news

News August 10, 2024

పదకొండేళ్లకే తల్లిదండ్రులను కోల్పోయాడు.. పట్టుదలతో కాంస్యం

image

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సొంతం చేసుకున్న అమన్(21) పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. మేనమామ సుధీర్ చేరదీయగా, రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. కోచ్ లలిత కుమార్ వద్ద శిక్షణ ప్రారంభించి 2021లో మొదటి జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్యం, 2023లో బంగారు పతకం సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన ఏకైక పురుష రెజ్లర్‌గా నిలిచి సత్తా చాటారు.

News August 10, 2024

గుడ్ న్యూస్.. ‘దోస్త్’ గడువు పొడిగింపు

image

TG: డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం ఇచ్చింది. దోస్త్ స్పెషల్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్ట్ గడువును ఈ నెల 13 వరకు పొడిగించినట్లు ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. నిన్నటితోనే సెల్ఫ్ రిపోర్టింగ్ ముగియగా మరో నాలుగు రోజులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

News August 10, 2024

శక్తివంతమైన సాధనంగా క్రీడలు: యోగి

image

క్రీడలు ఇప్పుడు భవిష్యత్తును మార్చే శక్తివంతమైన సాధనంగా ఉన్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇవి దోహదపడుతాయని గోరఖ్‌నాథ్‌లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు రాష్ట్రంలో పోలీసు, ఇతర విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

News August 10, 2024

ఫ్రాన్స్‌కు షాక్.. ఫైనల్లో స్పెయిన్ విజయం

image

పారిస్ ఒలింపిక్స్: మెన్స్ ఫుట్‌బాల్ ఫైనల్లో ఆతిథ్య ఫ్రాన్స్‌కు స్పెయిన్ షాకిచ్చింది. ఫైనల్ మ్యాచులో 5-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. దీంతో ఆ జట్టు 32 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో బంగారాన్ని అందుకుంది. మరోవైపు ఫ్రాన్స్ గోల్డ్ ఆశలు ఆవిరవ్వగా రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు కాంస్యం కోసం జరిగిన మ్యాచులో ఈజిఫ్టుపై మొరాకో విజయం సొంతం చేసుకుంది.

News August 10, 2024

మరో పతకం వచ్చేనా?

image

పారిస్ ఒలింపిక్స్‌లో పోటీలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజున భారత్ మరో పతకంపై ఆశలు పెట్టుకుంది. రెజ్లింగ్‌లో యువ అథ్లెట్ రితికా హుడా 76 కేజీల మహిళల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గోల్ఫ్‌లో దీక్ష దగర్, అదితి అశోక్ బరిలో ఉన్నారు. కాగా ఇప్పటివరకు జరిగిన పోటీల్లో భారత్‌కు ఒక రజతం, ఐదు కాంస్యాలు వచ్చాయి.

News August 10, 2024

ఈ నెల 12 నుంచి CPGET కౌన్సెలింగ్

image

TG: సీపీగెట్-2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగనుంది. సవరణలకు 26 వరకు అవకాశమివ్వగా 27 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. SEP 4న మొదటి ఫేజ్ సీట్లను అలాట్ చేయనున్నారు. అదే నెల 9న విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ వెరిఫికేషన్ SEP 15న మొదలుకానుంది.

News August 10, 2024

ఇవాళ వయనాడ్‌కు మోదీ

image

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన కన్నూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత బాధితులు ఆశ్రయం పొందుతున్న సహాయక శిబిరాలకు వెళ్లి వారిని కలవనున్నారు. పునరావాస పనుల పరిశీలనతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు.

News August 10, 2024

ప్రధాని మోదీకి ధన్యవాదాలు: రాహుల్

image

ప్రకృతి విపత్తు సంభవించిన కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేశారు. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా మోదీ చూస్తారని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిని ఆయన జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనలో 200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.

News August 10, 2024

‘ఓటు తప్పనిసరి’ ప్రతిపాదన లేదు: కేంద్రమంత్రి

image

దేశంలో ఓటు వేయడం తప్పనిసరి చేయాలనే ప్రతిపాదన లేదని యూనియన్ లా మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ఎన్నికల ముంగిట ప్రజలకు అందించే ఉచితాలపై ఆంక్షలు విధించే ప్రపోజల్స్ కూడా లేవన్నారు. సభలో ఎదురైన రెండు వేర్వేరు ప్రశ్నలకు ఆయన ఇలా స్పందించారు. మరోవైపు ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 65.79శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలియజేసిందని ఆయన సభలో చెప్పారు.

News August 10, 2024

రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీ

image

AP: ✒ కర్నూలు <<13819192>>జేసీగా<<>> బి.నవ్య
✒ అనంతపురం జేసీగా హరిత
✒ తూర్పుగోదావరి జేసీగా చిన్న రాయుడు
✒ పశ్చిమగోదావరి జేసీగా రాహుల్ కుమార్ రెడ్డి
✒ విజయనగరం జేసీగా సేదు మాధవన్
✒ నెల్లూరు జేసీగా కార్తీక్

error: Content is protected !!