India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రెడ్క్రాస్ సొసైటీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన విచక్షణ నిధుల్లో నుంచి రూ.30 లక్షలు ఇచ్చారు. ‘తక్షణ వరద సాయం చేయండి. రెడ్క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, NSS, NGOలు సాయంలో భాగస్వామ్యం కావాలి. వరదల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజలకు సీఎం భరోసా ఇచ్చారు. బాధితులకు అధికారులు అన్ని విధాలుగా అండగా ఉండాలి’ అని గవర్నర్ ఆదేశించారు.
యూఎస్లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వయసుల వారీగా నిద్రపోయే విషయంలో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. నవజాత శిశువులు: 14-17 గంటలు*శిశువులు: 12-16 గంటలు*పసిబిడ్డలు: 11-14 గంటలు*ప్రీస్కూలర్లు: 10-13 గంటలు*పాఠశాల వయస్సు పిల్లలు: 9-12 గంటలు*టీనేజర్స్: 8-10 గంటలు*యువకులు-పెద్దలు (18-60 ఏళ్లు): 7 లేదా అంతకంటే ఎక్కువ *60+ వాళ్లు 7-9 గంటలు నిద్రపోవాలని సూచించింది.
ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ ‘అట్లాస్’ మాజీ చీఫ్ సలీల్ కపూర్(70) ఢిల్లీలోని తన నివాసంలో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కొందరు తనను వేధింపులకు గురిచేయడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు లేఖలో పేర్కొన్నారు. గతంలో ఆయన ఫ్యామిలీ మెంబర్ నటాషా ఆత్మహత్యకు పాల్పడ్డారు. 1950లో అట్లాస్ను జానకీదాస్ కపూర్ స్థాపించగా 2020లో ఆర్థిక కారణాలతో మూతపడింది.
AP: వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. NTR జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఏలూరు(D) పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అన్ని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. బాపట్ల జిల్లాలో భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లోని స్కూళ్లకు మాత్రమే సెలవు ఇచ్చారు. మిగతా చోట్ల యథావిధిగా స్కూళ్లు నడవనున్నాయి. తెలంగాణలో ఏ జిల్లాలోనూ సెలవు ప్రకటించలేదు.
దేశ సైనిక సామర్థ్యాలను పెంచడానికి ₹1.45 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కౌన్సిల్ సైన్యానికి అధునాత వాహనాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం కీలక వనరులు, పరికరాల కల్పనకు 10 ప్రతిపాదనలను ఆమోదించింది. వీటి దిగుమతుల కంటే దేశీయ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
ఇంగ్లండ్ వన్డే, టీ20 హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ను ఆ దేశ క్రికెట్ బోర్డు నియమించింది. వచ్చే ఏడాది జనవరిలో భారత్తో జరిగే సిరీస్ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయన ఆ జట్టు టెస్టు కోచ్గా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. కాగా మెక్కల్లమ్ను అన్ని జట్లకు కోచ్గా నియమించడంతో ఒక్కో ఫార్మాట్కు ఒక్కో కోచ్ విధానానికి ఇంగ్లండ్ స్వస్తి పలికినట్లైంది.
TG: ఇటీవల సంభవించిన వరదలకు రాష్ట్రంలో 31 మంది మరణించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు వారి వివరాలతో కూడిన జాబితాను ఆయన Xలో పోస్ట్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైనట్లు కనిపిస్తోందన్నారు. చావుని అబద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవ్వరూ క్షమించరన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీరిలీజైన ‘గబ్బర్ సింగ్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఒక్కరోజులోనే ఈ సినిమాకు రూ.7.2 కోట్లు వచ్చినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఓ రీరిలీజ్ మూవీ ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం ఇదే తొలిసారని చెబుతున్నాయి. ఇప్పటివరకూ సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన ‘మురారి’ సినిమా తొలిరోజు రూ.5.45 కోట్లు కలెక్ట్ చేయగా దీనిని బీట్ చేసిందని తెలిపాయి.
బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో క్లీన్స్వీప్కు గురైన పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు WTC ఫైనల్కు చేరడం కష్టంగా మారింది. బంగ్లాపై పేలవ ప్రదర్శన కారణంగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఎనిమిదో స్థానానికి దిగజారింది. జరగబోయే టెస్టుల్లో విజయం సాధించినా టాప్-2లోకి చేరడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ జట్టు WTC ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లేనని అంటున్నారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపులు ఇటీవల కలకలం రేపాయి. తాజాగా ఓ నటి హీరో నివిన్ పౌలి తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నివిన్తో పాటు మరో ఐదుగురిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఈ ‘ప్రేమమ్’ హీరో కొట్టిపారేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు.
Sorry, no posts matched your criteria.