news

News September 11, 2024

తండ్రి ఆత్మహత్య.. నటి ఎమోషనల్ పోస్ట్

image

తండ్రి అనిల్ మెహతా <<14074510>>మరణంపై<<>> బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘ఆయన ఎంతో సౌమ్యుడు. ప్రేమగల భర్త, మంచి గ్రాండ్ ఫాదర్, మా బెస్ట్ ఫ్రెండ్. ఈ ఘటనతో మా కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇలాంటి సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, శ్రేయోభిలాషులను కోరుతున్నా. కష్టసమయంలో అండగా నిలిచిన వారందరీకి కృతజ్ఞతలు’ అని ఆమె రాసుకొచ్చారు.

News September 11, 2024

రేపు అమిత్ ‌షాతో సీఎం రేవంత్ భేటీ?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. రేపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆయన కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని వివరించేందుకు షా అపాయింట్‌మెంట్‌ను సీఎంవో కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్రానికి వరద సాయం చేయాలని సీఎం కేంద్రమంత్రిని కోరే ఛాన్సుంది. అటు ప్రధానితో భేటీకి కూడా రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

News September 11, 2024

అటవీ అమరవీరులకు నివాళులు: పవన్

image

AP: అటవీ సంపదను పరిరక్షించడంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయమని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. ‘APలో 37,421 చ.కి.మీ అమూల్యమైన అటవీ సంపదను రక్షించడంలో మన సిబ్బంది ముందంజలో ఉన్నారు. కొందరు ప్రాణత్యాగం చేశారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ సెప్టెంబర్ 11ను జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. వారికి నివాళులర్పిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

News September 11, 2024

‘దేవర’ సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతంటే?

image

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ మూవీ సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. మూవీ రన్ టైమ్ 2.57 గంటలుగా ఉంది. కాగా ఈ నెల 27న దేశ వ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో 55 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది.

News September 11, 2024

DSC అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

TG: DSC అభ్యర్థులు తమ టెట్ వివరాలను ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ తర్వాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. DSCలో వచ్చిన మార్పులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల DSC ఫైనల్ కీ విడుదల కాగా, 2-3 రోజుల్లో ఫలితాలూ రానున్నాయి. ఈ క్రమంలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.

News September 11, 2024

WARNING.. ఇలాంటి కాల్స్‌తో జాగ్రత్త: సజ్జనార్

image

TG: ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ వస్తున్న వాట్సాప్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని TGSRTC MD సజ్జనార్ హెచ్చరించారు. ‘స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశామని, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే చంపేస్తామంటూ తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు పోలీసుల పేరుతో ఫోన్ చేసి భయపెడుతున్నారు. ఇలాంటివి నమ్మకండి. అజ్ఞాత వ్యక్తుల కాల్స్‌కు స్పందించకండి. పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని ఓ ఘటనను ఆయన పంచుకున్నారు.

News September 11, 2024

త్వరలో 4వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: మంత్రి

image

TG: వైద్య, ఆరోగ్య శాఖలో 4వేల పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. వీటిల్లో 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 2030 మంది స్టాఫ్ నర్సులు, మరికొన్ని ఫార్మాసిస్టు పోస్టులు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందన్నారు.

News September 11, 2024

తక్కువ ధరకే మద్యం అందించేలా పాలసీ: కొల్లు రవీంద్ర

image

AP: నాసిరకం మద్యంతో గత YCP ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. సొంత ఆదాయం పెంచుకునేలా లిక్కర్ పాలసీ తెచ్చి ప్రభుత్వ ఆదాయానికి జగన్ గండి కొట్టారని దుయ్యబట్టారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన మద్యం పాలసీ తీసుకొస్తామని తెలిపారు. OCT 1 నుంచే కొత్త విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జగన్ చేసిన తప్పులపై ప్రజలే తమకు రెడ్ బుక్ ఇచ్చారన్నారు.

News September 11, 2024

WT20 WC: 18 ఏళ్లలోపు వారికి ఫ్రీ ఎంట్రీ

image

అక్టోబర్ 3 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ T20 WC మ్యాచ్‌లు చూసేందుకు 18 ఏళ్లలోపు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ICC ప్రకటించింది. మహిళా క్రికెట్‌ చూసేందుకు మరింత మంది అభిమానులు తరలిరావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 18 ఏళ్ల పైనున్న వాళ్లకు ఒక్కో టికెట్ ధర రూ.114 నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొంది. UAE వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో 10 జట్లు 23 మ్యాచ్‌లు ఆడనున్నాయి.

News September 11, 2024

HYDలో రియల్ ఎస్టేట్ పడిపోయింది: హరీశ్

image

TG: హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఫలితంగా మహానగరంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తూ హైదరాబాద్ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని విమర్శించారు. ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలోనూ సీఎం మాట మార్చారని మండిపడ్డారు.