India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ సినిమా నుంచి ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు అప్టేడ్ రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘నేను రెడీ.. మీరు రెడీ నా?’ అంటూ రాసుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల కానుంది.
TG: గ్రూప్-1పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ను న్యాయమూర్తి పాస్ ఓవర్ చేశారు. లిస్ట్లో పిటిషన్లపై విచారణ మొత్తం పూర్తయ్యాక దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. కాగా గ్రూప్-1 అభ్యర్థుల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.
ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారని అల్లు అర్జున్పై గతంలో కేసు నమోదైంది.
సిలికాన్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవికుమార్ అనే వ్యాపారి వద్ద బాలిక తండ్రి రూ.70 వేలు తీసుకుని రూ.30వేలు తిరిగిచ్చాడు. మిగతా రూ.40వేలు, వడ్డీ కోసం రవికుమార్ నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు.
టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ సిరీస్ మొత్తంలో బ్యాట్ & బాల్తో టీమ్ గెలుపులో కీలకంగా మారిన ఆల్ రౌండర్ అమేలియా కెర్ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వరించింది. టోర్నీలో ఆమె 15 వికెట్లు పడగొట్టి సింగిల్ T20 WC ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచారు. ఈ టోర్నీలో ఆమె తీసిన వికెట్లు వరుసగా.. 1/19 vs IND, 4/26 vs AUS, 2/13 vs SL, 3/14 vs PAK, 2/14 vs WI, 3/24 vs SA (Finals).
మాల్దీవ్స్కు వెళ్లే భారతీయులకు ప్రెసిడెంట్ ముయిజ్జు గుడ్న్యూస్ చెప్పారు. అక్కడ UPI పేమెంట్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో అక్కడ పేమెంట్స్ చేయడం భారతీయులకు సులభతరం కానుంది. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో సహకారం అందించేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో మాల్దీవ్స్లో యూపీఐ పేమెంట్స్ తీసుకురావాలని ఆయన నిర్ణయించారు.
US ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా భయపడుతోంది. అక్కడి బ్యాంకులు $500bns నష్టాల్లో ఉన్నాయి. లిక్విడిటీ లేదు. ఇక జాతీయ అప్పు $35trns. గోల్డ్, పెట్రోల్ లేకుండానే ప్రింట్ చేస్తున్న డాలర్లు చిత్తుకాగితాలతో సమానమని కియోసాకి లాంటి ఆంత్రప్రెన్యూర్స్, ఎకానమిస్టులు బాహాటంగా చెప్తున్నారు. BRICS కరెన్సీ వస్తే ఇక ఆగమాగమేనని, US బుడగ ఏ క్షణమైనా టప్మని పేలొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. మీ కామెంట్.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా పయనిస్తూ బలపడి వాయుగుండం, ఆపై తుఫానుగా మారుతుందని పేర్కొంది. ఈ తుఫానుకు ‘దానా’గా నామకరణం చేశారు. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఏపీలో వర్షాలు పడతాయని, ఈ నెల 24 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ అరుదైన క్లబ్లో చేరారు. SA తరఫున టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో ప్లేయర్గా నిలిచారు. బంగ్లాదేశ్తో మ్యాచులో ఈ ఘనత సాధించారు. 65 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఈ జాబితాలో స్టెయిన్(439), పొలాక్(421), ఎన్తిని(390), డొనాల్డ్(330), మోర్కెల్(309) రబాడ కన్నా ముందు ఉన్నారు. ఓవరాల్గా ఈ జాబితాలో మురళీధరన్(800) తొలి స్థానంలో ఉన్నారు.
తానెంతో ప్రేమించే తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడంపై హీరో <<14405382>>కిచ్చా సుదీప్ <<>>ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ఆమె మనిషి రూపంలో ఉన్న దేవత. నా గురువు. ఇప్పుడు ఆమె జ్ఞాపకమే. నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తీకరించలేకపోతున్నా. ప్రతిరోజు ఉదయం 5.30కి గుడ్ మార్నింగ్ మెసేజ్ వచ్చేది. నేను ఆమెతో చివరిసారి మాట్లాడలేకపోయా. నా జీవితంలో అత్యంత విలువైనది కోల్పోయా. రెస్ట్ తీసుకో అమ్మా’ అని పోస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.