలీసులు అరెస్ట్ చేసి, విచారించారు. వారు బిహార్కు చెందినవారని, పాత మొబైల్స్ కొని సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద 4వేల పాత ఫోన్లు లభ్యమయ్యాయి. వీటిని రిపేర్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.
ప్రధాని మోదీ పోలాండ్ చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. మోదీ రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు నిండటంతో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధాని పోలాండ్లో పర్యటించడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి. మోదీ ఎల్లుండి అక్కడి నుంచి రైలులో ఉక్రెయిన్ వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 23న పోలాండ్ నుంచి <<13902900>>ఉక్రెయిన్కు<<>> ‘రైల్ ఫోర్స్ వన్’లో ప్రయాణించనున్నారు. ఈ విలాసవంతమైన రైలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది అత్యున్నత స్థాయి ప్రయాణాన్ని అందిస్తుంది. అత్యంత భద్రతతో కూడిన ఈ రైలులో పెద్ద టేబుల్స్, సోఫా, టీవీ, విశ్రాంతి కోసం పడక గది ఉంది. మొత్తం 20 గంటల ప్రయాణంలో యుద్ధంలో దెబ్బతిన్న ప్రాంతాల గుండా 10 గంటలు ప్రయాణించి కీవ్ నగరానికి చేరుకుంటారు.
Sorry, no posts matched your criteria.