news

News October 20, 2024

దగ్గు, జలుబు మందులతో సంతానోత్పత్తి?

image

ఈమధ్య కొందరు గర్భధారణకు దగ్గు, జలుబు మందులు వాడుతుండటంతో ‘ముసినెక్స్ మెథడ్’ SMలో ట్రెండవుతోంది. 40జంటలపై సైంటిస్టులు అధ్యయనం చేస్తే వారిలో 15మంది గర్భం దాల్చారు. ఈ మెథడ్‌తో ఓ పురుషుడిలోనూ స్పెర్మ్ క్వాంటిటీ పెరిగినట్లు తేలిందని ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్‌ ప్రచురించింది. కాగా ఈ మెథడ్ సంతానోత్పత్తికి సహాయపడగలదని రుజువు చేసే శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువని సైంటిస్టులు చెబుతున్నారు.

News October 20, 2024

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: మంత్రి నాదెండ్ల

image

AP: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ స్కీమ్ కింద అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా అందిస్తామని పేర్కొన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.3,000కోట్ల ఖర్చు అవుతుందని, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించారు.

News October 20, 2024

ఆ ఏడాది OCT 5-14 తేదీలేమయ్యాయి?

image

తేదీలు మాయమవడం ఏంటని అనుకుంటున్నారా? గూగుల్‌లో 1582 నాటి క్యాలెండర్‌ను ఓ సారి చెక్ చేయండి. అక్టోబర్ నెలలో 5 నుంచి 14 వరకు తేదీలు కనపించవు. అప్పటివరకు సోలార్ క్యాలెండర్‌ను బేస్ చేసుకొని రూపొందించిన జూలియన్ క్యాలెండరే చాలా దేశాలు అనుసరించేవి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్‌ అందుబాటులోకి రావడంతో 10 రోజులు ముందుకు వెళ్లాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ అదే క్యాలెండర్‌ను అనుసరిస్తున్నాం.

News October 20, 2024

రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు

image

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీనే కారణమని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పిచ్‌ను ఆయన సరిగా అంచనా వేయలేదని, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశారని అంటున్నారు. NZ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలోనూ బౌలర్లను సరిగా వినియోగించుకోలేదని, అశ్విన్‌కు చివర్లో బౌలింగ్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ‘CLUELESS CAPTAIN ROHIT’ అని Xలో ట్రెండ్ చేస్తున్నారు.

News October 20, 2024

ఢిల్లీ ఒకప్పటి ముంబైలా తయారైంది: ఢిల్లీ సీఎం

image

రోహిణి ప్రాంతంలోని స్కూల్ బయట బాంబు పేలుడు జరగడంపై ఢిల్లీ సీఎం ఆతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నగరం పరిస్థితి 90వ దశకంలో ముంబైలా తయారైంది. ఇక్కడి శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కానీ ఆ పని వదిలేసి మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెడుతోంది. సిటీలో ఇష్టానుసారం తూటాలు పేలుతున్నాయి. బ్లాక్‌మెయిల్స్, నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 20, 2024

MH: MLA అభ్యర్థుల జాబితా విడుదల చేసిన BJP

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేేసే అభ్యర్థుల జాబితాను BJP విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 99 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. ఆ పార్టీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. కాగా నవంబర్ 20న పోలింగ్ జరగాల్సి ఉంది.

News October 20, 2024

రేపు విజయనగరం జిల్లాలో పవన్ పర్యటన

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో పర్యటించనున్నారు. గుర్లలో అతిసారం ప్రబలిన నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులపై సమీక్షించనున్నారు. వ్యాధి అదుపులోకి వచ్చే వరకూ గుర్లలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగుతోందని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే వ్యాధి సోకినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని పేర్కొన్నారు.

News October 20, 2024

ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ?: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే బద్వేల్ ఘటనకు కారణమని ఆరోపించారు. నిత్యం ఏదోచోట అత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని, ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. తాము తీసుకొచ్చిన ‘దిశ’ యాప్‌ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని, ఇప్పుడు దాని ప్రాధాన్యం తెలుస్తోందని జగన్ అన్నారు.

News October 20, 2024

ప్రాక్టీస్ మొదలుపెట్టిన గిల్

image

న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్టు ఓటమి అనంతరం టీమ్ ఇండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. చిన్న గాయం వల్ల అతడు ఈ టెస్టు ఆడలేదు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. దీంతో 2వ టెస్టులో గిల్‌ను జట్టులోకి తీసుకునేందుకు ఎవరిని తొలగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అటు KL.రాహుల్ 2 ఇన్నింగ్సుల్లోనూ ఫెయిల్ కావడంతో అందరి వేళ్లు అతడివైపే చూపిస్తున్నాయి.

News October 20, 2024

APPLY NOW: 732 ఉద్యోగాలకు రేపే లాస్ట్

image

తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించిన 732 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఫార్మసీ పూర్తిచేయడంతో పాటు రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నవారు అప్లికేషన్‌కు అర్హులు. వయసు ఈ ఏడాది జులై నాటికి 46 ఏళ్లకు మించరాదు. అభ్యర్థులు <>mhsrb.telangana.gov.in<<>> వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 30న ఫార్మాసిస్ట్ పరీక్ష జరగనుంది.