India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాదులు తాండవ యోగేశ్, తురగా సాయి సూర్య ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసి సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ప్రతివాదులుగా చేర్చారు. జస్వంత్ సింగ్ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నారని పిటిషన్లో వివరించారు. రేపు ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఢిల్లీ సరితా విహార్ అపోలో ఆస్పత్రిలో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ‘నేను సీనియర్ డాక్టర్ కోసం రూ.2,300 కన్సల్టెన్సీ ఫీజు కట్టాను. కానీ ఆయన అసిస్టెంట్ నాతో మాట్లాడారు. తర్వాత డాక్టర్ వచ్చి అసిస్టెంట్తో మాట్లాడారు. ఏం చేయాలో? చేయకూడదో? అతనే sr.డాక్టర్కు చెప్పారు. అపోలో ఆస్పత్రిలో ఇదేం తీరు? కన్సల్టెన్సీ ఫీజు అసిస్టెంట్కు కాదు, sr. డాక్టర్కు అని ఎవరికి చెప్పాలి’ అని ఆ వ్యక్తి ట్వీట్ చేశారు.

దేశ నిర్మాతలైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలన్న ప్రధాని నరేంద్రమోదీ యత్నమే బడ్జెట్లో కల్పించిన రిలీఫ్ అని FM నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం చెక్కుచెదరకుండా ఉండేందుకు నాలుగేళ్లుగా వారితో నిరంతరం టచ్లో ఉన్నామని తెలిపారు. వారి అభిప్రాయాలను బట్టే చర్యలు తీసుకున్నామని వివరించారు. పాత పన్ను విధానం రద్దు చేయాలనుకోవడం లేదని, మినహాయింపులు కోరుకొనేవారు ఉపయోగించుకోవచ్చని సూచించారు.

దివంగత వ్యాపారవేత్త రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా కంపెనీలో కీలక పదవి దక్కింది. స్ట్రాటజీస్ ఇనిషియేటివ్స్ విభాగానికి హెడ్, GMగా నియమితులైనట్లు శంతను LinkedInలో పోస్ట్ చేశారు. తన తండ్రి టాటా మోటార్స్ ప్లాంట్లో పని చేసేటప్పుడు వైట్ షర్ట్, నేవీ కలర్ ఫ్యాంట్ ధరించేవారని పేర్కొన్నారు. ఆయన కోసం తాను కిటికీ దగ్గర కూర్చొని ఎదురు చూసేవాడినని చిన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట అంత పెద్దదేమీ కాదని BJP MP హేమామాలిని అన్నారు. కానీ కొందరు దీనిని పెద్దదిగా చూస్తున్నారని మండిపడ్డారు. ‘మేమూ కుంభమేళాకు వెళ్లి సంగం ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించాం. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరం. ఈ ఒక్క ఘటన తప్ప కుంభమేళా అద్భుతంగా కొనసాగుతోంది’ అని పేర్కొన్నారు. కాగా UP సర్కార్ కుంభమేళా మృతుల సంఖ్యను దాచిపెడుతోందని మాజీ CM అఖిలేశ్ ఆరోపించారు.

AP: YCP అధినేత YS జగన్ ఆ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరు కావాలా? వద్దా? అని అంశమూ చర్చకు వచ్చినట్లు సమాచారం. భేటీ అనంతరం YCP భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

TG: బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి BRS, BJPలకు సవాల్ విసిరారు. ‘చట్టప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్టప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే మేం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాం. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని BRS, BJPకి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అని ఆ పార్టీ AP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘ఇదో చరిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం. జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు.. అంటే దాదాపు 90% వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం. ఇలాగే APలోనూ లెక్కలు తీయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసం టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని బ్యాకప్గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. నాగ్పూర్లో జరుగుతున్న టీమ్ ఇండియా ప్రాక్టీస్ సెషన్లో వరుణ్ కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దీనిపై త్వరలోనే BCCI నుంచి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో వరుణ్ 14 వికెట్లతో చెలరేగడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని డిమాండ్లు వచ్చాయి.

సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వెస్ కలీస్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఆడిన ఆటగాళ్లలో కలీస్ ఉత్తమ క్రికెటర్ అన్నారు. టెస్ట్ ఫార్మాట్లో 45కుపైగా సెంచరీలు 290కి పైగా వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడన్నారు. కలీస్ రికార్డులన్నీ చూస్తే ఆయన క్రికెట్ కోసమే పుట్టినట్టు అనిపిస్తుందని పాంటింగ్ ఓ పాడ్కాస్ట్లో మాట్లాడారు
Sorry, no posts matched your criteria.