India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇన్స్టాలో పరిచయమైన బాలికను ఓ యువకుడు 20 రోజులుగా గదిలో బంధించిన ఘటన HYDలో వెలుగుచూసింది. భైంసాకు చెందిన బాలికకు ఇన్స్టాలో యువకుడితో పరిచయమైంది. అతడి ట్రాప్లో పడ్డ ఆమె నగరానికి వచ్చింది. బాలికను అతడు నారాయణగూడలోని హోటల్ గదిలో 20 రోజులు బంధించాడు. చివరికి ఎలాగోలా ఆమె పేరెంట్స్కి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేసింది. వారు పోలీసులను ఆశ్రయించడంతో షీ టీమ్స్ రక్షించాయి. యువకుడిపై క్రిమినల్ కేసు నమోదైంది.
ఒలింపిక్స్లో తన అనర్హత వేటుపై ఆనందిస్తున్నవారిని దేశద్రోహులుగా పరిగణించి విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత, రెజ్లర్ వినేశ్ ఫొగట్ డిమాండ్ చేశారు. ‘నేను గెలవలేదని హ్యాపీ అవుతున్నారంటే అది దేశద్రోహమే. వారు దేశాన్ని, జాతిని అగౌరవపరిచినట్లే’ అని పేర్కొన్నారు. దేవుడు శిక్షించడం వల్లే వినేశ్ ఒలింపిక్స్లో ఓడారంటూ WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
భారత్లో తలదాచుకున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను వెనక్కి రప్పిస్తామని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తైజుల్ ఇస్లామ్ పేర్కొన్నారు. అందుకోసం అవసరమైన చర్యల్ని తీసుకుంటామని మీడియాతో అన్నారు. ‘ఆమె అప్పగింత విషయంలో భారత్తో ఉన్న ఒప్పందాలను అనుసరిస్తాం. జులై, ఆగస్టులో విద్యార్థుల నిరసనల సమయంలో సామూహిక హత్యలు చేయించినట్లు హసీనాపై ఆరోపణలున్నాయి’ అని తెలిపారు.
భారత క్రికెట్ నేడు అత్యంత శక్తిమంతమైన స్థాయికి చేరుకుందని మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఓ కార్యక్రమంలో కొనియాడారు. దేశం నలుమూలల నుంచీ నైపుణ్యం వెలుగులోకి రావడమే అందుకు ప్రధాన కారణమన్నారు. ‘మా సమయంలో క్రికెటర్లు ప్రధాన నగరాల నుంచి మాత్రమే ఉండేవారు. మారుమూల ప్రాంతాల్లో మంచి ఆటగాళ్లు ఉన్నా వారికి పైకొచ్చే మార్గం ఉండేది కాదు. ప్రస్తుతం మన దేశవాళీ క్రికెట్ అత్యంత బలంగా ఉంది’ అని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్తో జరగనున్న తొలి టెస్ట్కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్కు టీమ్లో చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ను పక్కనపెట్టారు.
జట్టు: రోహిత్(C), జైస్వాల్, గిల్, కోహ్లీ, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, పంత్, జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా, యశ్ దయాల్.
** ఈనెల 19 నుంచి చెన్నైలో తొలి టెస్ట్ జరగనుంది.
AP: భారీ వర్ష సూచన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడతాయని చెబుతున్నారు. పిఠాపురం ప్రాంతం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో కృష్ణానదికి వరద వచ్చింది. బుడమేరు కబ్జాల వల్ల లక్షల మంది ఇబ్బంది పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి’ అని తెలిపారు.
TG: చాలాచోట్ల రూ.లక్షలు ఖర్చుపెట్టి వినాయక మండపాల సెట్లు వేశారు. కానీ ఈ సెట్ మాత్రం భిన్నం. వనపర్తి జిల్లా రేవల్లిలో కొందరు యువకులు వాటర్ ట్యాంక్ కింద గణపయ్యను ప్రతిష్ఠించారు. 20 ఏళ్ల కిందట ట్యాంక్ ఉన్న ప్లేస్లో వినాయకుడిని పెట్టేందుకు యత్నించగా వరదతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత అక్కడ ట్యాంక్ నిర్మించడంతో అప్పటి నుంచి ఇలా దాని కిందే గణనాథుడి మండపం ఏర్పాటు చేస్తున్నారు. ఐడియా అదిరింది కదూ!
పాకిస్థాన్తో సంధికి భారత్ సిద్ధంగానే ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూకశ్మీర్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘వారితో మంచి బంధం మాకూ ఇష్టమే కానీ ముందు వారు ఉగ్రవాదాన్ని ఆపాలి. అప్పుడు కచ్చితంగా సంబంధాలు పునరుద్ధరిస్తాం. స్నేహితుల్ని మార్చుకోగలం కానీ ఇరుగుపొరుగువారిని మార్చుకోలేం కదా. పాక్ ఉగ్రవాదం కారణంగా ముస్లింలే ఎక్కువగా చనిపోయారు’ అని పేర్కొన్నారు.
తాను అమెరికాలో ఒబామా, కమలా హారిస్తో భేటీ కానున్నానంటూ వచ్చిన వార్తల్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఖండించారు. ఆ పర్యటన పూర్తిగా తన వ్యక్తిగతమని స్పష్టతనిచ్చారు. ‘నా కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తున్నాను. ఈ నెల 15 వరకు అక్కడే ఉంటాను. అక్కడి రాజకీయ ప్రముఖులతో భేటీ అవుతానన్న ప్రచారంలో మాత్రం నిజం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత పర్యటన. అంతే’ అని తెలిపారు.
బాలీవుడ్లో విషాదం నెలకొంది. టీవీ నటుడు వికాస్ సేథి(48) గుండెపోటుతో మహారాష్ట్ర నాసిక్లో తుదిశ్వాస విడిచారు. హిందీలో ఎన్నో అద్భుతమైన సీరియళ్లలో కీలకపాత్రలు పోషించిన ఆయన పలు సినిమాల్లోనూ నటించారు. కహీ తో, దిల్ న జానే క్యోన్, ఉతరన్, సంస్కార్ లక్ష్మీ, ససురాల్ సిమర్ కా సీరియళ్లు, బాలీవుడ్ మూవీ ‘కభీ ఖుషీ కభీ గమ్’ , తెలుగులో హీరో రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో ధరమ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు.
Sorry, no posts matched your criteria.