news

News October 21, 2024

100 ఏళ్ల పోరాటం.. మలేరియా రహిత దేశంగా ఈజిప్ట్

image

ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈజిప్టులో ‘మలేరియా’ ఓ భాగంగా ఉండేది. 1920 ప్రాంతంలో లక్షల మంది ఈ వ్యాధితో చనిపోయారు. దాదాపు 100 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ దేశం మలేరియా రహిత దేశంగా మారింది. ఈ విషయాన్ని WHO ప్రకటించింది. ఇది నిజంగా చారిత్రాత్మకమని ప్రశంసించింది. ప్రస్తుతం 44 మలేరియా ఫ్రీ కంట్రీలు ఉన్నాయి. దోమల వల్ల వచ్చే ఈ వ్యాధి వల్ల ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది చనిపోతున్నారు.

News October 21, 2024

ఓ ప్రయాణికుడి సరదా వ్యాఖ్యలతో కొచ్చి విమానాశ్రయంలో కలకలం

image

సరదాగా చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు చేటుచేస్తాయి. ఇటీవ‌ల విమానాల‌కు న‌కిలీ బాంబు బెదిరింపులు అధిక‌మ‌య్యాయి. తాజాగా కొచ్చి నుంచి ముంబై వెళ్తున్న విజయ్ మాంధయన్ విమానం ఎక్కే ముందు సిబ్బందితో త‌న వ‌ద్ద బాంబు ఉందని చెప్పాడు. దీంతో అధికారులు అప్రమత్తమై అత‌ని ల‌గేజీని జ‌ల్లెడ ప‌ట్టారు. చివరికి అతను సరదాగా చెప్పినట్టు తేల్చారు. ఈ వ్యాఖ్యలతో విజయ్ ఇప్పుడు నెడుంబస్సేరి పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది.

News October 21, 2024

ఆ విష‌పూరిత నురుగు అంత‌రిక్షం నుంచీ కనిపిస్తోంది

image

ఢిల్లీకి ప్ర‌ధాన నీటి వ‌న‌రైన‌ య‌మునా న‌ది క‌లుషిత స్థాయుల‌ను చెప్పేందుకు ఈ ఒక్క చిత్రం స‌రిపోతుందేమో. ఏటా న‌వంబ‌ర్‌లో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్య‌ర్థాల ద‌హ‌నం స‌హా పండుగ‌ల సీజ‌న్‌లో న‌గ‌రంలో గాలి, నీటి కాలుష్యం భారీగా పెరుగుతుంది. ప‌రిశ్ర‌మల ర‌సాయ‌నాలు, కాలువల వ్య‌ర్థాలతో న‌ది ప్ర‌ధాన బ్యారేజ్‌ల వ‌ద్ద విష‌పూరిత నురుగు ద‌ర్శ‌న‌మిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్‌లో కూడా అది కనిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

News October 21, 2024

RCBకి షాక్.. కర్ణాటక ప్లేయర్ల కోసం ప్రభుత్వం ఒత్తిడి?

image

IPL-2025 వేలానికి ముందు RCBకి కొత్త సమస్య వచ్చింది. ఆ జట్టులోని కర్ణాటక ఆటగాళ్లు విజయ్ కుమార్, మనోజ్ భాండాగేను రిటైన్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ఆటగాళ్లను ఎక్కువగా తీసుకోవాలని కోరుతోందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల తమ ప్రణాళికలు దెబ్బతింటాయని యాజమాన్యం భావిస్తోంది. కాగా RCB కోహ్లీ, సిరాజ్, మ్యాక్సీ, గ్రీన్, రజత్‌లను అట్టిపెట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

News October 21, 2024

బద్వేల్ ఘటన.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

image

AP: వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థినిని పెట్రోల్‌తో కాల్చేసిన <<14405749>>నిందితుడు<<>> విఘ్నేశ్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో కడప సెంట్రల్ జైలుకు నిందితుడిని తరలించారు. విఘ్నేశ్‌కు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 21, 2024

రేవంత్.. తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు: హరీశ్ రావు

image

TG: గ్రూప్-1 విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై కఠినంగా వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని హరీశ్ రావు మండిపడ్డారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతకు మొండిచేయి చూపించారని విమర్శించారు. పదేళ్లలో BRS ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని తప్పుడు ప్రకటన చేయడం హాస్యాస్పదమని, తాము 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని హరీశ్ రావు ట్వీట్ చేశారు.

News October 21, 2024

భర్త బాగుండాలని పూజ చేసి.. గంటల్లోనే చంపేసింది

image

భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని ఉపవాసం ఉండి పూజలు చేసిన ఓ మహిళ కొన్ని గంటల్లోనే అతనికి విషమిచ్చి చంపేసింది. పోలీసులు ఆమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన UPలోని కౌశాంబి జిల్లాలో జరిగింది. శైలేష్, సవిత భార్యాభర్తలు. ‘కర్వాచౌత్’ పండుగ సందర్భంగా నిన్న ఆమె పూజలు చేసింది. అయితే భర్తకు మరొకరితో అఫైర్ ఉందనే అనుమానంతో గొడవపడింది. ఆ తర్వాత అతను తినే ఆహారంలో విషం కలపడంతో చనిపోయాడు.

News October 21, 2024

ఎక్కువ మంది పిల్లలను కనాలా?

image

సంతానోత్ప‌త్తి పెరగాలన్న ఏపీ, త‌మిళ‌నాడు CMల వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. AP సంతానోత్ప‌త్తి రేటు అవ‌స‌ర‌మైన 2.1 కంటే త‌క్కువ‌గా 1.7గా ఉంది. ఇదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా భారీగా పెరిగింది. లోక్‌స‌భ‌ స్థానాల పున‌ర్విభ‌జ‌నలో జ‌నాభా పెరుగుదలను నియంత్రించిన ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌నే వాదన వినిపిస్తోంది. జపాన్ లాగా వృద్ధుల సంఖ్య పెరిగి, యువత సంఖ్య తగ్గే అవకాశమూ ఉందంటున్నారు.

News October 21, 2024

సల్మాన్‌ఖాన్‌కు క్షమాపణ చెప్పిన నిందితుడు

image

రూ.5 కోట్లు డబ్బు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని <<14386537>>బెదిరించిన<<>> దుండగుడు ఇవాళ క్షమాపణ కోరాడు. ‘బెదిరింపు మెసేజ్ పంపి తప్పు చేశా. క్షమించండి’ అని వాట్సాప్ మెసేజ్ పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. గతంలో వాడిన నంబర్ ద్వారానే ఝార్ఖండ్ నుంచి ఈ సందేశం వచ్చినట్లు తేలడంతో అక్కడికి సిబ్బందిని పంపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. బెదిరింపుల తర్వాత సల్మాన్ సెక్యూరిటీని భారీగా పెంచిన విషయం తెలిసిందే.

News October 21, 2024

ఈ ఒప్పందం కీలక మైలురాయి: జైశంకర్

image

తూర్పు లద్దాక్‌లో పెట్రోలింగ్ విష‌యంలో భార‌త్‌-చైనా మ‌ధ్య కుదిరిన ఒప్పందాన్ని కీల‌క మైలురాయిగా విదేశాంగ మంత్రి జైశంక‌ర్ అభివ‌ర్ణించారు. దీంతో అక్క‌డ 2020 ముందు నాటి త‌ర‌హాలోనే ఇరు దేశాల బ‌ల‌గాలు పెట్రోలింగ్‌ చేపడతాయన్నారు. 2020 మేలో ఇరు దేశాల బ‌ల‌గాల మ‌ధ్య గాల్వ‌న్ వ్యాలీలో జ‌రిగిన ఫేస్‌-ఆఫ్‌లో 20 మంది భార‌త సైనికులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.