India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న మరోసారి సమావేశం కానుంది. క్యాబినెట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21న సాయంత్రం 4 గంటల్లోపు పంపించాలని అన్ని శాఖలను సీఎస్ నీరబ్కుమార్ ఆదేశించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాగా ఈ నెలలో ఇది మూడో క్యాబినెట్ భేటీ.
AP: వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించింది. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా-కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి కడప, కర్నూలు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు-వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మడి కృష్ణా-ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలు-బొత్స సత్యనారాయణ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కో ఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని నియమించింది.
డేట్కి వెళ్లినప్పుడు బిల్లుల్ని తనతోనే కట్టించాలని అబ్బాయిలు ట్రై చేస్తుంటారని నటి శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘డేట్కి వెళ్లినప్పుడు నేనే డబ్బులు పే చేస్తా. ప్రేమను వ్యక్తీకరించడంలో అది నా శైలి. కానీ 3 నెలల తర్వాత కూడా నేను బిల్లు కట్టాలంటే ఎలా? డబ్బుంది కాబట్టి కట్టడం నీకు ఇష్టమనుకున్నా అంటుంటారు కొంతమంది. అందుకే డేట్లో బిల్లు సగం మాత్రమే ఇవ్వడం నేర్చుకున్నా’ అని పేర్కొన్నారు.
అంగారకుడిపై మంచు ఫలకాల కింద సూక్ష్మ జీవుల ఉనికి ఉండొచ్చని నాసా అంచనా వేసింది. భూమిపైనా అలాంటి ప్రాంతాలున్నాయని పేర్కొంది. ‘మంచు ఫలకాల కింద ఉన్న నీటికి సూర్యరశ్మి తగిలితే ఫోటోసింథసిస్ కారణంగా సూక్ష్మస్థాయిలో జీవం ప్రాణం పోసుకోవడానికి ఛాన్స్ ఉంది. మార్స్పై అలాంటి చోట్లే జీవం గురించి అన్వేషించాలి. భూమిపై ఆ ప్రాంతాలను క్రయోకొనైట్ రంధ్రాలుగా పేర్కొంటాం’ అని వివరించింది.
నొప్పిని తట్టుకునే వ్యవస్థల్లో స్త్రీలకు, పురుషులకు మధ్య తేడా ఉంటుందని US పరిశోధకులు తెలిపారు. దీర్ఘకాలిక వెన్ను నొప్పిపై అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించామని పేర్కొన్నారు. నొప్పిని తట్టుకునేందుకు పురుషుల శరీరంలో ఎండోజీనస్ ఓపియాయిడ్స్, స్త్రీలలో నాన్-ఓపియాయిడ్స్ విడుదలవుతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నొప్పి చికిత్స కూడా స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఇవ్వాలని వారు స్పష్టం చేశారు.
TG: ఉద్యోగాల్లో <<14392971>>రిజర్వేషన్లు <<>>ఉండాలా? వద్దా? అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చదువులోనూ రిజర్వేషన్లు, మళ్లీ ఉద్యోగాల్లోనూ అవసరమా? మెరిట్(ప్రతిభ) ఆధారంగానే జాబ్స్ ఇవ్వాలని కొందరు అంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల వారు పైకి రావాలంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? మీరేమంటారు?
పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టు కెప్టెన్గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ను నియమించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్తో పీసీబీ ఛైర్మన్ నఖ్వీ చర్చించినట్లు సమాచారం. ఈ నెల 28న రిజ్వాన్ పేరును పీసీబీ అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా బ్యాటింగ్పై మరింత దృష్టి పెట్టేందుకు బాబర్ ఆజమ్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
TN గవర్నర్గా రవిని తొలగించాలని CM స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆయన ‘ద్రవిడియన్ అలర్జీ’తో బాధపడుతున్నారని విమర్శించారు. రవి ఇవాళ హిందీ భాష మాసోత్సవాలకు హాజరయ్యారు. అక్కడ రాష్ట్రగీతం ఆలపించిన బృందం ‘ద్రవిడ’ అనే పదాన్ని స్కిప్ చేసింది. దీంతో గవర్నర్పై స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమిళులను అవమానించడమేనన్నారు. జాతీయ గీతం నుంచి కూడా ద్రవిడ పదం తీసేసే ధైర్యం చేస్తారా అని ప్రశ్నించారు.
టీ20 వుమెన్స్ వరల్డ్ కప్లో రేపు దుబాయ్లో జరగబోయే ఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇంతవరకూ ఏ ఐసీసీ ట్రోఫీ సాధించలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా తొలిసారి ట్రోఫీ సాధించి హిస్టరీ క్రియేట్ చేయనున్నారు. కాగా పురుషుల విభాగంలో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఎప్పుడూ ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీలు సాధించని విషయం తెలిసిందే.
యుద్ధానికి ముగింపు పలికే వరకు ఇజ్రాయెల్ బందీలను వదిలే ప్రసక్తే లేదని హమాస్ తేల్చి చెప్పింది. తమ ప్రాంతంపై దాడులు ఆపి, భద్రతా దళాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. పాలస్తీనా కోసం యాహ్యా సిన్వర్ చివరి వరకు పోరాడి, ప్రాణాలు అర్పించారని తెలిపింది. మరోవైపు హమాస్ తమ బందీలను వదిలి, ఆయుధాలను పక్కనబెట్టిన మరుక్షణమే యుద్ధం ముగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.