India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: <<15348696>>ఈఏసీసెట్కు<<>> సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు లెవనెత్తాలంటే విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. వారి అబ్షక్షన్ సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఫ్రీగానే అబ్షక్షన్ను వ్యక్తపరిచే అవకాశం ఉండేది.

TG: గ్రూప్-1తో సహా గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ఈనెలాఖరులోగా విడుదల చేసేందుకు TGPSC కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా <<15352858>>గ్రూప్-1<<>> జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసి, తర్వాత గ్రూప్-2, గ్రూప్-3 రిజల్ట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల గ్రూప్-1 జాబ్ వచ్చిన వాళ్లు మిగతా రెండింటికి ఎంపికైనా వదులుకుంటారు. దీంతో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదని అధికారులు భావిస్తున్నారు.

AP: ఉదయం 5, 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు వస్తుండటంతో ఆయన స్పందించారు. అనవసర నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని, ఉ.7 నుంచి సా.6 లోపు పంపిణీ పూర్తి చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంటి వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో పెన్షన్ ఇస్తున్నట్లు తేలితే కారణాలు తెలుసుకోవాలన్నారు. లబ్ధిదారులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.

AP: ఇన్నాళ్లూ మహిళలకు పరిమితమైన పొదుపు సంఘాలను మెప్మా పురుషులకూ విస్తరిస్తోంది. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 2,841గ్రూపులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా నెల రోజుల్లోనే 1,028సంఘాలు ఏర్పడ్డాయి. మార్చి 31 నాటికి టార్గెట్ను చేరుకునేలా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీగార్డులకు ఆర్థిక స్వావలంబన కోసం పొదుపు సంఘాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

✒ 18-60 ఏళ్ల వయసు ఉండాలి. ఐదుగురు కలిసి ఓ గ్రూపుగా ఏర్పాటుకావొచ్చు. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
✒ ప్రతినెలా కనీసం రూ.100 నుంచి రూ.1,000 వరకు పొదుపు చేయొచ్చు.
✒ 6 నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం ₹25K ఇస్తుంది. తర్వాత ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోతుంది.
✒ మెప్మా కార్యాలయ సిబ్బందిని కలిస్తే గ్రూపును ఏర్పాటుచేస్తారు.

APలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు టెన్త్ క్లాస్ ప్రీఫైనల్ <<14926648>>పరీక్షలు<<>> నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఉ.9.30-మ.12.45 వరకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లకు ఉ.9.30-11.30 వరకు జరుగుతాయి. TGలో మార్చి 6 నుంచి 15 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మ.12.15-3.15 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పిల్లలకు మ.12.15లోపే భోజనం అందించాలని ఆదేశించారు.

AP: ఖరీఫ్ ధాన్యం సేకరణ గడువును ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. ఇప్పటి వరకు 31.52 లక్షల టన్నులను కొనుగోలు చేసినట్లు తెలిపింది. రైతుల ఖాతాల్లో రూ.7,222 కోట్లు జమ చేశామని వెల్లడించింది. మార్చి తర్వాత కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై పరిశీలన చేస్తామంది. రైతుల పేరుతో వ్యాపారులు ధాన్యాన్ని విక్రయించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని GOVT కార్యాలయాల్లో ఉద్యోగులంతా తప్పనిసరిగా మరాఠీలోనే మాట్లాడాలని ఆదేశాలు జారీ చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరాఠీ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం ప్రజా వ్యవహారాల్లో ఈ భాషను ఉపయోగించాలని ప్రభుత్వ కమిటీ సిఫారసు చేసింది. కంప్యూటర్ కీ బోర్డుల్లోనూ మరాఠీ దేవనాగరి లిపి ఉండాలని పేర్కొంది. ఆ మేరకు GOVT చర్యలు ప్రారంభించింది.

AP: గురుకుల విద్యాలయాలలో 2025-26కుగాను ఎనిమిదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7th, టెన్త్ ఉత్తీర్ణులైన వారు మార్చి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉండాలి. మార్చి 4న హాల్టికెట్లు విడుదలవుతాయి. 9న పరీక్ష ఉంటుంది. 25న మెరిట్ జాబితా ప్రకటిస్తారు. ఏప్రిల్ 11, 21 తేదీల్లో రెండు దశల కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం <

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ ఉ.10 గంటలకు సమావేశం కానుంది. కుల గణన సర్వే నివేదికకు ఆమోదం తెలపనుంది. ఉ.11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై సర్వేపై చర్చించనుంది. కులగణన తప్పుల తడక అంటూ బీసీ సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో సభ వాడీవేడిగా జరిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.