India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

APలో పంచాయతీ పాలక వర్గాలకు 2026 MAR వరకు గడువుండగా, MPTC, ZPTCల పదవీకాలం SEPతో ముగియనుంది. FEB, MARలో SSC, ఇంటర్ పరీక్షలు ఉండటంతో ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగొచ్చు. పరిషత్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం SEP/OCTలో జరగొచ్చని అంచనా. కాగా రిజర్వేషన్ల ఖరారు కోసం వచ్చే నెలలో ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది. అధ్యయనం, అభిప్రాయ సేకరణ అనంతరం కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారవుతాయి.

ఎత్తైన శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠిస్తే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు.
☛ లింగం నుంచి నిత్యం శక్తి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి పైనుంచి చిన్న నీటి ప్రవాహమైనా ఉండాలి. ☛ రోజూ సాత్విక నైవేద్యం పెట్టాలి. ☛ ఇంట్లో మాంసాహారం వండకూడదు. ఇంట్లో వారెవరూ మద్యమాంసాలు ముట్టుకోకూడదు. ☛ ఓ ఇంట్లో 2 లింగాలను ప్రతిష్ఠించకూడదు. ☛ శివలింగం ఉన్న పూజా మందిరం పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి.

TG:<

AP: ద.అండమాన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా బలపడనుందని APSDMA వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా మారుతుందని తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అంచనా వేసింది. వీటి ప్రభావంతో నేడు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.

సౌతాఫ్రికా వేదికగా జరిగిన జీ20 సమ్మిట్ ముగిసింది. దీంతో ప్రధాని మోదీ భారత్కు తిరుగు పయనమయ్యారు. సదస్సు విజయవంతగా ముగిసిందని ఆయన ట్వీట్ చేశారు. వివిధ దేశాధినేతలతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. సమ్మిట్ చివరిరోజు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీ భేటీ అయ్యారు. ఉగ్రవాదానికి నిధులు అందకుండా అడ్డుకోవడానికి ఇరుదేశాలు ఉమ్మడిగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

పరమ శివుడికి విభూది అంటే చాలా ఇష్టం. దీన్నే భస్మం అని కూడా అంటారు. భస్మం మన పాపాలను ప్రక్షాళన చేస్తుందని నమ్ముతారు. హోమంలో భగవంతునికి సమర్పించిన గంధపు చెక్కలు, నెయ్యి, ఇతర ఔషధాల నుంచి భస్మం తయారవుతుంది. దీన్ని ధరిస్తే.. జనన మరణ పరిధుల నుంచి బయటపడతామని, అహంకారం అంతమవుతుందని నమ్ముతారు. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

AP: వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి 29వ తేదీ వరకు ‘రైతన్నా.. మీకోసం’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో ప్రభుత్వం పంచ సూత్రాల విధానాన్ని ప్రవేశపెట్టింది. వీటి అమలుతో సాగులో కలిగే మేలుపై రైతుల ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఆక్వా, ఉద్యాన అధికారులు వివరించనున్నారు.

AP: ప్రభుత్వ జూ.కాలేజీల్లో పాస్ పర్సంటేజ్ పెంచేందుకు ఇంటర్ విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ‘సంకల్ప్’ పేరిట నేటి నుంచి కాలేజీల్లో 50 రోజుల కార్యాచరణను అమలు చేయనుంది. దీనిలో భాగంగా విధ్యార్థులను అభ్యసన సామర్థ్యాల ఆధారంగా A, B, C కేటగిరీలుగా విభజిస్తారు. ఉ.9.10 నుంచి మ.12.40 రెగ్యులర్ సిలబస్ బోధిస్తారు. A కేటగిరీ విద్యార్థులకు రివిజన్, B,C కేటగిరీల వారికి రోజూ ఒక లాంగ్, 2 షార్ట్ ఆన్సర్స్ నేర్పిస్తారు.

తండ్రి శ్రీనివాస్కు హార్ట్ ఎటాక్ రావడంతో క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి చివరి నిమిషంలో <<18368671>>ఆగిపోయిన<<>> విషయం తెలిసిందే. పెళ్లి పనుల ఒత్తిడితోనే గుండెపోటు వచ్చినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తుండగా ‘యాంజియోగ్రామ్’ చేయాలని నిర్ణయించారు. దీంతో శ్రీనివాస్ కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో స్మృతి పెళ్లి ఎప్పుడనేదానిపై కుటుంబీకులు తర్వాత డిసైడ్ చేయనున్నారు.

దీపారాధనలో కాలిపోయిన వత్తిని చాలామంది పడేస్తుంటారు. కానీ, దానిలో ఎంతో సానుకూల శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘కాలిన 10 వత్తులలో కర్పూరం వెలిగించి, అందులో 4 లవంగాలు వేసి దూపంలా తయారుచేసుకోవాలి. ఆ పొగను ఇల్లు అంతటా వ్యాపించేలా చేస్తే.. ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ బయటకి వెళ్లిపోతాయి. ఆ బూడిదను దిష్టి తీయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది’ అని అంటున్నారు.
Sorry, no posts matched your criteria.