India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రస్తుతం నేలపై కూర్చుని తినేవారు తక్కువమందే ఉంటారు. కింద కూర్చుని తినడం వల్ల చాలా లాభాలున్నాయని నిపుణులు అంటున్నారు. కూర్చుని తినడం వల్ల కండరాల్లో కదలిక పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. బాసింపట్టు వేసుకుని తినడం వల్ల శారీరక నొప్పులు దూరమవుతాయి. ఇలా చేయడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అందరూ కలిసి కూర్చుని తింటే కుటుంబసభ్యుల మధ్య బంధాలు బలపడుతాయి.
బంగారు గనిని తవ్వేందుకు ఓ తెగ నాయకుడైన తంగలాన్(విక్రమ్) బ్రిటిష్ జనరల్తో ఒప్పందం చేసుకుంటారు. ఆ ప్రాంతానికి కాపలాగా ఉన్న మంత్రగత్తె(మాళవిక) వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ ఉంటారు. ఈమెను ఎదిరించి బంగారు గనిని తవ్వారా? అనేది కథ. డీగ్లామర్ పాత్రల్లో విక్రమ్, మాళవిక నటన, విజువల్స్, BGM, రంజిత్ టేకింగ్, స్క్రీన్ప్లే, ఫైనల్ ట్విస్ట్ మూవీకి ప్లస్. స్లో నరేషన్, సాగదీత సీన్లు మైనస్.
రేటింగ్: 2.75/5
TG: రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ, సాధారణ గురుకులాల్లో 6వేలకు పైగా పోస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్లో 1,800కుపైగా బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నట్లు అంచనా. డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీతోపాటు వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను 2025-26 జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్నట్లు సమాచారం. డీఎస్సీ, జేఎల్ నియామకాల తర్వాత మొత్తం ఖాళీలపై క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఝార్ఖండ్లోని సిమ్డేగా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా హాకీ టోర్నమెంట్ నిర్వహిస్తుండగా భారీ వర్షం కురిసింది. ఆటగాళ్లు సమీపంలోని చెట్టుకిందకు వెళ్లగా పిడుగులు పడటంతో ముగ్గురు చనిపోయారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల నిడివిలో ప్రధాని మోదీ తన రికార్డును తానే బద్దలుకొట్టారు. 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించగా నేడు 98 నిమిషాలతో దాన్ని దాటేశారు. ప్రధానిగా ఆయన స్పీచ్ల సగటు 82 నిమిషాలుగా ఉంది. మరే ప్రధానికి ఈ సగటు లేదు. అత్యల్పంగా 2017లో 56 నిమిషాల పాటు మాట్లాడారు. గత ఏడాది 90 మినిట్స్ ప్రసంగించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ కాసేపట్లో వైరాలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గూగుల్ తమ హోం పేజీని ప్రత్యేక డూడుల్తో అలంకరించింది. ఫ్రీలాన్స్ ఆర్ట్ డైరెక్టర్ వృందా జవేరీ దీన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు త్రివర్ణాలతో వేడుకలు చేసుకుంటారని, ఈ సందర్భంగా వారసత్వ నిర్మాణశైలిని ప్రతిబింబించేలా పలు వర్ణాలతో డూడుల్ని తీర్చిదిద్దామని గూగుల్ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో డూడుల్ను ఏర్పాటు చేస్తుంటుంది.
AP: తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తోందని మంత్రి లోకేశ్ చెప్పారు. గుంటూరులో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘సూపర్-6 హామీలకు కట్టుబడి ఉన్నాం. పింఛన్ల మొత్తాన్ని పెంచి అందిస్తున్నాం. రైతులకు ఏడాదికి రూ.20వేల సాయం చేస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 సిలిండర్లు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అమరావతి పనులను వేగంగా పూర్తి చేస్తాం’ అని తెలిపారు.
కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే ఉమ్మడి పౌరస్మృతి (UCC) లక్ష్యం. దేశంలో మతాలను బట్టి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, నిర్వహణ వీటి కిందకి వస్తాయి. ఉదా: కొన్ని మతాల్లో బహు భార్యత్వం అమల్లో ఉంది. విడాకులకు కోర్టుతో సంబంధం లేదు. మత విద్య, మెజారిటీ మైనారిటీ వ్యత్యాసం ఉన్నాయి. వీటిపై విమర్శల వల్లే <<13857660>>లౌకిక పౌరస్మృతి<<>> అవసరమని మోదీ అన్నారు.
ఈ ఏడాది జులైలో ప్రభుత్వం తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలతో అందరికీ న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శిక్ష కంటే న్యాయానికే తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చిందని తెలిపారు. బ్రిటిష్ కాలానికి చెందిన ఐపీసీ, సీఆర్పీసీ, ఐఈఏల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS), భారతీయ నాగరిక సురక్ష సంహిత(BNSS), భారతీయ సాక్ష్య అధినియం(BSA) చట్టాల్ని కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.