news

News February 4, 2025

ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా రెడీ: మందకృష్ణ

image

TG: ఎమ్మార్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వారసత్వ ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు. గత 30 ఏళ్లలో ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలగలేదని తెలిపారు. మరోవైపు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే అవకాశముంది.

News February 4, 2025

దివ్యాంగులకు ఊరట.. ఆ నిబంధన తొలగింపు

image

రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 2022, ఆగస్టు 10న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను పునఃసమీక్షించాలని, ఆంక్షలను తొలగించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

News February 4, 2025

1,382 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి: హైకోర్టు

image

TG: DSC-2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. 1,382 మందిని ఈ నెల 10లోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2008న ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. తమకంటే తక్కువ అర్హత కలిగినవారికి రిజర్వేషన్ ఇవ్వడంపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

News February 4, 2025

సూర్య కుమార్ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 5.60 యావరేజ్‌తో కేవలం 28 రన్స్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అతని కెరీర్‌‌లో ఒక సిరీస్‌లో ఇదే లోయెస్ట్ యావరేజ్. 2022లో ఐర్లాండ్‌పై 7.50 AVGతో 15 రన్స్, 2024లో సౌతాఫ్రికాపై 8.66 యావరేజ్‌తో 26 పరుగులు చేశారు. సూర్య బ్యాటర్‌గా విఫలమవుతున్నా కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నారు. అతని సారథ్యంలో 23 మ్యాచ్‌లు ఆడగా భారత్ 18 గెలిచింది.

News February 4, 2025

BREAKING: రాష్ట్రంలో MLC కిడ్నాప్?

image

AP: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి, YCP తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ MLC సిపాయి సుబ్రహ్మణ్యాన్ని TDP నేతలు కిడ్నాప్ చేశారని YCP ఆరోపిస్తోంది. అర్ధరాత్రి తర్వాత ఆయనను నివాసం నుంచి తీసుకెళ్లినట్లు చెబుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉన్న ఆయన ఓటు కీలకం కానుంది.

News February 4, 2025

అందుకే అల్లు అర్జున్‌కు రూ.100 కోట్లు: నటుడు ఆకాశ్ దీప్

image

అల్లు అర్జున్‌కు స్టార్ ఇమేజ్ వల్లే పుష్ప సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించారని, రష్మిక వల్ల కాదని బాలీవుడ్ నటుడు ఆకాశ్ దీప్ చెప్పారు. అందుకే ఐకాన్ స్టార్‌కు ₹100Cr రెమ్యునరేషన్ అందగా, నేషనల్ క్రష్‌కు ₹10Cr వచ్చిందన్నారు. సైఫ్‌పై దాడి గురించి స్పందిస్తూ ‘₹21Cr పారితోషికం తీసుకుంటున్నా కరీనా ఇంటి బయట వాచ్‌మెన్‌ను పెట్టుకోలేదు. వాళ్లకు ₹100Cr ఇస్తేనే నియమించుకుంటారేమో’ అని ఎద్దేవా చేశారు.

News February 4, 2025

ఉదయాన్నే నిమ్మరసం తాగితే..

image

✒ నిమ్మరసంలోని అమ్లత్వం నోటిలోని బ్యాక్టీరియాను చంపుతుంది. నోటి దుర్వాసన సమస్య దూరమవుతుంది.
✒ విటమిన్-C వల్ల రోగ నిరోధకవ్యవస్థ బలోపేతమవుతుంది.
✒ జలుబు, ఇన్ఫెక్షన్లు దరి చేరవు.
✒ శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మ నిగారింపు పెరుగుతుంది. ముడతలు తగ్గుతాయి.
✒ బాడీలోని టాక్సిన్స్‌ను బయటకు వెళ్తాయి.
✒ కాలేయం, గుండె, కిడ్నీ సమస్యలు దూరమవుతాయి.
✒ అధిక బరువు నుంచి విముక్తి పొందొచ్చు.

News February 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా బీఆర్ఎస్!

image

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వగా అభ్యర్థుల పేర్లను ఇప్పటికీ ప్రకటించకపోవడం దీనికి ఊతమిస్తోంది. గత ఏడాది ఎంపీ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది.

News February 4, 2025

అంతుచిక్కని వ్యాధి.. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి

image

AP: అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఒక్కో కోడి మరణంతో సగటున రూ.300 వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.

News February 4, 2025

నేడు పీఎం మోదీ ఏం మాట్లాడుతారు?

image

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సా.5 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు బడ్జెట్‌పై మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. ఉద్యోగులకు రూ.12లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అంశాన్ని కూడా పీఎం ప్రస్తావించే ఛాన్సుంది.