news

News September 3, 2024

తెలుగు రాష్ట్రాలకు రూ.కోటి విరాళం ప్రకటించిన బాలయ్య

image

సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కి రూ.50 లక్షల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. తన బాధ్యతగా బాధిత ప్రజలకు సాయం చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జూ.ఎన్టీఆర్, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ తమ వంతుగా విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

News September 3, 2024

పుట్టినరోజు వేడుకలకు నేను దూరం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

AP: రేపు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. భారీ వరదలతో రాష్ట్రం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని, అందుకే వేడుకలకు దూరంగా ఉంటున్నానని చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తనను కలవొద్దని సూచించారు. వీలైతే వరద బాధితులకు సాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News September 3, 2024

వరదల్లో 28 మంది మరణిస్తే 16 అని చెప్పారు: హరీశ్ రావు

image

TG: సాయం చేయలేదని ప్రశ్నించిన తమపై దాడి చేస్తారా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వరదల్లో 28 మంది చనిపోతే కేవలం 16 మంది చనిపోయారని చెప్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. వరదలు వచ్చిన రోజు సీఎం ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలయ్యారని అన్నారు.

News September 3, 2024

మంచి మనసు చాటుకున్న టెన్త్ అమ్మాయి సింధు(PHOTO)

image

TG: మహబూబాబాద్ జిల్లాకు చెందిన టెన్త్ విద్యార్థిని ముత్యాల సాయి సింధు మంచి మనసు చాటుకుంది. రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3వేలను సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. దీంతో సింధును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇది చిన్న సాయమే అయినా సింధుది గొప్ప మనసంటూ నెటిజన్లు సింధును సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు.

News September 3, 2024

దాతల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు

image

AP: ఊహించని వర్షాలు, వరదలతో బెజవాడ నగరం గజగజ వణికింది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లక్షలమంది కడుపు నింపేందుకు స్థానిక హోటళ్లు, అక్షయపాత్ర, ఇతర సంస్థల సాయంతో ప్రభుత్వం ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తోంది. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకుంటున్న వారి కోసం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. IAS శ్రీమనజీర్ 7906796105ను సంప్రదించాలని సూచించింది.

News September 3, 2024

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి: హరీశ్ రావు

image

TG: ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఖమ్మంలో వరద నష్టం తగ్గేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకమేటలు పెట్టిన ప్రాంతాల్లో రూ.50వేల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

News September 3, 2024

8వ వేతన సంఘంపై Update

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేత‌న సంఘం 2025లో ఏర్ప‌డే అవ‌కాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాటి సిఫార్సులు 2026లోనే కార్య‌రూపం దాల్చే ప‌రిస్థితి కనిపిస్తోంది. 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్(FF) ఆధారంగా కనీస వేతనం, పెన్షన్లలో మార్పులు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దాని ప్రకారం కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.21,600కి పెరగొచ్చు. పెన్షన్ రూ.17,280 అవ్వొచ్చు.

News September 3, 2024

WTC ఫైనల్ షెడ్యూల్ ఖరారు

image

WTC-2025 ఫైనల్ షెడ్యూల్‌ను ICC ఖరారు చేసింది. వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. 16న రిజర్వ్‌డ్ డేను ప్రకటించింది. కాగా WTC ఫైనల్ దాదాపుగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు జట్లే పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియా WTC ఫైనల్ విజేతలుగా నిలిచాయి.

News September 3, 2024

అసలు కేసీఆర్ ఉన్నాడా?: CM రేవంత్

image

TG: BRS అధినేత కేసీఆర్‌పై CM రేవంత్ విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో వరదలు వచ్చినప్పుడు ప్రజలను పరామర్శించేందుకు కేసీఆర్ ఒక్క రోజైనా గ్రామాల్లోకి వచ్చారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా భారీ వరదలు వస్తే పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వరదల్లో తిరుగుతుంటే ఇక్కడ కేసీఆర్ మాత్రం స్పందించట్లేదన్నారు. ‘అసలు ప్రతిపక్షనేత ఉన్నాడా?. ఉంటే ఎందుకు కనిపించడం లేదు?’ అని MHBDలో మాట్లాడారు.

News September 3, 2024

చవితికి ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్డేట్

image

వినాయక చవితిరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు ‘గేమ్ ఛేంజర్’ చిత్ర మేకర్స్ సిద్ధమయ్యారు. ఈనెల 7న సినిమా విడుదల తేదీతో కూడిన పోస్టర్‌ను పంచుకునేందుకు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, టీజర్ కూడా ఈనెల చివరలో రిలీజ్ అవుతుందని, డిసెంబర్ 20న ‘గేమ్ ఛేంజర్’ థియేటర్లలో విడుదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి.