news

News September 4, 2024

UKలో పాన్ ఉమ్మిన వారికి రూ.16,500 ఫైన్

image

దేశంలో అద్భుత కట్టడాలను సైతం కొందరు పాన్ పరాక్ ఉమ్ముతూ అపరిశుభ్రంగా తయారుచేస్తున్నారు. అయితే, ఇలాంటి వారు యూకేలోనూ ఉన్నారు. వీరికి భారీగా జరిమానాలు విధించేందుకు అక్కడి పోలీసులు సిద్ధమయ్యారు. లైసెస్టర్ నగరంలో రోడ్లపై పాన్ ఉమ్మడాన్ని అపరిశుభ్రత, అసాంఘిక చర్యగా భావిస్తూ 150 పౌండ్లు (రూ.16,500) ఫైన్ విధిస్తామని బోర్డులు ఏర్పాటు చేశారు. ఇండియాలో ఇలా చేస్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి.

News September 4, 2024

వరదల్లో 29 మంది చనిపోయారు: పవన్ కళ్యాణ్

image

AP: రాష్ట్రంలో సంభవించిన వరదల్లో 29 మంది మరణించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇద్దరు గల్లంతైనట్లు పేర్కొన్నారు. వరద బాధితుల కోసం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే సీఎంకు అందజేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో లోపం ఉందన్నారు. 253 ప్రాంతాలు నీట మునిగితే 100కు పైగా యథాస్థితికి వచ్చాయన్నారు. 45 వేల మంది ప్రజలకు సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.

News September 4, 2024

బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాం: చంద్రబాబు

image

AP: వర్షాల కారణంగా బుడమేరుకు పడిన గండ్లను ఇంకా పూడ్చలేకపోయామని CM చంద్రబాబు తెలిపారు. విజయవాడలో CM మీడియాతో మాట్లాడారు. ‘వరద బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని పంచుతున్నాం. 100కుపైగా ఫైరింజన్లతో బురద క్లీన్ చేస్తున్నాం. మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం. 2,100 మంది పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. 32 మంది IASలు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

News September 4, 2024

కంగనా ‘ఎమర్జెన్సీ’ విడుదల వాయిదా!

image

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన <<13976222>>‘ఎమర్జెన్సీ’<<>> మూవీకి బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ విషయమై ఈ నెల 18లోపు నిర్ణయం తీసుకోవాలని CBFCకి కోర్టు సూచించింది. దీంతో ఈ నెల 6న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడనుంది.

News September 4, 2024

రాజస్థాన్ రాయల్స్‌ హెడ్ కోచ్‌గా ద్రవిడ్?

image

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ద్రవిడ్, ఫ్రాంచైజీ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అలాగే ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కుమార సంగక్కర, అసిస్టెంట్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ ఎంపికైనట్లు తెలుస్తోంది. కాగా 2012, 13 సీజన్లలో ద్రవిడ్ ఆర్ఆర్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014, 15 సీజన్లలో ఆ జట్టు మెంటార్‌గా సేవలందించారు.

News September 4, 2024

తెలంగాణకు పవన్ రూ.కోటి విరాళం

image

AP: విపత్తు సమయంలో తెలంగాణకు తన వంతుగా రూ.కోటి విరాళం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేస్తానని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు. అంతకుముందు పవన్ ఏపీకి రూ.కోటి విరాళం ప్రకటించారు.

News September 4, 2024

4G కోసం BSNLకు మరో రూ.6000 కోట్లు

image

BSNLకు మరో రూ.6వేల కోట్లు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. కస్టమర్లను పోగొట్టుకోకుండా వేగంగా 4G నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లక్ష 4G సైట్లు నెలకొల్పేందుకు కంపెనీ నిరుడు రూ.19వేల కోట్లతో TCS, ITIకి ఆర్డర్లు ఇచ్చింది. రూ.13వేల కోట్లే చెల్లించడంతో మరో రూ.6వేల కోట్లు అవసరం అయ్యాయి. 2019 నుంచి BSNL, MTNLలో కేంద్రం రూ.3.22 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.

News September 4, 2024

నీలోఫర్‌లో కేఫ్‌లో లేబుల్స్ లేని ఫుడ్స్!

image

TG: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్‌లో కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లకు కూడా లేబుల్ చేయలేదు. దీంతోపాటు వంటగదిలో ఎక్స్‌పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.

News September 4, 2024

సంచలనం: సెబీ చీఫ్‌ మాధబిపై ఉద్యోగుల ఫిర్యాదు!

image

సెబీ చీఫ్ మాధబీ బుచ్‌పై ఉద్యోగులు ఫైనాన్స్ మినిస్ట్రీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆమె నాయకత్వ శైలి వల్ల పని సంస్కృతి చెడిందని ఆగస్టు 6న లేఖ రాశారని ET రిపోర్టు చేసింది. ‘సమావేశాల్లో మాపై అరుస్తారు. తిడతారు. అందరి ముందూ అవమానిస్తారు. ఆమెపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రతి క్షణం మా కదలికలపై నిఘా పెడుతున్నారు’ అని 500 మంది సీనియర్లు సంతకాలు చేసి లేఖను పంపినట్టు తెలిసింది.

News September 4, 2024

మరణించిన ఏడాదికి అంత్యక్రియలు

image

నైజీరియా జాతీయ జెండా రూపకర్త ప తైవో మైఖేల్ అకింకున్మీ మరణించిన ఏడాది తర్వాత ఆయన కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. 1950ల్లో లండన్‌లో చదివేటప్పుడు ఆకుపచ్చ, తెలుపు రంగులతో జాతీయ జెండాను రూపొందించిన మైఖేల్ 87ఏళ్ల వయసులో 2023 Aug 29న మరణించారు. అయితే అప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ అమలు కాలేదు. దీంతో ఏడాది పాటు మృతదేహాన్ని మార్చురీలోనే ఉంచాల్సి వచ్చింది.