news

News February 4, 2025

త్వరలో GSTలో సమూల మార్పులు!

image

సింప్లిఫై చేసిన Income Tax బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే GST విధానాన్నీ సవరిస్తుందని సమాచారం. ఆర్థిక, వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. శ్లాబులను తగ్గించొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం GSTలో 5, 12, 18, 28 శ్లాబులు ఉన్నాయి. విలువైన లోహాలు, సిన్ గూడ్స్‌పై ప్రత్యేక రేట్లతో పాటు సుంకాలు అమలవుతున్నాయి. 5%లో 21%, 12%లో 19%, 18%లో 44%, మిగిలినవి 28% పరిధిలో ఉన్నాయి.

News February 4, 2025

ఒకరు స్లమ్స్‌కు వెళ్లి వీడియోలు తీయించుకుంటారు: మోదీ

image

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో PM నరేంద్రమోదీ విపక్ష నేతలపై సెటైర్లు విసిరారు. కొందరు నేతలు సామాన్యులమంటూ అద్దాల మేడలు, భవంతులు కట్టించుకున్నారని అరవింద్ కేజ్రీవాల్‌ను విమర్శించారు. మరొకరేమో మురికి వాడలకు వెళ్లి వీడియోలు తీయించుకుంటారని రాహుల్‌పై వాక్బాణం ఎక్కుపెట్టారు. తాము మాత్రం పేదలకు 12 కోట్ల టాయిలెట్లు కట్టించామని, మహిళల గౌరవాన్ని నిలబెట్టామన్నారు. స్వచ్ఛమైన నీరు అందించామన్నారు.

News February 4, 2025

14వ ఏడాదీ అవకాశమిచ్చినందుకు థాంక్స్: మోదీ

image

పార్లమెంటులో వరుసగా 14వ ఏడాదీ ప్రసంగించే అవకాశం కల్పించిన దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలియజేశారు. తనను నాయకుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం వికసిత భారత్‌‌కు బాటలు వేసిందన్నారు. తమ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గరీబీ హఠావో ప్రయోగం విఫలమైందని కాంగ్రెస్‌ను విమర్శించారు. తాము పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని వెల్లడించారు.

News February 4, 2025

OTTలో ఆకట్టుకుంటోన్న కొత్త సినిమా

image

మలయాళంలో తెరకెక్కిన ‘ఐడెంటిటీ’ సినిమా తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చిన్న పాయింట్‌ను బేస్ చేసుకుని తీసిన ఈ మూవీలో థ్రిల్లర్‌కు ఉండాల్సిన అన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటున్నారు. ఒకే సినిమాలో మూడు స్టోరీలను చూపించారని ప్రశంసిస్తున్నారు. ZEE5లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో టొవినో థామస్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. మరి మీరు ఈ చిత్రం చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 4, 2025

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును సవాల్ చేస్తూ పిల్

image

AP: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాదులు తాండవ యోగేశ్, తురగా సాయి సూర్య ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసి సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ప్రతివాదులుగా చేర్చారు. జస్వంత్ సింగ్ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నారని పిటిషన్‌లో వివరించారు. రేపు ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

News February 4, 2025

అపోలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి వింత అనుభవం

image

ఢిల్లీ సరితా విహార్‌ అపోలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ‘నేను సీనియర్ డాక్టర్ కోసం రూ.2,300 కన్సల్టెన్సీ ఫీజు కట్టాను. కానీ ఆయన అసిస్టెంట్ నాతో మాట్లాడారు. తర్వాత డాక్టర్ వచ్చి అసిస్టెంట్‌తో మాట్లాడారు. ఏం చేయాలో? చేయకూడదో? అతనే sr.డాక్టర్‌కు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో ఇదేం తీరు? కన్సల్టెన్సీ ఫీజు అసిస్టెంట్‌కు కాదు, sr. డాక్టర్‌కు అని ఎవరికి చెప్పాలి’ అని ఆ వ్యక్తి ట్వీట్ చేశారు.

News February 4, 2025

నేషన్ బిల్డర్స్ అయిన ట్యాక్స్ పేయర్స్ అంటే మోదీకి గౌరవం: నిర్మల

image

దేశ నిర్మాతలైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలన్న ప్రధాని నరేంద్రమోదీ యత్నమే బడ్జెట్లో కల్పించిన రిలీఫ్ అని FM నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండేందుకు నాలుగేళ్లుగా వారితో నిరంతరం టచ్‌లో ఉన్నామని తెలిపారు. వారి అభిప్రాయాలను బట్టే చర్యలు తీసుకున్నామని వివరించారు. పాత పన్ను విధానం రద్దు చేయాలనుకోవడం లేదని, మినహాయింపులు కోరుకొనేవారు ఉపయోగించుకోవచ్చని సూచించారు.

News February 4, 2025

రతన్ టాటా యువ స్నేహితుడికి కీలక పదవి

image

దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా కంపెనీలో కీలక పదవి దక్కింది. స్ట్రాటజీస్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, GMగా నియమితులైనట్లు శంతను LinkedInలో పోస్ట్ చేశారు. తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్‌లో పని చేసేటప్పుడు వైట్ షర్ట్, నేవీ కలర్ ఫ్యాంట్ ధరించేవారని పేర్కొన్నారు. ఆయన కోసం తాను కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేవాడినని చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

News February 4, 2025

కుంభమేళా తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదు: హేమామాలిని

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదని BJP MP హేమామాలిని అన్నారు. కానీ కొందరు దీనిని పెద్దదిగా చూస్తున్నారని మండిపడ్డారు. ‘మేమూ కుంభమేళాకు వెళ్లి సంగం ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించాం. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరం. ఈ ఒక్క ఘటన తప్ప కుంభమేళా అద్భుతంగా కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కాగా UP సర్కార్ కుంభమేళా మృతుల సంఖ్యను దాచిపెడుతోందని మాజీ CM అఖిలేశ్ ఆరోపించారు.

News February 4, 2025

పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం

image

AP: YCP అధినేత YS జగన్ ఆ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావాలా? వద్దా? అని అంశమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. భేటీ అనంతరం YCP భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.