India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2026 ఫిబ్రవరి 823 ఏళ్లకోసారి వచ్చే అరుదైన నెల అంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ప్రతి వారం సరిగ్గా 4 సార్లు రావడమే ఇందుకు కారణం. అయితే ఈ ప్రచారం అవాస్తవం. నిజానికి లీప్ ఇయర్ కాని ప్రతి ఏటా FEBలో 28 రోజులే ఉంటాయి. అంటే ప్రతి వారం కచ్చితంగా 4 సార్లే వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆదివారంతో మొదలవడంతో క్యాలెండర్లో తేదీలు క్రమ పద్ధతిలో కనిపిస్తున్నాయి. గతంలో 2015లో ఇలాగే జరగగా, 2037లోనూ రానుంది.

లండన్-బెంగళూరు ఎయిరిండియా విమానంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లో లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బోయింగ్ 787-8 విమానాన్ని గ్రౌండ్ చేశారు. విమాన తయారీ సంస్థ (OEM)తో చెకింగ్ చేయిస్తున్నారు. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA దృష్టికీ తీసుకెళ్లారు. గత ఏడాది 260 మంది మృతికి కారణమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఫ్యూయల్ స్విచ్ సమస్యల వల్లే జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ‘బ్యాగేజ్ రూల్స్ 2026’ ప్రకారం ఏడాదికి పైగా విదేశాల్లో ఉన్న మహిళా ప్రయాణికులు 40g వరకు, పురుషులు 20g వరకు గోల్డ్ జువెలరీని ఎటువంటి పన్ను లేకుండా తీసుకురావచ్చు. సాధారణ వస్తువుల డ్యూటీ-ఫ్రీ లిమిట్ను ₹50,000 నుంచి ₹75,000కు పెంచారు. ఒక కొత్త ల్యాప్టాప్ తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. విదేశీ పర్యాటకుల లిమిట్ కూడా ₹25,000కు పెరిగింది.

కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య సందిగ్ధంలో ఉన్న ట్రేడ్ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. PM మోదీతో US అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు భారత్లోని US రాయబారి సెర్జియో గోర్ Xలో వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూడండని రాసుకొచ్చారు. దీంతో సుంకాలు, H1B వీసాలపై కీలక ప్రకటన వెలువడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇండియా గేట్ ఫొటోతో ట్రంప్ హింట్ <<19033803>>ఇచ్చారంటున్నారు.<<>>

‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజా స్టడీ ప్రకారం.. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పు చాలా ఎక్కువగా ఉంది. బాడీ క్లాక్ దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. వీరికి గుండె జబ్బుల రిస్క్ ఇతరుల కంటే 16% ఎక్కువగా ఉంటోంది. సరైన నిద్ర, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్ అలవాటు కారణంగా ఈ ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లక్ష్యంగా ఆసక్తికర పోస్టు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇది అందమైన విజయోత్సవ తోరణం. USలో ఇంతకంటే గొప్ప కట్టడం నిర్మిస్తాం’ అని రాసుకొచ్చారు. అలాగే న్యూస్ మేకర్స్ ఆఫ్-2025 పేరుతో ‘ఇండియా టుడే’ రిలీజ్ చేసిన మ్యాగజైన్ కవర్ పేజీ పోస్టర్నూ షేర్ చేశారు. INDతో ట్రేడ్ డీల్ సానుకూలంగా జరుగుతోందన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు.

AP: ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇచ్చి, దాని ప్రకారం పోస్టులు భర్తీ చేయడానికి GOVT శాఖల వారీ ఖాళీలపై కసరత్తు చేపట్టింది. రెవెన్యూలో 13,000, విద్యలో 7,000, వర్సిటీల్లో 3000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. PRలో 26,000, మున్సిపల్లో 26,800, అగ్రికల్చర్లో 3,000, స్కిల్ డెవలప్మెంట్లో 4,200 ఖాళీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇతర శాఖల వివరాలూ తెప్పిస్తున్నారు. కాగా 90,000 వరకు ఖాళీలుండొచ్చని అంచనా.

TG: ప్రజల పక్షాన నిలిచి వాళ్ల గళం వినిపించే పార్టీ ఎర్రజెండా అని CM రేవంత్ రెడ్డి కొనియాడారు. కనీస వేతన చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి కమ్యూనిస్టుల ఎన్నో డిమాండ్లను కాంగ్రెస్ పరిష్కరించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఒకే నాణేనికి రెండు వైపులా ఉండే పార్టీల్లా ప్రజలు భావిస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ CPIతో దూరం పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. CEC జ్ఞానేశ్ కుమార్తో మీటింగ్ అనంతరం ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా 58 లక్షల మంది పేర్లను తొలగించారని ఆరోపించారు. ఈ కమిషన్ BJP ఏజెంట్లా పనిచేస్తోందని విమర్శించారు. మరోవైపు TMC కార్యకర్తలు అధికారులపై దాడులు చేస్తున్నారని, BLOలకు గౌరవ వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని EC పేర్కొంది.

T20WC వార్మప్ మ్యాచ్లో USAపై భారత్-A జట్టు 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన అమెరికా చివరి వరకు పోరాడి 200కు ఆలౌటైంది. ఆ జట్టులోని ఆండ్రిస్ 44, సంజయ్ 41, శుభమ్ 28, హర్మీత్ 25, మిలింద్ 18, మోహ్సిన్ 21 రన్స్ చేశారు. రవి బిష్ణోయ్ 3, ఖలీల్, నమన్ చెరో 2 వికెట్లు, తిలక్, అశోక్, బదోనీ తలో వికెట్ తీశారు. కాగా USA జట్టులోని మెజార్టీ ప్లేయర్లు భారత సంతతికి చెందినవారే.
Sorry, no posts matched your criteria.