India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత ప్రధాని బ్రూనై పర్యటన నేపథ్యంలో ఆ దేశ సుల్తాన్ హస్సనల్ బోల్కియా విలాసవంతమైన జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సుల్తాన్కు ఉన్న కార్ల పిచ్చితో ఏకంగా 7,000 కార్లు సేకరించారు. అందులో 600 రోల్స్ రాయిస్, 450 ఫెరారీ, 380 బెంట్లీ కార్లు ఉన్నాయి. వీటి విలువ ఏకంగా ₹4,15,00,00,00,000. అంటే 5 బిలియన్ డాలర్లు. ఆయిల్ & గ్యాస్ నిక్షేపాల నుంచి సమకూరే ఆదాయంతో ఆయన ఆస్తి విలువ $30 బిలియన్.
పారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే వివిధ క్రీడల్లో 15 మెడల్స్ సాధించడంతో భారత్ 15వ స్థానంలో నిలిచింది. ముగ్గురికి గోల్డ్, ఐదుగురికి సిల్వర్, ఏడుగురికి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. గోల్డ్ మెడల్స్ పెరిగితే టాప్-10లో చోటు దక్కే అవకాశం ఉంది. తాజాగా జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ గోల్డ్ సాధించారు. కాగా ఒలింపిక్స్లో భారత్కు 6 మెడల్స్ రావడంతో 71వ స్థానంతో సరిపెట్టుకుంది.
పాకిస్థాన్కు సొంత గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్ చేతిలో రెండో టెస్టులోనూ ఓడిపోయింది. రెండో ఇన్నింగ్సులో 185 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్పై బంగ్లాకు ఇదే తొలి టెస్టు సిరీస్ విజయం.
స్కోర్లు: పాక్ 274& 179; బంగ్లా 262& 185
TG: మహబూబాబాద్ జిల్లాలో నలుగురు మరణించడం బాధాకరమని CM రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. రైతులను ఆదుకుంటామన్నారు. అధికారులు, పోలీసు సిబ్బంది నిరంతరం సహాయక చర్యల్లో పాల్గొనడం వల్లే ప్రాణ నష్టం తగ్గిందన్నారు. కేంద్రం తక్షణమే రాష్ట్రానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వర్షం తగ్గడంతో బురదను తొలగించే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
AP: వరద నివారణ, సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయంలో బాధితుల అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు వరద నివారణ, సహాయక చర్యలను చేపడుతున్నామని టీడీపీ అంటోంది. బాధితులందరికీ సాయం చేస్తున్నామని, దీనిపై అనవసర రాద్ధాంతం చేయొద్దని విమర్శిస్తోంది.
AP: వరద బాధితులకు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తన భార్య, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు. కాగా వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునేవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఐఏఎస్ అధికారి మన్జీర్(79067 96105)ను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది.
AP: రాబోయే 2, 3 రోజుల్లో కృష్ణా నదికి వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ద్రోణి ప్రభావంతో కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు కురుస్తుండగా, మరోవైపు కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలకు వరద పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
TG: HYDలోని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న ‘హైడ్రా’ విస్తరణపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం. దీనివల్ల తీరని నష్టం జరుగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి హైడ్రాను తీసుకొచ్చాం. దీన్ని జిల్లాలకూ విస్తరించాలని డిమాండ్ వస్తోంది. అక్కడి అధికార యంత్రాంగమే సిస్టమ్ను ఏర్పాటుచేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పోనీటెయిల్స్ను నిషేధించారని తెలిసింది. ఎవరైనా అలాంటి హెయిర్స్టైల్తో పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష తప్పదు. శత్రువులపై యుద్ధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సెమీ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్, జీన్స్, రంగేసుకున్న, పొడవు జుట్టు, బిగుతు దుస్తుల వంటి దక్షిణ కొరియా ప్యాషన్లు తన దేశంలో కనిపించొద్దనేదే కిమ్ లక్ష్యమని సమాచారం.
AP: రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కాకినాడ, తూ.గో, కోనసీమ, యానాం, ఏలూరు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.