news

News September 4, 2024

ఏపీలో వరద నష్టం అంచనాకు నిపుణుల బృందం

image

AP: భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది. దీంతో నష్టం అంచనాకు కేంద్ర హోంశాఖ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు. త్వరలోనే ఈ బృందం రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు.

News September 4, 2024

రెండు రోజులు సెలవులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

image

తెలంగాణలో ఈనెల 7, 17న సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7న గణేశ్ చతుర్థి, 17న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. హాలీడే క్యాలెండర్ ప్రకారం 16న మిలాద్ ఉన్ నబీకి సర్కార్ సెలవు ఇచ్చింది. కానీ నెలవంక దర్శనం తేదీని బట్టి దాన్ని17కు మార్చినట్లు తెలిపింది. అదేరోజు హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం జరగనుంది. దీంతో 2 కార్యక్రమాల కోసం సెలవు ఇచ్చినట్లయింది.

News September 4, 2024

గ్రేట్: 185మంది పేదపిల్లలకు అతడు అండాదండ..!

image

ఢిల్లీకి చెందిన అమిత్ లాథియా ఓ సాదాసీదా కానిస్టేబుల్‌. అయితేనేం.. 12 ఏళ్లుగా ప్రతి నెలా తన జీతం వెచ్చించి నిరుపేద పిల్లలకు అండగా నిలుస్తున్నారు. పనులు చేసుకునే 185మంది పిల్లలు ఆయన చలవతో నేడు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేద విద్యార్థులను గుర్తించడం, ఉచితంగా ఆహారం, నివాసం, స్టడీ మెటీరియల్స్ అందించి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం.. ఇదే అమిత్ పని. తన భార్య కూడా ఈ విషయంలో ఆయనకు అండగా ఉన్నారు.

News September 4, 2024

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు

image

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓ పార్టీ నుంచి గెలిచిన MLAలు మరో పార్టీలోకి మారకుండా తెచ్చిన కొత్త బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపింది. దీని ప్రకారం ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన MLAలకు పెన్షన్ రద్దు కానుంది. వారి జీవితంలో ఏ సమయంలోనైనా పార్టీ మారితే ఇది వర్తిస్తుంది.

News September 4, 2024

నేటి నుంచి భారీ వర్షాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురవనుండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వాగులు, వంకలు, జలాశయాలు, నదుల దగ్గరకు వెళ్లొద్దు. మ్యాన్ హోల్స్‌ను చూసుకుని నడవాలి. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు తాకవద్దు. వాహనాలను పరిమిత వేగంతో నడపాలి. వాతావరణ నిపుణుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అనుసరించాలి. విపత్కర సమయాల్లో 040-21111111 నంబరును సంప్రదించాలి.

News September 4, 2024

నొప్పులు, గాయంతోనే తారక్ డాన్స్: రత్నవేలు

image

‘దేవర’ నుంచి తాజాగా రిలీజైన దావూదీ సాంగ్‌లో ఎన్టీఆర్ స్టెప్పులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ స్టెప్స్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ కండరాల నొప్పులు, గాయాలతో బాధపడ్డారని ఆ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్విటర్లో తెలిపారు. ‘అంత నొప్పిలోనూ తారక్ చాలా అలవోకగా డాన్స్ వేసేశారు. ఆయనకు హ్యాట్సాఫ్’ అని ట్వీట్ చేశారు. ‘దేవర’ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

News September 4, 2024

భారీ వర్షాలు.. బస్సులు ఎక్కే వారికి శుభవార్త

image

TG: భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రయాణించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ మార్గంలో టికెట్ ధరలో 10శాతం రాయితీ ఇస్తున్నట్లు TGSRTC ప్రకటించింది. రాజధాని, ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ కోసం https://tgsrtcbus.inని సంప్రదించాలని కోరింది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

News September 4, 2024

చరిత్రలో తొలిసారి పడిపోయిన IPL విలువ

image

చరిత్రలో తొలిసారి IPL ఎంటర్‌ప్రైజ్ విలువ పడిపోయిందని D&P అడ్వైజరీ రిపోర్టు పేర్కొంది. నిరుడు రూ.92,500 కోట్లుగా ఉన్న విలువ 10.6% తగ్గి రూ.82,700 కోట్లకు చేరిందని వెల్లడించింది. డిస్నీ, రిలయన్స్ విలీనం, ప్రసార హక్కులన్నీ వారివద్దే ఉండటం, మీడియా హక్కులకు పోటీ తగ్గడం కారణాలని చెప్పింది. ఇప్పటికీ MI అత్యంత విలువైన ఫ్రాంచైజీ అని, CSK తర్వాతి స్థానంలో ఉందంది. WPL విలువ 8% ఎగిసి ₹1,344 కోట్లకు చేరింది.

News September 4, 2024

15ఏళ్ల బాలుడు వేధించాడు: నటి ఉర్ఫీ

image

విభిన్న వస్త్రధారణతో తరచూ వార్తల్లో నిలిచే హిందీ నటి ఉర్ఫీ జావేద్ తాను ఓ బాలుడి చేతిలో వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘‘నిన్న నాకు, నా ఫ్యామిలీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఫొటోలు దిగుతుండగా అటుగా ఓ కుర్రాళ్ల గుంపు వెళ్లింది. అందులో ఓ వ్యక్తి ‘నీ బాడీ కౌంట్ ఎంత?’ అని అందరిముందు అరిచాడు. అతడికి నిండా 15ఏళ్లు కూడా లేవు’’ అని వాపోయారామె.

News September 4, 2024

ఏపీలో భారీ వరదలు.. రూ.120 కోట్ల విరాళం

image

AP: రాష్ట్రంలో వరద బాధితులకు సహాయం అందించేందుకు ఎన్జీవో నేతలు ముందుకొచ్చారు. ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పే ద్వారా రూ.120 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు సీఎం చంద్రబాబును కలిసి అంగీకార పత్రాన్ని అందజేశారు. అటు తెలంగాణలోనూ ఉద్యోగులు వరద బాధితులకు రూ.100 కోట్ల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.