India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సినీ ఇండస్ట్రీలో నెపోటిజం వల్ల తాను కొన్ని అవకాశాలు కోల్పోయినట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ వెల్లడించారు. కానీ ఈ విషయంలో తానెప్పుడూ బాధపడలేదన్నారు. ‘స్టార్ కిడ్స్కు సినిమాల్లో ఈజీగా అవకాశాలు రావడానికి కారణం వారి పేరెంట్స్ పడిన కష్టమే. నేను కూడా భవిష్యత్తులో నా పిల్లలకి అవసరమైతే సాయం చేస్తాను. లైన్లో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పను’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
TG: హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డుల్లోని సమాచారం ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు సాయపడేలా ఉండాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. మొదట వ్యక్తుల పేరు, అడ్రస్, వృత్తి వంటి ప్రాథమిక సమాచారం సేకరించాలని, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, అనారోగ్య కారక అలవాట్లు వంటివి నమోదు చేయాలన్నారు. యూనిక్ నంబర్, బార్ కోడ్, ఫొటోతో హెల్త్ కార్డులను తయారు చేయాలని సూచించారు.
TG: ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నిర్ధారణ, నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లలో అభ్యర్థుల భద్రత, ఫీజులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు తగ్గడంపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజినీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
TG: టెట్ మార్కుల సవరణకు DSC అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు వెబ్సైటులో అభ్యర్థులు టెట్ హాల్టికెట్ నంబర్, మార్కులు, ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 13 తర్వాత మార్పులకు మరో అవకాశం ఉండదని, ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలకు https://schooledu.telangana.gov.in/ISMS/ను చూడండి.
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతాలు అందుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో రూ.30 కోట్లు విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
TG: భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. ఖమ్మం జిల్లాలోని బాధితుల ఖాతాల్లోకి నిన్నటి నుంచి డబ్బులు జమ చేస్తోంది. ఇల్లు డ్యామేజ్ అయితే రూ.16,500, గుడిసెలు కూలితే రూ.18,000 ఇస్తోంది. నిన్న 15వేల మంది ఖాతాల్లోకి రూ.25కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగతా వారికి ఇవాళ జమ అవుతాయని చెబుతున్నారు.
TG: హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్లోని పేదల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చెరువులు, కుంటలు, నాలాల పక్కన అనుమతులు తీసుకున్న, తీసుకోని ఇళ్లు నిర్మించుకున్న పేదలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు ఎప్పుడు తమ ఇళ్లు కూల్చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. కాగా ఆక్రమణదారులను ఎట్టి పరిస్థితుల్లో వదలమని, కోర్టుకు వెళ్లినా కూల్చి తీరుతామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
TG: 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి అక్టోబర్ 8లోపు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. నవంబర్ 10న CBT విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088, వైద్య విధానపరిషత్లో 183, MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 13 పోస్టులున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ <
భర్త నుంచి భరణం వస్తుంది కదా అని సంపాదించుకోవడం ఆపేయడం సరికాదని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. ఉన్నత చదువు, అర్హతలు ఉండి కూడా ఏ పని చేయకపోవడం సరికాదంది. నెలకు ₹60వేల భరణం సరిపోదని, పెంచాలని భార్య హైకోర్టును ఆశ్రయించింది. ‘ఏ కారణం లేకుండానే ఆమె విడిగా ఉంటోంది. గతంలో ఉద్యోగం చేసింది. బ్యూటీ పార్లర్తో బాగానే సంపాదిస్తోంది. భరణం తగ్గించండి’ అని భర్త వాదించగా, కోర్టు ₹40వేలకు తగ్గించింది.
AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఇవాళ కేంద్ర బృందం ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని కమిటీ నష్టం అంచనా వేయనుంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ, బుడమేరు, వ్యవసాయ పంటలు పరిశీలించనుంది. అలాగే గుంటూరు జిల్లాలోని పెదకాకాని కాలువలు, దేవరాయబొట్లపాలెం పంటపొలాలు పరిశీలించి మంగళగిరి ప్రజలతో మాట్లాడనుంది.
Sorry, no posts matched your criteria.