news

News August 1, 2024

ఒలింపిక్స్‌లో PV సింధు ఓటమి

image

బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి పాలయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్‌తో హోరాహోరీ పోరు జరిగింది. తొలి రౌండ్ నుంచే ఒక్కో పాయింట్ కోసం సింధు శ్రమించాల్సి వచ్చింది. ఫస్ట్ రౌండ్ 19-21 తేడాతో వెనుకబడిన ఆమె తర్వాతి రౌండ్లో(14-21)నూ పోరాడి ఓడిపోయారు. దీంతో సింధు నిరాశతో ఇంటిబాట పట్టారు.
<<-se>>#Olympics2024<<>>

News August 1, 2024

డెంగ్యూతో నిండు గర్భిణి మృతి.. కడుపులోని కవలలు కూడా..

image

TG: నెలలు నిండిన ఆ గర్భిణి మరికొద్ది రోజుల్లో తనలోని ప్రాణాలు బయటి ప్రపంచంలోకి వస్తాయని ఆనందపడింది. అమ్మనయ్యే మధురానుభూతి పొందేందుకు ఆరాటపడింది. కానీ అంతలోనే డెంగ్యూ ఆ తల్లీబిడ్డలను కబళించింది. హనుమకొండ(D)లో ఈ విషాదం జరిగింది. గట్లకానిపర్తికి చెందిన శిరీష డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తనువు చాలించింది. ఆమె కడుపులో ఉన్న కవలలను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం వృథా అయింది.

News August 1, 2024

SC వర్గీకరణతో సామాజిక న్యాయం: పవన్

image

AP: SC, ST వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఒక వర్గం నిరంతర పోరాట ఫలితమే ఈ తీర్పు అని అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని పోరాటం చేశారన్నారు. ఈ వర్గీకరణతో సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. SCల్లో ఐక్యత చెక్కు చెదరకుండా చూడాల్సిన బాధ్యత ఆ వర్గం మేధావులపై ఉందన్నారు.

News August 1, 2024

శాలరీ క్రెడిటెడ్.. ఉద్యోగి ఆనందంపై లోకేశ్ ట్వీట్

image

AP: కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇవాళ ఉదయమే శాలరీ క్రెడిట్ అయిందంటూ ఓ ఉద్యోగి పలకపై రాసి చూపిస్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే పడిన జీతాలు. ఆనందమయ జీవితాలు. ఇదీ కూటమి ప్రభుత్వం సమర్థ పాలనకు నిదర్శనం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.

News August 1, 2024

క్యూ1లో దూసుకెళ్లిన టాటా మోటార్స్‌

image

FY25 తొలి త్రైమాసిక ఫలితాల్లో టాటా మోటార్స్ రాణించింది. నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 74% వృద్ధి చెంది ₹5,566 కోట్లుగా నమోదైంది. ఆపరేషన్స్‌కు సంబంధించి ₹1,07,316 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. FY24 క్యూ1తో పోలిస్తే 5.7% వృద్ధి రికార్డ్ అయింది. అంచనాలకు మించి నికర లాభం నమోదు కావడంపై ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్యూ1లో ఐటీసీ ₹4,917 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

News August 1, 2024

గ్రేట్.. వారధి నిర్మించిన ‘సీత’

image

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగి బీభత్సం సృష్టించిన వేళ సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు సైన్యం వారధి నిర్మించింది. 190 అడుగుల పొడవు ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఓ మహిళా జవాన్ ఆధ్వర్యంలో జరగడం విశేషం. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్‌తో కలిసి 16 గంటల్లోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ పేర్కొన్నారు.

News August 1, 2024

మరోసారి బెంగళూరుకు జగన్

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3.45 గంటలకు ఆయన తాడేపల్లిలోని తన ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు. రాత్రి 7.15 గంటలకు బెంగళూరులో ల్యాండ్ అవుతారు. ఈ మేరకు షెడ్యూల్‌ను జగన్ పీఏ పోలీసు శాఖకు అందించారు. ప్రొటోకాల్ ప్రకారం ఎస్కార్ట్, సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని కోరారు.

News August 1, 2024

షాక్.. ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకొని బాలిక మృతి

image

TG: సెల్‌ఫోన్ <<13718301>>ఛార్జింగ్‌కు<<>> మరో చిన్నారి బలైంది. ఆదిలాబాద్ జిల్లా కొత్తమద్ది పడగకు చెందిన ఏడాదిన్నర బాలిక ఆరాధ్య ఇంట్లోని ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురైంది. తల్లిదండ్రులు ఆమెను ఖానాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఛార్జింగ్ కేబుళ్లు పిల్లలకు అందకుండా పెట్టాలి. ఛార్జింగ్ పూర్తికాగానే తొలగించాలి.

News August 1, 2024

హోంమంత్రి లేకపోవడం వల్ల నేరాలు పెరుగుతున్నాయి: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో 48 గంటల్లోనే నాలుగు అత్యాచారాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ట్వీట్ చేశారు. 8 నెలలుగా హోంమంత్రి లేకపోవడం దారుణమని, అందువల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. వనస్థలిపురం, శాలిగౌరారం, నిర్మల్, పుప్పాలగూడలో జరిగిన ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News August 1, 2024

ట్రంప్ గెలిస్తే యూఎస్‌తో దోస్తీకి కిమ్ గ్రీన్ సిగ్నల్?

image

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికాతో చర్చలకు కిమ్ సర్కార్ సానుకూలంగా ఉందని ఉత్తరకొరియా మాజీ దౌత్యవేత్త రీ ఇల్ గ్యూ పేర్కొన్నారు. USతో చర్చలు జరిపి అణు ప్రయోగాలపై ఆంక్షలను తొలగించుకోవాలని ఉ.కొరియా ప్లాన్ చేస్తోందట. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందనే ముద్రను చెరిపించుకుని నిధులకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తోందట. క్యూబాలో విధులు నిర్వహించే రీ గత ఏడాది కుటుంబంతో సౌత్ కొరియాకు పరారయ్యారు.