news

News October 19, 2024

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే నిజమైన దోస్తాన్: బండి సంజయ్

image

TG: నిజమైన స్నేహం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాదని నొక్కి చెప్పారు. హరియాణా, J&K ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపింది వాస్తవం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ ఏమైందన్నారు. BRS, కాంగ్రెస్ మధ్య స్నేహం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

News October 19, 2024

ఒక్క బాంబు బెదిరింపు కాల్‌తో రూ.3 కోట్ల నష్టం

image

బాంబు బెదిరింపు కాల్స్‌తో ఎయిర్‌లైన్స్ కంపెనీల చమురు వదులుతోంది! ఒక్కో నకిలీ కాల్ వల్ల రూ.3 కోట్ల వరకు నష్టపోతున్నట్టు అంచనా. దారి మళ్లిస్తే అదనపు ఫ్యూయల్ కోసం రూ.కోటి వరకు ఖర్చవుతోంది. ఇక ఫ్లైట్ ల్యాండింగ్, ఎయిర్‌పోర్ట్ పర్మిషన్లు, ప్రయాణికులకు లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, ఇతర అవసరాలకు మరో రూ.2కోట్లు కావాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 40 ఫేక్ కాల్స్ వల్ల కంపెనీలపై రూ.60-80కోట్ల అదనపు భారం పడింది.

News October 19, 2024

ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, అదే ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. అమరావతి కోసం 54వేల ఎకరాలు సేకరిస్తే గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని దుయ్యబట్టారు. రైతులను అడుగడుగునా అణగదొక్కినా వాళ్లు అద్భుతంగా పోరాడారని పేర్కొన్నారు.

News October 19, 2024

అధికారం పోయినా వారికి అహంకారం తగ్గలేదు: మంత్రి కోమటిరెడ్డి

image

TG: పోరాటాలకు మారు పేరు నల్గొండ జిల్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా పాత్ర కీలకమని చెప్పారు. జిల్లా ప్రజలది దొరలు చెప్తే వినే రక్తం కాదన్నారు. బీఆర్ఎస్‌లా కాకుండా తాము చేసేదే చెప్పి అధికారంలోకి వచ్చామన్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధి కోసమే సీఎం పర్యటనలు చేస్తున్నారన్నారు.

News October 19, 2024

హైదరాబాద్‌ను తీర్చిదిద్దిన ఘనత మాదే: సీఎం చంద్రబాబు

image

AP: సికింద్రాబాద్, హైదరాబాద్‌ నగరాలను నిజాం, బ్రిటిష్ వాళ్లు అభివృద్ధి చేస్తే తాను మూడో నగరం సైబరాబాద్‌ను తీర్చిదిద్దానని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలోనే నంబర్-1 సిటీగా హైదరాబాద్‌ను మార్చామన్నారు. అప్పట్లోనే 8 లేన్ల రోడ్లకు రూపకల్పన చేస్తే అందరూ ఆశ్చర్యపోయారని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో అందరూ ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు అమరావతిని కూడా గొప్పగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

News October 19, 2024

ఎకరాకు రూ.7,500.. ఎప్పటినుంచంటే?

image

TG: పంట ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రబీ నుంచి పంట బీమాకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన MSPకే పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీని ఆధారంగా రబీ సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 చెల్లించేందుకు సిద్ధంగా ఉందన్నారు. పంట వేసిన వారికే డబ్బులు చెల్లించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు.

News October 19, 2024

అయ్యర్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా ముంబై

image

రంజీ ట్రోఫీలో మహారాష్ట్రతో జరుగుతున్న టెస్టులో ముంబై తొలి ఇన్నింగ్సులో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓపెనర్ అయుష్(176), శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో 200 పరుగులకు పైగా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్సులో మహారాష్ట్ర 126 పరుగులకే ఆలౌటైంది. కాగా శ్రేయస్‌కు ఇది 14వ ఫస్ట్ క్లాస్ సెంచరీ.

News October 19, 2024

గ్రూప్-1 అభ్యర్థుల నిరసనపై రాహుల్ స్పందించాలి: హరీశ్

image

TG: ఎన్నికల ముందు అశోక్‌నగర్‌లో తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు వారికి వినిపించడం లేదా? రాహుల్ గాంధీ తప్పకుండా స్పందించాలి. అందరికీ న్యాయం చేయాలని KCR తెచ్చిన GO 55ను ఎందుకు రద్దు చేశారు? GO 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

News October 19, 2024

గ్రేట్.. చెట్లను కాపాడేందుకు రెండేళ్లు పోరాటం!

image

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జులియా హిల్ పర్యావరణ పరిరక్షకురాలు. 1997లో ఓ కంపెనీ చైర్ల తయారీ కోసం వెయ్యేళ్ల భారీ వృక్షాలను తొలగించేందుకు సిద్ధమైంది. దీంతో జులియా ఓ వృక్షంపైకి ఎక్కి 200 ఫీట్ల ఎత్తులో నిరసన తెలిపారు. చలి, కుండపోత వర్షాలను ఎదుర్కొని 738 రోజులు దిగకుండా చెట్టుపైనే ఉండిపోయారు. కంపెనీ వెనకడుగేయడంతో ఆమె తన పోరాటంలో విజయం సాధించారు. కొన్నిరోజుల్లోకే ఆ కంపెనీ దివాలా తీసింది.

News October 19, 2024

Disney+ Hotstarలోనే IPL లైవ్ స్ట్రీమింగ్?

image

రిలయన్స్ తమ ప్రైమరీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా Disney+ Hotstarనే ఎంచుకుంటుందని తెలిసింది. IPL సహా అన్ని స్పోర్టింగ్ ఈవెంట్లను ఇందులోనే ఇస్తుందని రాయిటర్స్ పేర్కొంది. స్టార్ఇండియా వద్ద సుపీరియర్ టెక్నాలజీ ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. విలీనమయ్యాక డిస్నీ, జియోసినిమాను కలిపేయడం, వేర్వేరుగా కొనసాగించడం, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను వేర్వేరు యాప్స్‌లో ఇవ్వడంపై RIL యోచిస్తున్నట్టు వెల్లడించింది.