news

News August 8, 2024

సోనియా గాంధీని కలిసిన మనూ భాకర్

image

ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ నిన్న ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన పతకాలను సోనియాకు చూపించి, ఒలింపిక్స్ విశేషాలను పంచుకున్నారు. కాగా మనూ భాకర్ మళ్లీ పారిస్ వెళ్లనున్నారు. ఈ నెల 11న జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత ఫ్లాగ్ బేరర్‌గా మను వ్యవహరించనున్నారు.

News August 8, 2024

73 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు: కేంద్రం

image

రీవెరిఫికేషన్‌లో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ LSలో తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని టెలికం విభాగం(డాట్) టెల్కోలను ఆదేశించింది. వివరాల ధ్రువీకరణలో విఫలమైన కంపెనీలు, కనెక్షన్లను రద్దు చేశాయి. నకిలీ IDలు లేదా అడ్రస్‌లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించింది.

News August 8, 2024

3 సార్లు స్పిన్ బౌలింగ్‌లోనే..!

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నారు. పేస్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కోహ్లీ.. స్పిన్నర్లు వచ్చేసరికి నెమ్మదిస్తున్నారు. ‘విరాట్ లాంటి వరల్డ్ నం.1 బ్యాటర్ ఇలా LBW అవ్వడం ఆశ్చర్యకరం. అతడు స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయట్లేదేమో!’ అని పాక్ మాజీ ప్లేయర్ బాసిత్ అభిప్రాయపడ్డారు.

News August 8, 2024

రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్ న్యూస్!

image

TG: రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. గ్యాస్ రాయితీ సొమ్మును 2 రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలని CM రేవంత్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ డబ్బులు జమ అయ్యేందుకు నాలుగైదు రోజులు పడుతోంది. మరోవైపు ఈ స్కీం ప్రారంభించినప్పుడు 39.50 లక్షలుగా ఉన్న లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రాల్లో సవరణకు అవకాశం ఇవ్వడంతో తాజాగా 44.10 లక్షలకు చేరారు.

News August 8, 2024

ఒలింపిక్స్: ఆశలన్నీ అతడిపైనే

image

పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేటలో భారత్‌కు నిన్న తీవ్ర నిరాశ ఎదురైంది. మరోవైపు ఇవాళ రెండు పతకాల కోసం భారత్ బరిలో ఉంది. గత ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ నీరజ్ తిరిగి తన పతకాన్ని డిఫెండ్ చేసుకుంటారా లేదా అనేది ఇవాళ రాత్రి తేలనుంది. ఇక కాంస్యం కోసం భారత పురుషుల హాకీ జట్టు స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇవాళ్టి పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.

News August 8, 2024

ఎమ్మెల్సీ బై ఎలక్షన్.. వైసీపీ క్యాంపు రాజకీయం?

image

AP: విశాఖ స్థానిక సంస్థల <<13788692>>ఎమ్మెల్సీ<<>> ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వైఎస్ జగన్ నేరుగా MPTC, ZPTCలతో మాట్లాడుతున్నారు. నిన్న అరకు, పాడేరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఇవాళ పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి నేతలతో భేటీ అనంతరం వారిని కూడా క్యాంపునకు తరలిస్తారని తెలుస్తోంది.

News August 8, 2024

నేడు స్కూల్ మేనేజ్‌మెంట్ ఎన్నికలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ స్కూల్ మేనేజ్‌మెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలను పాఠశాలల్లో ప్రదర్శించారు. ఎన్నిక విధానం చేతులు ఎత్తడం లేదా చెప్పడం ద్వారా ఉంటుంది. ఎన్నికైన మొత్తం 15 మంది సభ్యుల్లో ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఇవాళే ప్రమాణస్వీకారం చేసి తొలి కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులనూ నియమిస్తారు.

News August 8, 2024

యువ ప్లేయర్లతో సిరీస్ గెలిచేసింది!

image

యువ సంచలనాలతో శ్రీలంక అదరగొట్టింది. పతిరణ, హసరంగ, మధుశంక, తుషార, చమీరా, ఫెర్నాండో వంటి సీనియర్ ప్లేయర్లు లేకున్నా బలమైన టీమ్ ఇండియాపై విజయం సాధించింది. తమ బలమైన స్పిన్ విభాగంతో రోహిత్ సేనను కట్టడి చేసింది. ముఖ్యంగా యువ ఆల్‌రౌండర్ వెల్లలగే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు.

News August 8, 2024

అర్ధరాత్రి భారీ వర్షం

image

TG: అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అత్తాపూర్, టోలిచౌకి ఏరియాల్లో వాన దంచికొట్టింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నిన్న గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అటు భద్రాచలం సైతం నీటమునిగింది.

News August 8, 2024

వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి?

image

ఇస్లాం మతాచారాలు పాటించేవారు తమకున్న స్థిర, చరాస్తులను దానం చేస్తే, ఆ ఆస్తులను వక్ఫ్ అంటారు. ఈ ఆస్తులన్నింటినీ నిర్వహించేదే వక్ఫ్ బోర్డు. దేశ విభజన సమయంలో ఇండియా నుంచి పాక్ వెళ్లిపోయిన ముస్లింల ఆస్తులను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. దేశంలోని 30 వక్ఫ్ బోర్డుల పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు. మిలిటరీ, రైల్వే తర్వాత అత్యధికంగా భూములు కలిగి ఉన్నది వక్ఫ్ బోర్డులే.

error: Content is protected !!