India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మనం ఎలా ఉన్నామో చూసుకోవడానికి అనుకుంటే పొరపడినట్లే. చాలా మంది చిన్న ప్రదేశాల్లో లాక్ చేయడంతో భయపడి ఆందోళన చెందుతుంటారు. అద్దం ఉండటం వల్ల లిఫ్ట్ పెద్దగా కనిపించి భయమనిపించదు. హార్ట్ బీట్ పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటి లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు అద్దాలు లిఫ్టులో ఉన్న ఇతరుల కదలికలను తెలుసుకొని దొంగతనాలు, దాడులను నిరోధించడానికి పనికొస్తాయి.
భారీ బడ్జెట్తో తెరకెక్కే మసాలా మూవీలకు కచ్చితంగా నో చెప్తానని జాతీయ ఉత్తమ నటి నిత్యా మేనన్ అన్నారు. అదే చిన్న సినిమా అయినా మంచి పాత్ర అయితేనే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు సంతోషాన్ని ఇచ్చే పాత్రలు చేయడం ఇష్టమని తెలిపారు. సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘తిరుచిత్రంబలం’ చిత్రానికి నిత్య ఉత్తమ నటి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.
AP: మంత్రి సత్యకుమార్ యాదవ్పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2023లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తుండగా ఆయనతో పాటు కార్యకర్తలపై అప్పటి ఎంపీ నందిగం సురేశ్, మరికొందరు దాడికి యత్నించారని ఆరోపించారు. ఆ సమయంలో ఫిర్యాదును తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఫిర్యాదును స్వీకరించిన SP చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అయ్యప్ప భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చింది. ఈ రైలులో వెళ్లి శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలు చూడవచ్చు. NOV 16న ఉ.8 గంటలకు SCలో బయల్దేరే ఈ రైలుకు NLG, పిడుగురాళ్ల, GNT, తెనాలి, OGL, NLR, గూడూరు, రేణిగుంట, TPTY, చిత్తూరులో రైలు ఎక్కొచ్చు. 5 పగళ్లు, 4 రాత్రులు రోడ్డు రవాణాతో పాటు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు ఉంటాయి. స్లీపర్ ఛార్జ్ ₹11,475, థర్డ్ AC ₹18,790.
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్తో పుణేలో జరిగే రెండో టెస్టుకూ దూరమయ్యారు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. కేన్ పూర్తిగా కోలుకోకపోవడంతో నెక్స్ట్ టెస్టుకూ రెస్ట్ ఇస్తున్నట్లు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. నవంబర్ 1న ముంబైలో జరగనున్న మూడో టెస్టుకు విలియమ్సన్ ఆడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్లోని లాహోర్లో నిర్వహించిన బుక్ ఫెయిర్ కాస్తా ఫుడ్ ఫెస్ట్గా మారింది. సాహిత్యం- సంస్కృతిని ప్రోత్సహించేందుకు, బుక్స్ చదివే అలవాట్లను పెంపొందించేందుకు నిర్వాహకులు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి వేలాది మంది తరలిరాగా కేవలం 35 పుస్తకాలే అమ్ముడయ్యాయి. కానీ, 1200 షావర్మాలు, 800 బిర్యానీలు అమ్ముడయ్యాయి. దీంతో పుస్తకాల కంటే తిండే ముఖ్యమైందని నెట్టింట విమర్శలొస్తున్నాయి.
దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నారు. AY2013-14లో రూ.కోటికి మించి Taxable Income చూపినవారి సంఖ్య 44,078. పదేళ్లలో (AY2023-24) వీరు 2.3 లక్షలకు చేరారు. ఆదాయం పెరగడం, ITR ఫైలింగ్ ఈజీ అవ్వడమే ఇందుకు కారణాలు. AY2023-24లో రూ.కోటిగా పైగా ITR ఫైల్ చేస్తున్నవారిలో ఉద్యోగులు 52% ఉన్నారు. చాలామందికి రూ.1-5 కోట్ల వరకు శాలరీ వస్తోంది. మొత్తంగా ITR ఫైల్ చేస్తున్నవారు పదేళ్లలో 3.3 కోట్ల నుంచి 7.5 కోట్లకు చేరారు.
AP: హైకోర్టులో దాఖలు చేసిన <<14413512>>పిటిషన్లో<<>> అల్లు అర్జున్ పలు విషయాలను ప్రస్తావించారు. MLAగా పోటీ చేస్తున్న స్నేహితుడు కిశోర్రెడ్డి ఇంటికి వెళ్లడం తన వ్యక్తిగత పర్యటన అని వివరించారు. ఆయన్ను అభినందించేందుకు మాత్రమే వెళ్లానని, బహిరంగ సభ నిర్వహించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. ఎన్నికల టైంలో వ్యక్తిగత సందర్శన కోడ్ ఉల్లంఘన కిందకు రాదని, కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది.
బలమైన బ్యాటింగ్ లైనప్కు కేరాఫ్గా పేరున్న టీమ్ ఇండియా క్రమంగా బలహీనమవుతూ వస్తోంది. 2020 నుంచి సొంతగడ్డపై టెస్టుల్లో యావరేజ్ రన్స్ పర్ వికెట్ తగ్గిపోతూ వస్తోంది. 2015-19లో తొలి ఇన్నింగ్స్ సగటు 48.57 ఉంటే ఇప్పుడు 32.62కి పడిపోయింది. 2వ ఇన్నింగ్స్లో 53.93 నుంచి 36.58 రన్స్కి తగ్గింది. అటు మన పిచ్లపై విదేశీ బ్యాటర్ల రన్రేట్ పెరుగుతూ వస్తోంది. NZతో టెస్టులో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది.
TG: అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.