news

News February 4, 2025

అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం

image

AP: రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం జరిగింది. పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు, పీయూసీ ఛైర్మన్‌గా కూన రవికుమార్‌లను నియమిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు.

News February 4, 2025

బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం: తలసాని

image

TG: కులగణన సర్వే ద్వారా BCలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో 30 శాతం మంది ఈ సర్వేలో పాల్గొనలేదని ఆయన అసెంబ్లీలో తెలిపారు. ‘ఈ సర్వే ప్రకారం BC, SC, ST జనాభా తగ్గినట్లు కనిపిస్తోంది. కులగణన సర్వేపై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సర్వే చేసి తీర్మానం చేస్తే సరిపోదు. ఇలాంటివాటికి చట్టబద్ధత కల్పించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News February 4, 2025

Stock Markets పరుగులు: ఇన్వెస్టర్లకు రూ.7లక్షల కోట్ల ప్రాఫిట్

image

బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,739 (+378), సెన్సెక్స్ 78,538 (+1397) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, O&G షేర్లు దుమ్మురేపాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌టీ, బీఈఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంకు, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా, హీరోమోటో, నెస్లే ఇండియా టాప్ లూజర్స్. నేడు ఇన్వెస్టర్లు రూ.7లక్షల కోట్లు ఆర్జించారు.

News February 4, 2025

ఆర్మీ చీఫ్ మాటల్ని RG వక్రీకరించారు: రాజ్‌నాథ్

image

దేశ భద్రతపై రాహుల్‌గాంధీవి బాధ్యతా రాహిత్య రాజకీయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఆర్మీ చీఫ్ చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆయన వక్రీకరించారని విమర్శించారు. గస్తీ అంశంలో వివాదం తలెత్తినట్టు మాత్రమే చెప్పారన్నారు. 1962లో చైనా 38k sqkm ఆక్రమించిందని, 1963లో 5k sqkmను పాక్ ఆక్రమించి చైనాకు ఇచ్చిందన్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

News February 4, 2025

బైకర్ ట్రిపుల్ సెంచరీ.. చలాన్లు చూసి పోలీసులు షాక్

image

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. అయితే, అలా చేయడమే పనిగా పెట్టుకున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. KA 05 JX 1344 రిజిస్ట్రేషన్ నంబర్‌తో వెళ్తోన్న వాహనాన్ని ఆపి చెక్ చేయగా దానిపై 311 చలాన్లతో రూ.1.60లక్షల ఫైన్ గుర్తించారు. అతను హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లాంటివి పదేపదే చేశాడు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.

News February 4, 2025

సెహ్వాగ్, రిచర్డ్స్‌లాంటోడు అభిషేక్: హర్భజన్

image

టెస్టు క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, వీవీ రిచర్డ్స్ స్థానాలను టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ భర్తీ చేయగలరని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఆయన రెడ్ బాల్ ఫార్మాట్‌లోకి ఎంట్రీ ఇస్తారని జోస్యం చెప్పారు. ‘అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్సులు ఆడుతున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో గణాంకాలు బాగా లేకున్నా ఇంగ్లండ్‌పై బాదిన శతకంతో టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు’ అని పేర్కొన్నారు.

News February 4, 2025

అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఇదే!

image

మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు, మోడల్స్ వచ్చినా నోకియా 1100పై ఉన్న రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం 100లో 30శాతం మంది చేతిలో ఐఫోన్స్ కనిపిస్తున్నాయి. కానీ, అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా మాత్రం ఇది కాదు. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల ‘నోకియా 1100’ మొబైల్స్ అమ్ముడవడమే దీనికి కారణం. దీని తర్వాత నోకియా1110 (248M), iPhone 6/6 Plus (222M), నోకియా 105 (200M), iPhone 6S/ 6S Plus(174M) ఉన్నాయి.

News February 4, 2025

కులగణనతో బీసీల కల నెరవేరింది: పొన్నం

image

TG: కులగణన సర్వే నివేదికపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఏళ్లుగా ఉన్న బీసీల కల నెరవేరిందని చెప్పారు. ఈ డేటా సేకరణ దేశానికే ఆదర్శమన్నారు. ప్రతి రాజకీయ పార్టీ దీనిని స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సర్వేతో బలహీన వర్గాలకు న్యాయం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గతంలో ఇలాంటి గణన చేయలేదని, ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు లేవని స్పష్టం చేశారు.

News February 4, 2025

పోలవరం కెపాసిటీ తగ్గించొద్దు: మిథున్ రెడ్డి

image

AP: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ తగ్గించవద్దని కేంద్రాన్ని YCP MP మిథున్ రెడ్డి కోరారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై లోక్‌సభలో ఆయన పాల్గొన్నారు. పోలవరంపై అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రాజెక్టు ఎత్తు 41.15మీటర్లకు తగ్గించడంతో కెపాసిటీ 194 నుంచి 115 TMCలకు పడిపోతుందని వివరించారు. దీని వల్ల 4.2 లక్షల ఎకరాలకు నీరు అందదని, ఈ అన్యాయాన్ని ఏపీ ప్రజలు క్షమించరని ఆయన స్పష్టం చేశారు.

News February 4, 2025

1931 తర్వాత కులగణన ఇదే: సీఎం రేవంత్

image

TG: బ్రిటిష్ హయాంలో 1931లో కులగణన జరిగింది తప్ప స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ప్రతి పదేళ్లకు చేపడుతున్న జనాభా లెక్కల్లో ఎస్సీలు, ఎస్టీల లెక్కలను మాత్రమే తీసుకుంటున్నారని, బలహీన వర్గాల (BC) సమాచారం ఉండట్లేదన్నారు. వారికి విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం ఇవ్వడానికే రాహుల్ గాంధీ సూచనలతో తాము తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం చెప్పారు.