news

News September 3, 2025

2 వారాల్లో రూ.18కోట్లు చెల్లించండి: సుప్రీం కోర్టు

image

AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అక్రమంగా ఇసుక తవ్వకాలు చేశారంటూ గతంలో జేపీ వెంచర్స్‌కు NGT రూ.18 కోట్లు జరిమానా విధించింది. ఆ ఫైన్‌ను 2 వారాల్లో చెల్లించాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో NGT జరిమానాపై గతంలో విధించిన స్టేను ఎత్తేసింది. ఇసుక తవ్వకాలపై నాగేంద్ర కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన అఫిడవిట్‌ను SC స్వీకరించి విచారణ జరిపింది.

News September 3, 2025

ప్లాట్‌ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ, జొమాటో

image

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో తమ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. ప్లాట్‌ఫామ్ ఫీజులను భారీగా పెంచాయి. స్విగ్గీ దీన్ని మూడు రెట్లు పెంచుతూ ఆర్డర్‌కు రూ.15 చేసింది. GSTతో కలిపి ఈ అమౌంట్‌ను వసూలు చేయనుంది. జొమాటో 20% పెంచుతూ రూ.12 చేసింది. దీనికి GST అదనం. స్విగ్గీ నిత్యం 20 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తుండగా, జొమాటో 23-25 లక్షల వరకు చేస్తోంది.

News September 3, 2025

ఇది సార్.. ధోనీ ‘బ్రాండ్’

image

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా క్రికెటర్ ధోనీ బ్రాండ్ వాల్యూ తగ్గలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అత్యధిక బ్రాండ్లకు(43) అంబాసిడర్‌గా వ్యవహరించిన భారతీయ సెలబ్రిటీ ఆయనే అని TAM AdEx తెలిపింది. షారుఖ్(35), అమితాబ్(28), దీపికా(23) తర్వాతి స్థానాల్లో ఉన్నారని పేర్కొంది. కాగా TVయాడ్స్‌లో రోజులో ఎక్కువగా కనిపించే సెలబ్రిటీల్లో షారుఖ్, ధోనీ తొలి రెండు స్థానాల్లో ఉన్నారని వెల్లడించింది.

News September 3, 2025

AP న్యూస్ రౌండప్

image

* తురకపాలెం <<17599008>>మరణాలపై<<>> మంత్రి సత్యకుమార్ ఫోకస్.. ఫీవర్, ఇన్ఫెక్షన్ కేసులపై ఆరా తీస్తున్న వైద్యబృందం
* టీటీడీ ఆసుపత్రుల్లో సేవ చేసేందుకు భక్తులకు అవకాశం: బీఆర్ నాయుడు
* విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం: బొత్స సత్యనారాయణ
* ముగిసిన ఐపీఎస్ అధికారి సంజయ్ రెండో రోజు ACB కస్టడీ.. విజయవాడ జైలు అధికారులకు అప్పగింత

News September 3, 2025

రేవంత్ వెనుక మోదీ, చంద్రబాబు ఉన్నారు: జగదీశ్ రెడ్డి

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ‘రేవంత్ వెనుక మోదీ, చంద్రబాబు ఉన్నారు. KCR గెలిస్తే దేశ రాజకీయాల్లోకి వస్తారని వారి భయం. కరెంట్‌, యూరియా ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రతిపక్షంగా మా బాధ్యతను పూర్తిగా నిర్వహించడం లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎక్కువగా ప్రశ్నించాల్సి ఉంది’ అని ఆయన అన్నారు.

News September 3, 2025

జగన్‌పై లోకేశ్ విషప్రచారం చేయిస్తున్నారు: అంబటి

image

AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి లోకేశ్ విష ప్రచారం చేయిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘జగన్ తన తల్లి విజయమ్మను అవమానించారని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. జూ.ఎన్టీఆర్ తల్లిని లోకేశ్ తిట్టించారు. భవిష్యత్తులో పోటీకి వస్తాడని ఆయన భయపడుతున్నారు. శని, ఆదివారం లోకేశ్ ఎటు వెళ్తున్నాడో త్వరలో చెబుతా. యూరియా కొరతపై 9న RDO కార్యాలయాల ముందు నిరసన తెలుపుతాం’ అని అంబటి తెలిపారు.

News September 3, 2025

PHOTOS: ఉత్తరాదిలో వర్ష బీభత్సం

image

కుండపోత వర్షాలతో ఉత్తర భారతం వణికిపోతోంది. పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌, ఢిల్లీలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంజాబ్, చండీగఢ్‌, హిమాచల్‌లో ఈనెల 7 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్‌తో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

News September 3, 2025

యంగ్ ఏజ్‌లోనే ఓల్డ్ లుక్ కనిపిస్తోందా?

image

కొందరికి చిన్న వయసులోనే ముడతలు వచ్చి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. పోషకాహారం తీసుకుంటే నవ యవ్వనంతో మెరిసిపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘టమాటాలు తీసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది. బ్లూ చెర్రీ, గ్రీన్ టీతో కొత్త చర్మకణాలు ఉత్పత్తి అవుతాయి. పెరుగు తింటే చర్మం ఎర్రగా మారదు. బాదం, పిస్తా వంటివి తింటే చర్మ సమస్యలు తగ్గుతాయి. నీళ్లు ఎక్కువగా తాగితే యవ్వనంగా కనిపిస్తారు’ అని అంటున్నారు.

News September 3, 2025

రుషికొండ ప్యాలెస్‌‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చాలి: అశోక్

image

AP: నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చడం మంచిదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సలహా ఇచ్చారు. ఆ భవనంలో పెచ్చులు ఊడాయని తెలిసిందన్నారు. ఈ ప్యాలెస్‌ను ఏం చేస్తే మంచిదో ప్రజలే చెప్పాలని ఆయన కోరారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో క్షత్రియ సేవా సమితి విశాఖలో అశోక్ గజపతిరాజును సత్కరించింది.

News September 3, 2025

హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు

image

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగి PSలో మరోసారి కేసు నమోదైంది. జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబసభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సీపీ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.